బూర్గుల రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
ట్యాగులు: తిరగ్గొట్టారు PAWS [1.2]
పంక్తి 5:
 
== రాజకీయ జీవితం ==
[[1912]]లో వివాహం జరిగింది. ఆమె [[1920]]లో మరణించడంతో, [[1924]]లో మళ్ళీపెళ్ళి చేసుకున్నాడు. [[1923]]లో [[హైదరాబాదు]]<nowiki/>లో న్యాయవాద వృత్తి ప్రారంభించి అగ్రస్థాయికి చేరాడు. [[న్యాయవాది]]గా ఉంటూనే, రాజకీయాల్లో పాల్గొనడం జరిగింది. [[ఆంధ్రోద్యమం]], [[గ్రంథాలయోద్యమం]], [[భూదానోద్యమం]] మొదలైన వాటిలో పాల్గొన్నాడు. [[మాడపాటి హనుమంతరావు]], [[సురవరం ప్రతాపరెడ్డి]] మొదలైన వారితో కలిసి పనిచేసాడు. [[శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం]]కు అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసాడు.
 
[[హైదరాబాదు]] రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖుడు. పార్టీ తరపున ఆయన అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించాడు. [[1931]]లో [[నల్గొండ]] జిల్లా [[దేవరకొండ]]లో జరిగిన [[రెండవ ఆంధ్రమహాసభ]]కు బూర్గుల అధ్యక్షత వహించాడు. శాసనోల్లంఘన ఉద్యమంలోను, [[క్విట్ ఇండియా ఉద్యమం]]లోను పాల్గొని కారాగారవాసం అనుభవించాడు. [[1948]]లో [[పోలీసు చర్య]] తరువాత [[హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు]] అయి, [[వెల్లోడి]] [[ముఖ్యమంత్రి]]<nowiki/>గా సైనిక ప్రభుత్వం ఏర్పడినపుడు, ఆయన రెవిన్యూ, విద్యాశాఖల మంత్రి అయ్యాడు. రెవెన్యూ మంత్రిగా వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగుయోధులు, ఆంధ్ర ప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సిసైటి ప్రచురణ, ప్రథమ ముద్రణ 2006, పేజీ 222</ref>
 
[[1952]]లో మొదటిసారి [[హైదరాబాదు రాష్ట్రం|హైదరాబాదు రాష్ట్రానికి]] ఎన్నికలు జరిగిపుడు, మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో [[ముఖ్యమంత్రి]] అయ్యాడు.<ref name="బూర్గుల మంత్రివర్గం, సంస్కరణలు">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=బూర్గుల మంత్రివర్గం, సంస్కరణలు|url=https://www.ntnews.com/m/Nipuna-Education/%E0%B0%AC%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82-%E0%B0%B8%E0%B0%82%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3%E0%B0%B2%E0%B1%81-15-2-477509.aspx|accessdate=15 June 2017}}</ref> పూర్తి మెజారిటీ లేకున్ననూ, [[బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గం|మంత్రివర్గంలో]] సంపూర్ణ సహకారం లేకున్ననూ, పరిపాలన దక్షుడైన ముఖ్యమంత్రిగా పేరుగాంచాడు.<ref>ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్ర, జి.వెంకటరామారావు రచన, ప్రథమ ముద్రణ 2000, పేజీ 56</ref> [[1956]]లో హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, కోస్తా, రాయలసీమ లతో కలిపి [[ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ|ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు]] అయినపుడు, కొత్త రాష్ట్రానికి [[నీలం సంజీవరెడ్డి]] ముఖ్యమంత్రి అయ్యాడు. బూర్గుల, [[కేరళ]] రాష్ట్రానికి [[గవర్నరు]]గా వెళ్ళాడు. [[1960]] వరకు కేరళ గవర్నరుగా పనిచేసి, తరువాత [[1962]] వరకు [[ఉత్తర ప్రదేశ్]] గవర్నరుగా పనిచేసాడు.
[[File:Burgula Ramakrishna Rao 2000 stamp of India.jpg|right|thumb|150px|తపాలాశాఖ 2000లో విడుదల చేసిన తపాలాబిళ్ళ]]
[[1948]] జనవరిలో ప్రభుత్వ ఏజెంట్ జనరల్‌గా [[హైదరాబాద్]] వచ్చిన కె.యం. మున్షీని నిజాం ఆజ్ఞలకు విరుద్ధంగా అందరికన్నా ముందే సందర్శించి పాలకుల ఆగ్రహానికి గురయ్యారు. ఆ [[సంవత్సరం]]<nowiki/>లోనే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడై ప్రజా ఉద్యమానికి సారథ్యం వహించాడు. హైదరాబాద్ సంస్థానం [[భారతదేశం]]<nowiki/>లో విలీనం కావడానికి కృషి సల్పిన తీరు విశేషమైనది. రాజకీయ రంగంలోనే కాకుండా సాంఘిక సాంస్కృతిక రంగాల్లో వీరు చేపట్టిన సేవ ప్రత్యేకమైనది. ఖాదీ బోర్డు విచారణ సంఘం, [[మధ్యప్రదేశ్]] విషయ పరిశీలన సంఘం, ఆంధ్రప్రదేశ్ భారత్ సేవక సమాజం అధ్యక్షులుగా ఉన్నాడు. చరిత్ర, శాస్త్ర విజ్ఞానాల తెలుగు [[ఉర్దూ అకాడమీ]], భారతీయ విద్యాభవన్, ప్రశాంతి విద్వత్ పరిషత్ అధ్యక్షులుగా గొప్ప సాంస్కృతిక సేవలందించాడు. క్లాసికల్ లాంగ్వేజి కమిషన్ సభ్యులుగా, [[దక్షిణ భారత హిందీ ప్రచార సభ]], [[సంస్కృత పరిషత్‌]]ల ఉపాధ్యక్షులుగా భాషా సేవలు అందించాడు.
 
