'''చౌలపల్లి ప్రతాపరెడ్డి''' (Chowlapalli Pratap Reddy) [[మహబూబ్ నగర్ జిల్లా]]<nowiki/>కు చెందిన రాజకీయ నాయకుడు. ఇతను [[జూలై 7]], [[1956]]న<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 22-3-2009</ref> [[షాద్నగర్]] మండలం దూసకల్ గ్రామంలో [[వ్యవసాయం|వ్యవసాయ]] కుటుంబంలో జన్మించాడు. బి.కాం. వరకు విద్యనభ్యసించాడు. 1994లో రాజకీయాలలో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 31-7-2011</ref> 1995 స్థానిక సంస్థల ఎన్నికలలో షాద్నగర్ జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. 2002 నుండి 2004 వరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. 2009 శాసనసభ ఎన్నికలలో [[షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి 9838 ఓట్ల మెజారిటీతో<ref>స్థానిక పాలన, జూన్ 2009, పేజీ 21</ref> ఎన్నికయ్యాడు.