దక్షుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
'''[[దక్షుడు]]''' [[బ్రహ్మ]] కుడి [[బొటనవేలు]] నుండి పుట్టాడు. అశిక్ని/వీరణి/ధరణిని పెండ్లాడాడు.వీరికి కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ మొదలైన యాబైమంది కుమార్తెలు, ఐదుగురు కుమారులు జన్మించారు.వీరియందు ఎనిమిదిమంది ముఖ్యులు.వీరిలో సతియను ఆమె పెద్దది.ఆమెను [[శివుడు|శివు]]<nowiki/>ని కిచ్చి పెళ్ళి చేసెను.యజ్ఞం చేసి తన కూతురు సతీదేవిని, అల్లుడు [[శివుడు|శివుడి]]నీ ఆహ్వానించడు. పిలువకుండానే యజ్ఞానికి వచ్చిన సతీదేవిని [[దక్షుడు]] అవమానించగా, ఆమె యోగాగ్నిలో దగ్ధమైపోతుంది. దానికి కోపించి, శివుడు [[వీరభద్రుడు|వీరభద్రుని]] పంపి యజ్ఞాన్ని ధ్వంసం చేయిస్తాడు. దక్షుడు శివుడిచేత సంహరింపబడతాడు. తరువాత [[దేవతలు]] [[మేక]] తలకాయ తెచ్చి దక్షుణ్ణి బ్రతికిస్తారు. అందుకే ఇతన్ని 'అజముఖుడు' అనికూడా అంటారు.
==దక్ష యజ్ఞం==
దక్షుడు ప్రజాపతుల్లో ఒకడు. దక్షుడి చిన్న కూతురు సతీదేవి/దాక్షాయణి. ఆమె వివాహం చేసుకుంటే శివుణ్ణే చేసుకుంటానని పట్టుబడుతుంది. దక్షుడు అందుకు అంగీకరించడు. కానీ ఆమె అందుకు తండ్రితో విభేదించి శివుణ్ణి [[పెళ్ళి|వివాహం]] చేసుకుంటుంది. కానీ దక్షుడు మాత్రం శివుణ్ణి ద్వేషించేవాడు. శరీరమంతా [[బూడిద]] పూసుకుని, శ్మశానాల వెంట తిరిగే వాడని దూషించేవాడు. అప్పటి నుంచే తన అల్లుడుకీ, [[కూతురు]]కి కూడా దూరమయ్యాడు. దక్షయజ్ఞంతో ఈ వివాదం మరింత ముదిరింది.
పంక్తి 5:
 
1. నవబ్రహ్మలలో (లేక ప్రజాపతులలో) ఒక్కఁడు. కొందఱు ఇతఁడు [[బ్రహ్మ]]యొక్క అంగుష్ఠముననుండి పుట్టినవాఁడు అంటారు. కొందఱు బ్రహ్మమానసపుత్రుఁడు అంటారు. ఇతని భార్య ప్రసూతి. విష్ణుపురాణప్రకారము [[దక్షప్రజాపతి]]కి కొమార్తెలు ఇరువదినలువురు. వారిలో శ్రద్ధ, [[లక్ష్మి]], ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, [[బుద్ధి]], [[లజ్జ]], వపువు, [[శాంతి]], సిద్ధి, కీర్తి ఈపదిమువ్వురు ధర్ముని భార్యలు. (ధర్మద్వారములని ఎఱఁగవలయును.) ఈవీరియందు ధర్మునకు పుట్టిన పుత్రులు క్రమముగా కాముఁడు, దర్పుఁడు, నియముఁడు, సంతోషుఁడు, లోభుఁడు, శ్రుతుఁడు, దండుడు, బోధుఁడు, వినయుఁడు, వ్యవసాయుఁడు, క్షేముఁడు, సుఖుఁడు, యశుఁడు.
2. ఇతఁడు ప్రచేతస్సులకు చంద్రుని (సోముని) కూఁతురు అగు మారిషయందు పుట్టిన కొడుకు. ఈయన చక్షుర్మనువు [[కాలము]]<nowiki/>న ఉండినట్లు కొందఱు చెప్పుదురు. ఇతఁడు బ్రహ్మయాజ్ఞపడసి మైథునక్రియవలన సృష్టిచేయ ఆరంభించెను. తత్పూర్వము సంతానము దృష్టిసర్శేచ్ఛాదులవలన కలుగుచు ఉండినట్టు తెలియవచ్చుచున్నది. ఈతఁడు వీరణప్రజాపతి కూఁతురు అగు అసిక్నిని భార్యగా గ్రహించి ఆమె యందు తొలుత హర్యశ్వులు అను ననేక [[పుత్రులు|పుత్రుల]]<nowiki/>ను పడసెను. వారు అందఱును నారదుని ఉపదేశమున ప్రజాసృష్టియందు ఇచ్ఛ ఉడిగిరి. మరల శబలాశ్వులు అను ననేక పుత్రులను పుట్టించెను. వారలును అట్ల అయిరి. అంత దక్షుఁడు నారదుని మీద కోపించి అతనికి అనపత్యతయును నిరంతర సంచారమును కలుగునట్లు శపించి అఱువండ్రు కొమార్తలను అసిక్నియందు పుట్టించెను. అందు ధర్మునికి పదుగురను, కశ్యపునికి పదుమువ్వురను, చంద్రునకు ఇరువదియేడుగురను, అరిష్టనేమికి నలుగురను, అంగిరసునకు ఇరువురను, కృశాశ్వునకు ఇరువురను, బహుపుత్రునకు ఇరువురను ఇచ్చి వివాహములు చేయించెను. శ్రీమద్భాగవతమున తార్క్ష్యుఁడు అను నామాంతరము తాల్చిన కశ్యపునకు మరల నలుగురు కొమార్తెలను ఇచ్చినట్లు చెప్పి ఉంది. (ధర్ముని భార్యలు 10మందా 13గురా???)
 
ధర్ముని భార్యలు వారిసంతతి
పంక్తి 23:
కశ్యపుని పదుమువ్వురు భార్యల నామములను గూర్చి. చూ|| కశ్యపుఁడు.
 
తొల్లి దక్షుఁడు [[యజ్ఞం|యాగము]] చేసినపుడు [[రుద్రుడు|రుద్రు]]<nowiki/>నికి హవిర్భాగము ఇయ్యనందున అతినికి మరల జన్మము కలిగెను అని అంటారు.
 
[[శ్రీమద్భాగవతము]]<nowiki/>న [[అరుంధతి]]<nowiki/>ని దక్షపుత్రిగా చెప్పి ఉండలేదు. ఆమెకు మారు కకుబ్దేవిని చెప్పి ఉంది. కకుబ్దేవికి సంకటుఁడును, సంకటునకు కీకటుఁడును, కీకటునకు దుర్గాభిమానులైన దేవతులును పుట్టినట్లు చెప్పి ఉంది. మఱియు యామి సంతతికి స్వర్గుఁడు, నది అను నిరువురు పుట్టినట్లును సంకల్పకు కాముఁడు పుట్టినట్లును [[శ్రీమద్భాగవతము]]<nowiki/>వలన తెలియఁబడుచు ఉంది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/దక్షుడు" నుండి వెలికితీశారు