బొబ్బిలి యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 20:
|cause= విజయనగరం సంస్థానానికి శ్రీకాకుళం మరియు రాజమండ్రి సర్కార్లను లీజుకొరకు ఫ్రెంచ్ అగ్రిమెంటు.
}}
'''[[బొబ్బిలి యుద్ధం|బొబ్బిలి యుద్ధం,]]''' [[ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర|ఆంధ్రప్రదేశ్ చరిత్ర]]<nowiki/>లో ఒక ప్రముఖ ఘట్టం. 1757 జనవరి 24<ref name=":0">{{Cite book|title=మెడ్రాస్ డిస్ట్రిక్ట్ గెజెటీర్స్ విజాగపటం సంపుటి - 1|last=డబ్ల్యు|first=ఫ్రాన్సిస్|publisher=|year=1907|isbn=|location=https://archive.org/stream/in.ernet.dli.2015.207070/2015.207070.Madras-District#page/n257/mode/2up/search/bobbili|pages=237}}</ref> న [[బొబ్బిలి]] సంస్థాన సైన్యానికి, [[ఫ్రెంచి]], విజయనగర సంస్థాన సంయుక్త సైన్యానికీ మధ్య జరిగిన యుద్ధమే బొబ్బిలి యుద్ధంగా పేరుగాంచింది.
 
[[బొబ్బిలి]] కోట [[విశాఖపట్నం|విశాఖపట్నానికి]] [[ఈశాన్యం]]<nowiki/>గా 140 మైళ్ళ దూరంలో ఉంది.18 వశతాబ్ది మధ్య కాలంలో [[బొబ్బిలి]] [[జమీందారు]]<nowiki/>గా ఉన్న రాజా గోపాలకృష్ణ రంగారావుకు, [[విజయనగరం|విజయనగర]] సంస్థానం ప్రభువు పూసపాటి పెద విజయరామరాజుకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది. రెండు రాజ్యాల సరిహద్దుల వద్ద ఉన్న వాగుల్లోని నీటిని బొబ్బిలి ప్రజలు బలవంతంగా తీసుకు వెళ్ళేవారు.తన బలం చాలనందున విజయరామరాజు ఈ దోపిడీని ఎదుర్కొనలేకపోయేవాడు. ఫ్రెంచి కమాండర్ ఇన్ ఛీఫ్ [[మార్కీస్ దే బుస్సీ|బుస్సీ]] వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని, పక్కలో బల్లెంలా ఉన్న తన పొరుగు రాజును ఇక్కడి నుండి తరిమికొట్టాలని పెద విజయరామరాజు భావించాడు. బొబ్బిలి పాలకులు మిగిలిన జమీందార్ల లాగా [[ఫ్రెంచి]] వారితో సత్సంబంధాలు నెలకొల్పుకోక, తమ చర్యల ద్వారా ఫ్రెంచి కమాండర్ ఇన్ ఛీఫ్, [[మార్కీస్ దే బుస్సీ|మార్క్ దీ బుస్సీ]]<nowiki/>తో శత్రుత్వాన్ని పెంచుకున్నారు. ఈ చర్యలన్నిటి పర్యవసానమే '''బొబ్బిలి యుద్ధం'''.భారత దేశ [[చరిత్ర]]<nowiki/>లో మున్నెన్నడూ ఎరగని సంఘటనను ఆవిష్కరించిన [[యుద్ధం]] ఇది. అనేక జానపద గాథలకు ప్రాణం పోసిన బీభత్స కాండ ఈ యుద్ధంలో జరిగింది.<ref name=":0" />
 
