తరిమెల నాగిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 38:
 
== జననం ==
[[అనంతపురం]] జిల్లా [[తరిమెల]] గ్రామంలో [[ఫిబ్రవరి 11]], [[1917]] న రైతు [[కుటుంబము]]<nowiki/>లో జన్మించాడు.
 
పాఠశాల రోజుల నుండే సమాజములోని అసమానతలకు వ్యతిరేకంగా తిరుగుబాటు లక్షణాలు కనబరిచాడు. [[మద్రాసు]]లోని లయోలా కళాశాలలో [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] (10+2) చదివేరోజుల్లో తన జాతీయతా భావాల కారణంగా కళాశాల యాజామాన్యానికి, ఆచార్యులతో నాగిరెడ్డికి పొసగలేదు. లయోలా కళాశాల యాజమాన్యము నాగిరెడ్డికి [[జవహర్ లాల్ నెహ్రూ]] బహిరంగ ఉపన్యాసాలకు హాజరైనందుకూ, రామస్వామి ముదలియారుకు, సత్యమూర్తికి మధ్య జరిగిన ఎన్నికల ప్రచారములో పాల్గొన్నందుకు, వ్యాసరచనా పోటీలలో మహమ్మద్ బిన్ తుగ్లక్‌ను ప్రశంసించినందుకు, అనేకసార్లు [[జరిమానా]] విధించింది.
 
నాగిరెడ్డి లయోలా కళాశాల తరువాత [[వారణాసి]], [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం]]లో విద్యనభ్యసించాడు. వారణాసిలో ఉన్న నాలుగేళ్ళలో నాగిరెడ్డి [[కమలాదేవి ఛటోపాధ్యాయ]], [[లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్|జయప్రకాశ్ నారాయణ్]],అచ్యుత్ పట్వర్ధన్ వంటి వారిచే ప్రభావితుడయ్యాడు. కమ్యూనిజం, మార్క్సిజంతో ఈయనకు వారణాసిలోనే పరిచయమయ్యింది. [[రష్యన్]] విప్లవము, [[స్టాలిన్]] నాయకత్వము గురించి విస్తృతముగా చదివి, [[భారత దేశము|భారతదేశము]]<nowiki/>లో కూడా మార్క్సిజాన్ని అమలుచేయవచ్చని నమ్మటం ప్రారంభించాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఉపకులపతిని నిలదీశారు. [[మహాత్మా గాంధీ|మహాత్మాగాంధీ]]<nowiki/>కి అది తెలిసి తరిమెల నాగిరెడ్డి వైస్ ఛాన్సలర్‌కి క్షమాపణలు చెప్పాలని ఉత్తరం రాశారు. నాగిరెడ్డి అందుకు ఒప్పుకోలేదు. తిరస్కరించారు.
 
నాగిరెడ్డి తన ప్రభుత్వ వ్యతిరేక రాజకీయకలాపల వల్ల అనేకమార్లు [[జైలు]]కు వెళ్లాడు. 1940లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ''యుద్ధం, ఆర్ధిక వ్యవస్థపై దాని ప్రభావం'' అన్న పుస్తకం వ్రాసి ప్రభుత్వము యొక్క ఆగ్రహానికి గురై జైలుకు వెళ్ళాడు. [[తిరుచిరాపల్లి]] జైలునుండి విడుదల కాగానే మరలా 1941లో భారతీయ రక్షణ చట్టము కింద అరెస్టయ్యాడు. 1946లో ప్రకాశం ఆర్డినెన్సు కింద అరెస్టయ్యి 1947లో విడుదల చేయబడ్డాడు.
 
1952లో నాగిరెడ్డి మద్రాసు [[శాసనసభ]]కు [[సి.పి.ఐ]] అభ్యర్థిగా అనంతపురం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. జైలులో ఉండి కూడా, ప్రముఖ కాంగ్రేసు నాయకుడు, తన బావ అయిన [[నీలం సంజీవరెడ్డి]]<nowiki/>పై విజయం సాధించి సంచలనం సృష్టించాడు. 1955లో కొత్తగా ఏర్పడిన [[పుట్లూరు]] నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసి తరిమెల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయాడు. 1957లో [[అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం]] నుండి 2వ [[లోక్‌సభ]]కు ఎన్నికయ్యాడు. తిరిగి 1962లో [[పుట్లూరు]] నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సి.పి.ఐ అభ్యర్థిగా పోటీచేసి తరిమెల రామచంద్రారెడ్డి ఓడించి ఎన్నికైనాడు. 1967లో నియోజకవర్గాల పునర్విభజనలో పుట్లూరు నియోజకవర్గం రద్దుకాగా, [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)|సి.పి.ఐ (ఎం)]] అభ్యర్థిగా [[అనంతపురం]] నియోజకవర్గం నుండి మూడో పర్యాయం శాసనసభకు ఎన్నికయ్యాడు. 1969లో మార్చి నెలలో శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారు.
 
1968లో నాగిరెడ్డి సి.పి.ఐ (ఎం) నుండి విడిపోయి [[ఆంధ్ర ప్రదేశ్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిష్ట్ రెవల్యూషనరీస్]]‌ (ఎ.పి.సి.సి.ఆర్) - ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిష్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీ‌ని స్థాపించాడు. సి.పి.ఐ (ఎం) కార్యకర్తలను కొత్తపార్టీలోకి ఆకర్షించడంలో సఫలం అయ్యాడు. కొద్దికాలం ఎ.పి.సి.సి.ఆర్ [[అఖిల భారత కమ్యూనిష్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీ]]లో కలసివుంది. రెడ్డి 1976లో తను మరణించేదాకా ఎ.పి.సి.సి.ఆర్ నాయకునిగా కొనసాగాడు.
"https://te.wikipedia.org/wiki/తరిమెల_నాగిరెడ్డి" నుండి వెలికితీశారు