జటప్రోలు సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎స్థాపన: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
[[దస్త్రం:Kollapur palace.JPG|thumbnail|కొల్లాపూరులోని సంస్థానపు రాజభవనము]]
'''జటప్రోలు సంస్థానము''' [[మహబూబ్ నగర్ జిల్లా]]లో [[కృష్ణానది]] తీరాన వెలిసిన ఒక అత్యంత ప్రాచీనమైన చారిత్రక సంస్థానము. ఈ సంస్థానాధీశులు [[కొల్లాపూర్|కొల్లాపూరు]]ను రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని '''కొల్లాపూరు సంస్థానమని'''కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట [[జటప్రోలు]] రాజధానిగా పాలించి తర్వాత కొల్లాపూర్, [[పెంట్లవెల్లి]] రాజధానులుగా పాలించారు. ఈ సంస్థానం [[కృష్ణా నది]] ఒడ్డున ఉన్న సువిశాలమైన [[నల్లమల అడవులు|నల్లమల అటవీ ప్రాంతం]]<nowiki/>నందు విస్తరించి ఉండేది. వీరి పాలన ఎప్పుడు ప్రారంభమైందనే విషయం ఖచ్చింతంగా వెలుగులోకి రాలేదు. అయితే చారిత్రక పరిశోధకుల ప్రకారం క్రీ.శ.6-7 వ శతాబ్దిలో వీరి పాలన ప్రారంభమైనట్లు తెలుస్తుంది. పాలకులందరూ సురభి వంశస్థులే. అందుకే వీరికి సురభి సంస్థానాధీశులందురు. ఈ సంస్థానములో క్రీ.పూ. 2వ శతాబ్దముకు చెందిన పురావస్తు సంపదల ఆనవాళ్లు ఉన్నాయి. 1500 సంవత్సరాలకు పూర్వము కట్టించిన అనేక వందల పురాతన దేవాలయములను నేటికీ ఇక్కడ చూడ వచ్చును. కృష్ణా నది ఒడ్డునే కల సోమశిల దేవాలయం ఈ సంస్థానానికే చెందినది. [[నిజాము]] యొక్క పరిపాలనలో జటప్రోలు సంస్థానము చెప్పుకోదగిన పాత్ర పోషించింది. స్వాతంత్ర్య సమరయోధుడు [[మందుముల నర్సింగరావు]] ఈ సంస్థానాధీశుల బంధువే.<ref>ఈనాడు పత్రిక, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 23-12-2003</ref> ఇతను కొల్లాపూర్ నుంచి ఎన్నికై మంత్రి పదవి కూడా చేపట్టాడు.
[[File:Sri Venugopala Swamy Temple, Jataprolu.jpg|thumb|శ్రీవేణుగోపాలస్వామి దేవాలయం, జటప్రోలు]]
==స్థాపన==
"https://te.wikipedia.org/wiki/జటప్రోలు_సంస్థానం" నుండి వెలికితీశారు