 
పంక్తి 29:
# పెద విజయరామరాజు, నారాయణపట్నాన్ని ఆక్రమించేందుకు సాగి నారాయణరాజు నేతృత్వంలో సైన్యాన్ని పంపించాడు. ఆ సైన్యం బొబ్బిలి పరగణా గుండా పోతున్నపుడు, బొబ్బిలి సైన్యం అడ్డగించి, ఓడించి వెనక్కు పంపింది.
# రాజు తన కింద ఉన్న పాలెగాళ్ళను కూడగట్టి పెద్ద సైన్యంతో బొబ్బిలిపై దాడి చేసాడు. మళ్ళీ బొబ్బిలి సైన్యం చేతిలో ఓడిపోయాడు. బొబ్బిలి సైన్యం రాజును వెంటాడగా, అతడు పారిపోయి కమిలీ కోటలో తలదాచుకున్నాడు.
# రాజు [[పార్వతీపురం|పార్వతీపురాని]]<nowiki/>కి దగ్గర్లోని బెలగం వద్ద కోటను నిర్మించి నారాయణ పట్నాన్ని ఆక్రమించాడు. అక్కడి నుండి బొబ్బిలిపై దాడి చేసాడుగాని, విఫలుడయ్యాడు. ఈ యుద్ధాల్లోగానీ, [[నారాయణపట్నం]]<nowiki/>లో మురికినీళ్ళు తాగడం వలన వచ్చిన రోగాల వలన గానీ 4,000 మంది దాకా సైనికులను కోల్పోయాడు. నారాయణపట్నం ప్రభువు తన తప్పును అంగీకరించి క్షమించమని అడిగాక పరిహారం వసూలుచేసి, అతడి రాజ్యాన్ని అతడికి ఇచ్చివేసాడు.
# విజయరామరాజు మళ్ళీ తన సైన్యాన్ని కూడగట్టి బొబ్బిలిపై దాడి తలపెట్టాడు. ఈ సారి అతడు ''దేశస్తుల''ను కూడగట్టాడు. ''దేశస్తులం''టే [[ఐరోపా]] వారితో యుద్ధాల్లో పాల్గొన్న దేశీయులు. కానీ బొబ్బిలిని ఓడించడం సాధ్యం కానిపని వారు రాజును  హెచ్చరించారు. తన దీవాను బుర్రా బుచ్చన్న సలహా మేరకు తానుకాక, పూసపాటి రామచంద్రరాజు సారథ్యంలో సైన్యాన్ని దాడి పంపించాడు. బొబ్బిలి సైన్యం వారిని ఓడించి, రామచంద్రరాజు తలను నరికి, దానికి తిరునామాలు పెట్టి, విజయనగరానికి పంపారు.<ref>[https://archive.org/stream/revisedenlargeda00rang#page/60/mode/2up బొబ్బిలి జమీందారీ గురించిన విపులమైన విశేషాలు]</ref>
ఎన్ని ప్రయత్నాలు చేసినా బొబ్బిలిపై పైచేయి సాధించలేకపోయాడు, విజయరామరాజు.
పంక్తి 36:
 
=== బుస్సీ వద్ద రాజకీయం ===
[[హైదరాబాదు]] [[నిజాం]] [[సలాబత్ జంగ్]] [[బుస్సీ]]<nowiki/>ని ఉద్యోగం నుండి తొలగించిన వార్త తెలిసిన తరువాత [[విజయనగరం]] రాజులు తప్ప, ఉత్తర కోస్తా జమీందారు లందరూ ఫ్రెంచి వారికి శిస్తులు చెల్లించడం మానివేశారు. బుస్సీ [[నిజాం|నిజాము]]<nowiki/>తో రాజీ కుదుర్చుకుని, సర్కారు జిల్లాల పర్యటనకు వచ్చాడు. 1757 లో బుస్సీ నిజాము సంస్థానం నుండి బయల్దేరి [[మచిలీపట్నం]] మీదుగా [[రాజమండ్రి]] చేరుకుని, [[కోటిపల్లి]] వద్ద మకాం వేసాడు. [[పాలెగాళ్లు|పాలెగాళ్ళ]]<nowiki/>ను, జమీందార్లను, సంస్థానాధీశులను వచ్చి తనను కలవమని కబురు పంపాడు. బొబ్బిలి పాలకుడు [[రంగారావు]] తప్ప, విజయరామరాజుతో సహా అందరూ వచ్చి కలిసారు. విజయరామరాజు దీన్ని అవకాశంగా తీసుకుని రంగారావుకు వ్యతిరేకంగా బుస్సీ వద్ద, అతడి దివాను హైదర్ జంగు వద్దా ఆరోపణలు చేసాడు. మీరంటే వారికి లెక్కలేదని అందుచేతే మీ వద్దకు వచ్చి కలవలేదనీ, ఫ్రెంచి వారికి ఇవ్వాల్సిన శిస్తు సరిగా చెల్లించడం లేదనీ వారికి నూరిపోసాడు. వారి రాజ్యానికి పొరుగున ఉన్న తనకు అనేక రకాల ఇబ్బందులు కలగజేస్తున్నారని, వారిని బొబ్బిలి నుండి వెళ్ళగొట్టి, దాన్ని తనకు స్వాధీనం చేస్తే, శిస్తు సక్రమంగా చెల్లిస్తాననీ అతడు బుస్సీకి చెప్పాడు. దాంతో బుస్సీ, బొబ్బిలి వదలిపెట్టి పోవాలని రంగారావును ఆదేశించాడు. బొబ్బిలి స్థానంలో అంతకంటే పెద్దదైన వేరే స్థలానికి పోయి రాజ్యాన్ని స్థాపించుకోవచ్చని ప్రతిపాదించాడు. రంగారావు దాన్ని అవమానంగా భావించాడు.
 
