గిడుగు వేంకట సీతాపతి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 41:
వీరు [[జనవరి 28]], [[1885]] సంవత్సరంలో [[విశాఖపట్నం]] జిల్లా [[భీమునిపట్నం]]లో తెలుగు వ్యావహారిక భాషోద్యమ సారథి అయిన [[గిడుగు వెంకట రామమూర్తి]] దంపతులకు జన్మించారు.
 
[[మద్రాసు క్రైస్తవ కళాశాల]]లో చరిత్రలో [[పట్టభద్రుడు|పట్టభద్రు]]<nowiki/>లై కొంతకాలం [[పర్లాకిమిడి]]లో చరిత్రోపన్యాసకులుగా పనిచేశారు. వ్యావహారిక భాషోద్యమంలోను, [[సవర]] భాషోద్ధరణలోను తండ్రికి కుడిభుజంగా నిలిచి విశేషానుభవం గడించారు. [[రైతుబిడ్డ (1939 సినిమా)|రైతుబిడ్డ]], [[స్వర్గసీమ]], [[పల్నాటి యుద్ధం]], [[భక్తిమాల]] వంటి కొన్ని చలనచిత్రాలలోను, కొన్ని నాటకాలలోను నటించారు.
 
1945లో [[మాగంటి బాపినీడు]] సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్ర సర్వస్వముకు అనేక [[వ్యాసాలు]] రచించి విశేషంగా తోడ్పడ్డారు. 1949లో [[తెలుగు భాషా సమితి]] ఏర్పడినపుడు తెలుగు విజ్ఞాన సర్వస్వపు ప్రధాన సంగ్రాహకులుగా నియమితులయ్యారు. చరిత్ర-రాజనీతి సంపుటం సంపాదక వర్గంలో ప్రముఖపాత్ర వహించారు. [[సూర్యరాయాంధ్ర నిఘంటువు]]కు చివరిదశలో వీరు గౌరవ సంపాదకులుగా పనిచేశారు. [[కేంద్ర సాహిత్య అకాడమీ]] సంకలితం చేసిన భారతీయ గ్రంథసూచిలో తెలుగు విభాగానికి వీరు సంపాదకత్వం వహించారు.
 
వీరు రచించిన [[తెలుగు]] కావ్యాలలో ముఖ్యమైనవి: '[[భారతీ శతకము(గిడుగు సీతాపతి)|భారతీ శతకము]]', 'సరస్వతీ విలాసము', 'కొద్ది మొర్ర'. వీరు రాసిన 'బాలానందము' వంటి బాల [[సాహిత్యం|సాహిత్య]] రచనలు విశేష ప్రజాదరణ పొందాయి. వీరు [[బైబిల్]] లోని మూడు సువార్తలను సవర భాషలోకి అనువదించారు. [[కేంద్ర సాహిత్య అకాడమీ]] వారి అభ్యర్ధనపై [[తెలుగు సాహిత్య చరిత్ర]]ను [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]]<nowiki/>లోకి అనువదించారు. వీరు రచించిన 'తెలుగులో ఛందోరీతులు' అనే గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
 
వీరి కుటుంబం ఆంధ్రాభిమానానికి ప్రసిద్ధికెక్కింది. [[పర్లాకిమిడి]] తాలూకాను [[ఒడిషా]] రాష్ట్రంలో చేర్చడానికి జరిగిన ప్రయత్నాన్ని వీరు, వీరి తండ్రి రామమూర్తి తీవ్రంగా ప్రతిఘటించారు. తెలుగువారి పక్షాన వాదించడానికి 1933లో వీరు [[లండన్]] వెళ్ళి, శామ్యూల్ హోర్ మొదలైన వారి ఎదుట యుక్తిగా వాదించారు. అయినా 1936లో పర్లాకిమిడి తాలూకా ఒడిషా రాష్ట్రంలో భాగంగా ఏర్పడింది.