దాసరి నాగభూషణరావు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 5:
మార్క్సిజం ప్రభావితుడై విప్లవ రాజకీయాలకు జీవితం అంకితం చేసిన దాసరి నాగభూషణరావు 1925 సంవత్సరంలో [[నూజివీడు]] తాలూకా [[దిగవల్లి]] గ్రామంలో జన్మించాడు. అతను విద్యార్థి దశ నుంచే విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేసేవారు. అనంతరం వామపక్ష పార్టీల భావాలకు ఆకర్షితులై కమ్యూనిస్టు పార్టీల సంఘాల్లో చేరి చురుకుగా పని చేశాడు. అతని నేతృత్వంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో భూపోరాటం నిర్వహించి పేదలకు భూములు పంచడం జరిగింది.
 
అతను ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్‌]]<nowiki/>లో నిరుపేదల పక్షాన నిలిచి భూపోరాటాల ద్వారా విజయం సాధించిన గొప్ప విప్లవ యోధుడు. అఖిల భారత విద్యార్థి సంఘానికి, ప్రపంచ విద్యార్థి సమాఖ్యకు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాడు. నూజివీడు తాలూకా కమ్యూనిస్టు కార్యదర్శిగా పనిచేస్తూ ఆ ప్రాంతంలో 20వేల ఎకరాలకు పైగా భూమిని దళితులు, బీసీలకు పంపిణీ చేయడంలో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగించాడు. <ref>{{Cite web|url=http://www.prajasakti.com/WEBSUBCONT/2134841|title=భూపోరాట యోధుడు దాసరి {{!}} Prajasakti::Telugu Daily|website=www.prajasakti.com|access-date=2020-07-02}}</ref>
 
కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు చండ్ర రాజేశ్వరరావు, మాలెంపాటి బాలభాస్కరరావు ఆధ్వర్యాన చల్లపల్లి జమిందార్‌ భూములను పేదలకు పంచాలని చేసిన భూపోరాటంలో దాసరి నాగభూషణరావు కూడా అగ్రభాగాన నిలిచాడు. అతను రాజ్యసభ సభ్యునిగా ఉన్నకాలంలో అన్ని ప్రాతాలకు నిధులు కేటాయించిన నాయకునిగా కీర్తింపబడ్డాడు. <ref>{{Cite web|url=https://www.todaynewshub.com/2019/04/28/%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b0%e0%b0%be%e0%b0%9f-%e0%b0%af%e0%b1%8b%e0%b0%a7%e0%b1%81%e0%b0%a1%e0%b1%81-%e0%b0%a6%e0%b0%be%e0%b0%b8%e0%b0%b0%e0%b0%bf/|title=పోరాట యోధుడు ‘దాసరి’|last=admin|date=2019-04-28|website=TodayNewsHub|language=en-US|access-date=2020-07-02}}</ref>
"https://te.wikipedia.org/wiki/దాసరి_నాగభూషణరావు" నుండి వెలికితీశారు