విజయరామరాజు తాను [[మార్కీస్ దే బుస్సీ|బుస్సీ]]<nowiki/>కి కట్టాల్సిన కప్పం పది లక్షలూ కట్టేసాడు, అంతేకాక, మూడు లక్షల లంచం హైదర్ జంగుకు ఇచ్చి, బుస్సీకి బొబ్బిలిపై మనసు విరిచేందుకు సహకరించమని చెప్పాడు. హైదర్ జంగు అందుకంగీకరించాడు.
 
=== ఫ్రెంచి సిపాయీల వధ ===
పంక్తి 44:
 
=== ఇబ్రహీమ్ ఖాన్ ఉదంతం ===
ఇబ్రహీం ఖాన్ [[శ్రీకాకుళం]]<nowiki/>లో ఫ్రెంచి వారి తరపున ఫౌజుదారు. బుస్సీకి [[నిజాం|నిజాము]]<nowiki/>తో సంబంధాలు దెబ్బతిన్న సమయంలో అతడు బుస్సీపై తిరుగుబాటు చేసాడు. [[రాజమండ్రి]] కోటలో సైనికులను రెచ్చగొట్టి, తిరుగుబాటు చేయించాడు. ఫ్రెంచి వారు వసూలు చేసిన శిస్తులు వెనక్కి ఇచ్చేయాలని అతడు డిమాండు చేసాడు. బుస్సీ [[రాజమండ్రి]] చేరుకోగానే అతడు భయపడి పారిపోయి, బొబ్బిలి రాజుల వద్ద శరణు కోరాడు.
 
ఈ సంఘటనలన్నీ బుస్సీకి బొబ్బిలిపై ఉన్న కోపాన్ని పెంచి, వారిపట్ల అతడికి ఉన్న శత్రు భావనను మరింతగా పెంచి, అతణ్ణి, యుద్ధం దిశగా నడిపించాయి.
పంక్తి 59:
బుచ్చన్న అట్నుంచటే నేరుగా మచిలీపట్నం వెళ్ళి కమాండరును కలిసి, ఉత్తరం ఇచ్చి, జరిగింది చెప్పాడు. కమాండరు బుస్సీకి తాను ఉత్తరం రాసి, తన అనుచరుణ్ణి బుచ్చన్నకు తోడిచ్చి [[పెద్దాపురం మండలం|పెద్దాపురం]] పంపాడు. బొబ్బిలి ప్రజలు మంచివాళ్ళని,  విజయరామరాజు చెప్పుడు మాటలు వినవద్దని ఆ ఉత్తరంలో రాసాడు. బుస్సీ ఆ ఉత్తరాన్ని చదివి సానుకూలంగానే మాట్లాడాడుగానీ, అతని చర్యల్లో ఆ సానుకూలత కనిపించలేదు.
 
ఆ సాయంత్రం, విజయరామరాజు హైదర్ జంగును కలిసి, ''చూసారా నేను చెప్పిందే నిజమైంది, రంగారావు మిమ్మల్ని కలవడానికి రాకుండా, కమాండరు ద్వారా బుస్సీకి ఉత్తరం పంపించాడు, అతడికి మీరంటే లెక్కే లేదు'' అని అతణ్ణి రెచ్చగొట్టాడు. బుస్సీ [[కశింకోట]] నుండి బయలుదేరి, [[దేవుపల్లి]]<nowiki/>లో మకాం పెట్టినపుడు, రంగారావు చెలికాని వెంకయ్య ద్వారా గౌరవ పురస్సరంగా అతడి వద్దకు పాన్ సుపారీ పంపించాడు. హైదర్ జంగు అతణ్ణి మీ దొర కోటను వదలిపెట్టి వెళ్ళాడా లేదా అని గద్దించాడు. మాకు కోటను విడిచి వెళ్ళే  అవసరం లేదని,  వెళ్ళే ప్రసక్తే లేదనీ అతడు తెగేసి చెప్పి వెళ్ళిపోయాడు.
 
