మయూరశర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననం: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
'''మయూరశర్మ''' ({{lang-kn|ಮಯೂರಶರ್ಮ}}) (మయూరశర్మన్ లేదా మయూరవర్మ ({{lang-kn| ಮಯೂರವರ್ಮ}})) (r.345–365 C.E.), [[శాతవాహన సామ్రాజ్యం]] విచ్ఛిన్నమైన పిదప దక్షిణభారతదేశాన్ని ఏలిన అనేక వంశాలలో ఒకటైన, కాదంబ రాజవంశ స్థాపకుడు. [[బ్రాహ్మణం|బ్రాహ్మణ]] పండితుడైన మయూరశర్మ, బనవాసి [[రాజధాని]]<nowiki/>గా పశ్చిమ దేశాన్ని పాలిస్తూ, క్షత్రియత్వానికి [[చిహ్నం]]<nowiki/>గా తన పేరుని ‘మయూరవర్మ’ గా మార్చుకున్నాడు.
 
==జననం==
[[File:Talagunda Pillar inscription (455-460 AD) at Talagunda.JPG|right|thumb|తాళగుంద స్థంభ శాసనం మయూర శర్మ జీవితం, వంశావళిని వివరిస్తుంది]]
కాదంబ వంశం గురించి అనేక [[కథలు]] ప్రచారంలో ఉన్నాయి. ఒక కథ ప్రకారం, వీరు ముక్కంటి, నాలుగుచేతులు కలవాడైన ‘త్రిలోచన కాదంబు’ని వంశస్థులు. కదంబ వృక్షంవద్ద, [[శివుడు|శివు]]<nowiki/>ని నుదుటి నుండి జారిపడిన [[చెమట]] చుక్కల నుండి ఈ ‘త్రిలోచన కాదంబుడు’ ఉద్భవించాడు. మరొక కథ ప్రకారం, [[ముక్కంటి]] ఐన మయూరశర్మ [[రుద్రుడు|రుద్రు]]<nowiki/>నికీ, [[భూమి]]<nowiki/>కీ ఒక కదంబ వృక్షం నీడన జన్మించాడు. ఇంకొక కథ ప్రకారం, ఒక జైన తీర్థంకరుని సోదరికి కదంబ వృక్షం నీడన జన్మించాడు. ఇవన్నీ మయూరశర్మకి దైవత్వాన్ని ఆపాదించే కథలే.<ref name="legend">Moraes (1931), pp7-8</ref>
క్రీ.శ. 450లో కాదంబ వంశస్థుడు శాంతివర్మ వేయించిన తాళగుంద శాసనం<ref>[http://puratattva.in/2013/10/10/talagunda-2594] puratattva.in. Retrieved on 2015-11-13.</ref> ప్రకారం, మయూర శర్మ వైదిక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వేదపండితుడు. ఇతనిది మానవ్య గోత్రం. బంధుశేనుని [[కొడుకు|కుమారుడు]]. వారి ఇంటివద్ద కదంబ వృక్షం ఉండిన కారణంచేత వీరు, కాదంబ వంశము వారిగా పిలువబడ్డారు.
[[కన్నడ]] పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మయూరశర్మ తాళగుందకి చెందినవాడు. కొందరు [[తెలుగు]] పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మయూరశర్మ [[కోనసీమ]]కి చెందిన వేదపండితుడు.
పంక్తి 13:
మయూరశర్మ తొలుతగా పల్లవుల అంతరపాలులని ఓడించి, శ్రీపర్వతం ([[శ్రీశైలం]] లేదా [[నాగార్జునకొండ]]) వద్దనున్న దట్టమైన అటవీప్రాంతాన్ని ఆక్రమించాడు. [[కోలార్]] పాలకులైన బాణులనుండి కప్పాన్ని కూడా వసూలు చేసాడు. పల్లవుల రాజు స్కంధవర్మ, ఇతనిని నియంత్రించలేక, అమరసముద్రం ([[అరేబియా సముద్రము|అరేబియా సముద్రం]]) నుండి ప్రేహర నది (మలప్రభ) వరకు ఉన్న ప్రాంతాలకి స్వతంత్ర పాలకుడిగా గుర్తించాడు.
 
కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం,మయూరశర్మ [[పల్లవులు|పల్లవు]]<nowiki/>ల సైన్యంలో దండనాయకునిగా ఉండినాడు. పల్లవ విష్ణుగోపుడు సముద్రగుప్తుని దక్షిణదేశ దండయాత్రలో ఓడిపోవడంతో(అలహాబాద్ శాసనం), మయూరశర్మ [[బనవాసి]] రాజధానిగా స్వతంత్ర పాలన ప్రారంభించాడు.
 
మయూరశర్మ వేయించిన చంద్రవల్లి శాసనం ([[చిత్రదుర్గ]]) లో త్రైకూటులను, అభీరులను, సేంద్రకులను, పల్లవులను, పరియాత్రకులను, శకస్థానులను, మౌఖరిలను, పున్నాటులను ఓడించినట్టు తెలుస్తున్నది.
తన విజయానికి గుర్తుగా అశ్వమేధయాగాన్ని చేసినట్టు, బ్రహ్మదేయంగా 144 గ్రామాలను [[బ్రాహ్మణులు|బ్రాహ్మణుల]]<nowiki/>కు దానమిచ్చినట్టు తెలుస్తున్నది.
 
బ్రాహ్మణ ధర్మాన్ని నిలబెట్టేందుకు, రాజక్రతువులను జరిపేందుకు, అహిఛత్రం నుండి వైదిక బ్రాహ్మణులను తన రాజ్యానికి ఆహ్వానించాడు. [[కేరళ]]<nowiki/>కు చెందిన నంబూద్రీ [[బ్రాహ్మణులు]], ఇలా [[గోదావరి]] తీరంనుండి వలసవెళ్ళినవారేనని, కొందరు పరిశోధకుల అభిప్రాయము. వీరి ఇండ్లపేరులలో కళింగపల్లి, [[సర్పవరం]] వంటి ఊళ్ల పేర్లు కనిపిస్తాయి.[ఆధారం కోరబడినది]
 
==సమకాలీన సంస్కృతిలో==
"https://te.wikipedia.org/wiki/మయూరశర్మ" నుండి వెలికితీశారు