ఎస్.వరలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → , |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 3:
==జీవిత సంగ్రహం==
ఈమె [[1937]] సంవత్సరం [[జగ్గంపేట]]లో జన్మించారు. అలనాటి [[తెలుగు]] కథానాయిక, [[హరిశ్చంద్రుడు|సత్యహరిశ్చంద్ర]]
<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|page=120|edition=కళా ప్రింటర్స్|accessdate=31 July 2017}}</ref>
యస్.వరలక్ష్మి [[గూడవల్లి రామబ్రహ్మం]] ప్రోత్సాహంతో బాలనటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది. మొదటి చిత్రం '[[బాలయోగిని]]' (1937) తర్వాత 'రైతుబిడ్డ' (1939)లో పి.సూరిబాబు కూతురుగా నటించింది. 'ఇల్లాలు'లో ఆమె పాడిన 'కోయిలోకసారొచ్చి కూసిపోయింది' పాటతో పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంది. [[ఎస్.రాజేశ్వరరావు]]తో కలిసి 'శాంత బాలనాగమ్మ' (1942)లో నటించింది. ఆ సినిమాలో రాజేశ్వరరావుతో కలిసి పాడిన పాటలు ఈనాడు లభించటం లేదు. తర్వాత 'మాయాలోకం' (1945)లో నటించినా ఆంధ్రలోకానికి బాగా తెలిసింది '[[పల్నాటి యుద్ధం]]' చిత్రంతోనే. ఈ చిత్రంలోని పాటల్ని [[మద్రాసు]] ఆలిండియా రేడియో వారు రికార్డింగ్ అయిన మరుసటి రోజే ప్రసారం చేశారు. ఆ ఘనత అంతకుముందూ, ఆ తర్వాత కూడా మరెవరికీ దక్కలేదు. అక్కినేని నాగేశ్వరరావు పెళ్ళికి కచేరి చేసింది. [[శివాజీ గణేశన్|శివాజీ గణేశన్]]
ఎస్.వరలక్ష్మి ఎవరినీ ఎక్కువగా కలిసేది కాదు. ఎక్కడికీ వెళ్లేది కాదు. పబ్లిక్ ఫంక్షన్స్ను తప్పించుకునేది. చాలా విషయాల్లో [[కన్నాంబ]]ను ఆదర్శంగా తీసుకునేది. [[శాంతకుమారి]] కూతురు పద్మకు వరలక్ష్మి కూతురు నళినికి స్నేహం. ఎందుకనో వరలక్ష్మి నిజ జీవితం అంత సంతృప్తిగా సాగలేదనిపిస్త్తుంది. ఇంట్లో అన్ని సౌకర్యాలున్నా మానసికంగా ఒంటరితనాన్నే అనుభవించింది. ఆమె ఒక్కగానొక్క కుమారుడు మానసికంగా ఎదగలేదు. ఇది ఆమెను నిరంతరం బాధించేది. ఆమె భర్త పి.ఎల్.శ్రీనివాసన్ (కణ్ణదాసన్ తమ్ముడు) మరణించిన తర్వాత, చాలా ఆస్తి పొగొట్టుకుంది. [[షావుకారు జానకి]], తనూ తెలుగువాళ్లకంటే తమిళులకే ఎక్కువ ఋణపడి ఉన్నామని పదేపదే చెప్పేది. పి.శాంతకుమారి చనిపోయిన రోజు బాధతో ఉపవాసం చేసింది వరలక్ష్మి. 'అందరూ వెళ్లిపోతున్నారు - ఇక చెన్నైలో ఏముంది?' అని నిర్వేదంగా మాట్లాడేది. తెలుగు సినిమా భవనపు పునాదిరాళ్లలో ఎస్.వరలక్ష్మి ఒకరు. ఏ కచేరీలోనూ, ఏ టీవీ ఛానల్ కార్యక్రమాల్లోనూ ఔత్సాహిక గాయనీగాయకులెవరూ వరలక్ష్మి పాటల్ని ఎన్నుకుని పాడరు. ఎందుకంటే అవి పాడటం కష్టం.
|