బుస్సీ అక్కడి నుండి ససైన్యంగా బొబ్బిలి వెళ్ళి కోట ఎదురుగా శిబిరం విడిచాడు. అప్పుడు కోట గోడపైనుండి [[వెలమ]] దొరలు మొగలు చక్రవర్తి తమకు బహూకరించిన నౌబత్తును (దుందుభి, భేరి వంటి పెద్ద చర్మ వాయిద్యం) మోగించారు, హైదర్ జంగుకు అది విని [[ఆగ్రహం]] కలిగింది. హుసేన్ ఆలీ ఖాన్‌ను రాయబారిగా కోటలోకి పంపించాడు. నౌబత్తును ఆపి, కోటను ఖాళీ చేసి వెళ్ళమని రాయబారి రంగారావుకు  చెప్పాడు.
పంక్తి 74:
బొబ్బిలి యుద్ధం 1757 జనవరి 24 న తెల్లవారుతూండగానే మొదలై సాయంత్రానికి ముగిసింది.
 
ఫ్రెంచి ఫిరంగులు బొబ్బిలి [[కోట]]<nowiki/>ను బీటలు వార్చడానికి పెద్దగా సమయం పట్టలేదు. అయితే బొబ్బిలి వీరుల ప్రతిఘటన కారణంగా ఫ్రెంచి వారు కోటలోపలికి ప్రవేశించలేకపోయారు. 9 గంటల ప్రాంతంలో యుద్ధానికి కొంత విరామం ప్రకటించి, ఫిరంగులను ప్రయోగించాక, మళ్ళీ కొనసాగించారు. 2 గంటలకు మరో విరామం ప్రకటించేవరకూ కూడా ఫ్రెంచి సైన్యం కోటలోకి ప్రవేశించలేకపోయింది.[[దస్త్రం:Thandra Paparayudu of Bobbili.jpg|thumb|తాండ్ర పాపయ్య]]
=== కోటలో బీభత్సం ===
ఆ సమయంలో రంగారావు తన ముఖ్య సేనానులను, అనుచరులను సమావేశపరచి, ఓటమి అనివార్యమని చెప్పి, తదుపరి కర్తవ్యం గురించి వారికి చెప్పాడు, అందరూ రంగారావు చెప్పినదానికి అంగీకరించారు. ఓటమి తరవాత, తామ స్త్రీలు, పిల్లలు శత్రువు చేతికి చిక్కి అవమానాల పాలు కాకూడదని భావించిన బొబ్బిలి వీరులు, కోటలోపల ఉన్న తమ నివాసాలకు నిప్పు పెట్టారు. మంటలకు తాళలేక బయటకు వచ్చే వారిని కత్తులతో పొడిచి చంపారు. ఆలా కోటలో ఏ ఒక్క స్త్రీ, గానీ, పిల్లవాడు గానీ బ్రతకలేదు, ఒక్క రంగారావు కుమారుడు తప్ప. కుమారుని చంపమని అతడి గురువుకు రంగారావు ఇచ్చిన ఆదేశాలను అమలు చెయ్యలేక అతడిని రక్షించాడు, ఆ బాలుడి గురువు.<ref name=":0" /> (మరో కథనంలో ఆ బాలుణ్ణి రక్షించినది అతడి ఆయా లక్ష్మి అని ఉంది.)<ref>[https://books.google.co.in/books?id=9Fb26pWqhScC నిజాము - బ్రిటను సంబంధాలు 1724-1857] - పేజి:106</ref>
పంక్తి 83:
 
=== పెద విజయరామరాజు హత్య ===
యుద్ధం ముగిసిన తరువాత మూడవ రాత్రి, విజయరామరాజు తన శిబిరంలో నిద్రిస్తూండగా ఇద్దరు సాయుధులు అతడి శిబిరంలోకి ప్రవేశించారు. నిద్రిస్తున్న విజయరామరాజును ఒక్కసారే తమ వద్ద ఉన్న బాకులతో పొడిచి చంపారు. మొదటి పోట్ల తరువాత విజయరామరాజు అరచిన అరుపులకు అతడి అనుచరులు వచ్చి ఆ ఇద్దరిపై కాల్పులు జరిపారు. అప్పటికే వారిద్దరూ రాజును 32 పోట్లు పొడిచారు. అనుచరులు లోపలికి రాగానే వాళ్ళిద్దరూ లేచి నిలబడి "ఇదిగో చూడండి, మా పగ తీరింది." అని అన్నారు.<ref name=":0" /> ఆ ఇద్దరిలో ఒకడు [[తాండ్ర పాపారాయుడు|తాండ్ర పాపయ్య]], అతడు రంగారావు తరపున [[రాజాం]] కోటకు అధికారి. బొబ్బిలి కోట ఫ్రెంచి వశమైన సంగతి తెలిసిన అతడు ఆ వినాశనానికి కారణమైన వాడిపై [[పగ]]<nowiki/>తీర్చుకుంటాను అని శపథం చేసాడు.
 
==ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/బొబ్బిలి_యుద్ధం" నుండి వెలికితీశారు