== సాహితీ వ్యాసంగం ==
బూర్గుల బహుభాషావేత్త, సాహితీవేత్త. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మరాఠీ, ఉర్దూ, పారశీక, సంస్కృత భాషల్లో బూర్గులకు ప్రావీణ్యం ఉంది. మహారాష్ట్రలో చదివే రోజుల్లోనే ఆంగ్లంలో కవితలు రాసేవాడు. పారశీక వాజ్మయ చరిత్ర ఆయన రచనలలో పేరు పొందినది. జగన్నాథ పండితరాయల [[లహరీపంచకము]]ను, [[ఆది శంకరాచార్య|శంకరాచార్యుల]] [[సౌందర్యలహరి]], [[కనకధారా స్తోత్రం|కనకధారారాస్తవము]]ను [[తెలుగు]]లోకి అనువదించాడు. కృష్ణ శతకం, [[సంస్కృతము|సంస్కృతం]]<nowiki/>లో శ్రీ [[వెంకటేశ్వర సుప్రభాతం]], [[శారదస్తుతి]], [[గౌరీస్తుతి]], [[వాణీస్తుతి]], [[లక్ష్మీస్తుతి]], [[శ్రీకృష్ణాష్టకం]], రెడ్డి రాజుల కాలం-మత సంస్కృతులు (పరిశోధనా వ్యాసం) మొదలైనవి ఆయన ఇతర రచనలు. ఈయన రచించిన వ్యాసాలు 'సారస్వత వ్యాస ముక్తావళి' పేరుతో అచ్చయింది. పండిత రాజ పంచామృతం, [[కృష్ణశతకం]], [[వేంకటేశ్వర సుప్రభాతం]], నర్మద్‌గీతాలు, పుష్పాంజలి, తొలిచుక్క (కవితలు), నివేదన (కవితలు), పారశీక వాఙ్మయ చరిత్ర మొదలైన గ్రంథాలు వెలువరించడమే కాకుండా ఎన్నో కావ్యాలకు పీఠికలు రాశాడు. అనువాద రచనలు కూడా చేశాడు. [[వానమామలై]], [[కాళోజీ]], [[దాశరథి]], [[నారాయణరెడ్డి]] ప్రోత్సాహంతో 'తెలంగాణ రచయితల సంఘం' ఏర్పాటు చేసి సాహితీలోక ప్రసిద్ధుడయ్యాడు.
 
== పురస్కారాలు ==