వారన్ హేస్టింగ్సు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
|||
పంక్తి 27:
}}
'''వారన్ హేస్టింగ్సు''' జీవిత కాలం 1732-1818. కార్యకాలం 1750-1785. క్రీ.శ 1599 లో స్థాపించినప్పటినుండి బ్రిటిష్ [[ఈస్టిండియా కంపెనీ]] అనువ్యాపార సంస్ధకి పది-పదిహేను సంవత్సరముల కొకమారు [[ఇంగ్లండు]]
==వ్యక్తిగతముఖ్యాంశాలు==
వారన్ హేస్టింగ్సు వ్యక్తిగతంగా దురదృష్టవంతుడనే చెప్పాలి. 1732 డిసెంబరు 6 తేదీన ఇంగ్లండులోని చర్చిల్ (CHURCHILL) దగ్గర గ్రామంలో ఒక బీదకుటుంబమున జన్మించి చిన్ననాటనే తల్లిని కొల్పోయాడు. తండ్రి, పినాస్టన్ హేస్టింగ్సు (PYNASTON HASTINGS) కూడా దూరమైపోవటం వల్ల కొంతకాలం ధర్మసంస్థల, అనాథ [[పాఠశాల]]
==కార్యకాల ముఖ్యాంశాలు==
1750 లో మొట్టమొదటిసారిగా భారతదేశములో ఈస్టుఇండియా కంపెనీ కలకత్తాలో (writer) గుమాస్తాగా పనిలోప్రనేశించి తరువాత కంపెనీవారి ఒక ప్యాక్టరీకి నిర్వాహకుడుగా చేశాడు. 1753లో వంగరాష్ట్ర రాజధాని [[ముర్షీరాబాదు]]కి సముద్రతీర వ్యాపార కేంద్రమైన [[ఖాసింబజారు]]లో పనిచేశాడు. 1757 ప్లాసీ యుధ్ధమప్పుడు ఇతని నైపుణ్యమును గుర్తించిన రాబర్టు క్లైవు యుధ్ధానంతరం కలకత్తాను విడిపించి తన అనుగ్రహ పాత్రుడైన [[మీర్ జఫర్]]ను నవాబుగా చేసి ఆ నవాబుగారి రాజధాని ముర్షీరాబాదులో 1758లో హేస్టింగ్సును కంపెనీ ప్రతినిధిగానూ (Resident), నవాబుగారి సలహాదారునిగా వ్యవహరించుటకు నియమించాడు. 1761 లో పదోన్నతితో కంపెనీ పరిపాలక యంత్రాంగమైన (కౌన్సిల్) సంఘ సభ్యునిగా కలకత్తాలో నియమింపబడ్డాడు. 1761-1765 నాలుగేండ్లలో వంగరాష్ట్రములోని పరిపాలన, కంపెనీ ఉద్యోగుల అవినీతి, లంచగొండితనం, స్వంతవ్యాపారములు, ప్రజాపీడనలు చాలా విషమస్థితికి దారితీశాయు. (చూడు[[రాబర్టు క్లైవు]] కార్య సమీక్ష, వంగరాష్ట్ర చరిత్ర, [[ప్లాసీయుద్ధం ]]). ఆ పరిస్థితులను ఖండించతూ హెస్టింగ్సుకౌన్సిల్లో తన అభ్యంతరాలు సభాసదస్సుకు నమోదు చేయటమే కాక [[లండను]]
=== వారన్ హేస్టింగ్సు చేసిన రాజకీయ సంస్కరణలు===
వంగరాష్ట్ర గవర్నర్ గా 1772లో పదవీ స్వీకారంచేసిన తరువాత వారన్ హేస్టింగ్సు చేసిన రాజకీయ సంస్కరణలు (1) ప్రభుత్వ యంత్రాంగమును కదలించి వంగరాష్ట్ర రాజధానిని ముషీరాబాదునుండి కలకత్తా తరలించాడు. 1767 కంపెనీ చట్టప్రకారము కంపెనీ రాబడిలో కొంత భాగము బ్రిటిష్ ప్రభుత్వమువారికి కట్టవలసినదేకాక, తమ కంపెనీకి కూడా కట్టవలసివచ్చెను. దాంతో బ్రిటిష్ ఇండియా పరిపాలకసంఘం ఆర్థికస్థితి దిగజారుతూ ఋణగ్రస్తములోకి దిగింది. అందుకని వారనా హేస్టింగ్సు అనేక మార్గములద్యారా ఆదాయం పెంపొందిప నిశ్చయించాడు. (2) వంగరాష్ట్ర నవాబు అధికారమునుండి తొలగించునప్పుడు రాబర్టు క్లైవు చేసిన వప్పందంప్రకారం సాలునా ఇయ్యవలసిన అలవెన్సు 53 లక్షలను క్లైవు కాలంలోనే రెండవనవాబు పదవిలోకి వచ్చినప్పుడు 41 లక్షలకు తరువాత వచ్చిన ఇంకో కొత్తనవాబుకు 32 లక్షలకు తగ్గించబడినదానిని గవర్నర్ వారన్ హేస్టింగ్సు ఇంకా తగ్గించి 16 లక్షలకు చేశాడు, అలాగే ఢిల్లీలోని చక్రవర్తిషా ఆలంకి క్లైవుచేసిన వప్పందం ప్రకారం ఇయ్యవలసిన ఇరవైఆరు లక్షలరూపాయల సాలూనాచెల్లించు కప్పమును మొత్తం ఆపేయటమేకాక షా ఆలానికి క్లైవు ఇచ్చిన [[అల్ హాబాదు]] పరణాలనూ, [[కోరా]] పరగణాలనూ (పశ్చమ ఒరిస్సాలోని ప్రాంతం) వెనక్కి తీసేసుకుని [[అయోధ్య]] (అవధ్) షూజా ఉద్దౌలా నవాబుకు 50లక్షల రూపాయలకు వెచ్చించటమే కాక, మరాఠా దండులు [[రోహిల్లా]] మీదకు దాడికి వస్తే సైనిక సహాయంచేయటానికి ఇంకా నాలుగులక్షలు నవరసులు వసూలుచేశాడు. వంగరాష్ట్ర నవాబు ను, చక్రవర్తి షా ఆలమునూ దుస్థితికి పాల్చేశాడు. (3) వంగరాష్ట్రమును కొన్ని జిల్లాలుగావిభజించి పన్నుల వసూలుకొరకు ప్రాతదేశీయోద్యుగులను తొలగించి జిల్లాకొక కలెక్టరును, నలురైదుగురు కలెక్టర్లపై ఒక కమీషనరును నియమించాడు. వీరందరిపైనా కలకత్తాలో రెవెన్యూబోర్డును ఏర్పరచాడు. కలెక్టర్లు సరాసరి పన్నులు వసూలుచేయకుండా పన్నుల వసూలుహక్కును ఆ విధముగా వేలంవేయించి వేలంపాటలో ఎవరైతే అధికంగా పాడిరో వారికి సిస్తు వసూలు చేసే హక్కు ఇచ్చారు. అలాగ సిస్తు వసూలు చేసుకున్నవారే[[ఇజారాదారులు]] . ఆ ఇజారా దారులునే మొదట దివానులనేవారు. తరువాత వారిలో చాలమంది [[కారన్ వాలీసు]] కాలం (1786-1793) లో చేసిన సంస్కరణల ఫలితముగా జమీందారులైయ్యారు. (4) జిల్లా కలెక్టర్లకే రివిన్యూ బాధ్యతలుతోపాటు న్యాయవిచారణచేయు అధికారమీయబడింది. కలెక్టర్ల కోర్టులే క్రిందికోర్టు, దానిపైన అప్పీలు కోర్టును సదర్ దివానీ అదాలత్ అను సివిల్ కోర్టును, సదర్ నిజామత్ అదాలత్ అను రెండు ఉన్నత కోర్టులను స్థాపించబడ్డాయి. అలా వారన్ హేస్టింగ్సు చేసిన రాజకీయ సంస్కరణలవల్ల నూతన న్యాయస్తానాలు నెలకొల్పబడనవి, న్యాయ విచారాణాధికారము ఇంగ్లీషువారు చేబట్టి ఆంగ్లేయధర్మశాస్త్రములను అమలుచేయటంవల్ల దీర్ఘకాలంనుండీవస్తున్న హిందూ మహ్మదీయ సాంప్రదాయలకు ఆటంకమైనవి. సశేషం
పంక్తి 46:
====మొదటి మహారాష్ట్రయుధ్దము (1775-1782)====
బ్రిటిష్ కంపెనీ వారు మహారాష్ట్ర రాజ్యములో ఏడేండ్ల పాటు (1775-1782) చేసిన మొదటి యుధ్దము వారన్ హేస్టింగ్సు కార్యకాలములోనే జరిగింది. అప్పటిదాకా కంపెనీ వారు సరాసరి మహారాష్ట్ర రాజ్య పరిపాలకులతో యుద్ధమునకు తిగలేదు. శివాజీ మహారాజు స్థాపించిన మహారాష్ట్రరాజ్యము భౌగోళికముగా ఇప్పటి మహారాష్ట్ర రాష్ట్రమే గాక, కెొంకణ ప్రాంతములోను, దక్కను పరగణాలలోను, ఇప్పటి మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, ఇందోరు మొదలగు మాల్వా ప్రాంతములలో విస్తరించిన యున్న సామ్రాజ్యము. మహారాష్ట్ర రాజ్యమును స్థాపించిన శివాజీ మహారాజు తరంవారు 1714 నుండి బలహీనులైన కారణంగా ఆ రాజ్య మంత్రిపరిషత్తు లోని పీష్వా అను ప్రధాన మంత్రులే వారసత్వంతో పరిపాలించు చుండిరి. వీరి కాలములో రాజధానిని [[రాయఘడ్]] నుండి [[పూనా]]కు మార్చబడింది. అట్టి పీష్వాల తరంవారిలో నాల్గవ పీష్వా మాధవరావు (1761-1772) క్షయవ్యాధితో 1772 లో మరణించుచూ 16 ఏండ్ల బాలుడైన తనతమ్ముడు నారాయణరావుకు తనతరువాత పట్టాబిషేకముచేయమని మంత్రిపరిషత్తుకు చెప్పి మరణించాడు. నారాయణరావును పీష్వాగా చేసినతరువాత మాధవరావు గారి పినతండ్రైన [[రఘునాధరావు]] కుట్రలు పన్ని నారాయణరావును చంపి తానే పీష్వాగా పరిపాలనచేపట్టాడు కానీ మంత్రి పరిషత్తులోని కొందమంది [[నానాఫడ్నవీసు]] సారథ్యములోని వారు అతనిని పదవినుండి తొలగమని అప్పుడే పుట్టిన నారాయణరావు కుమారుడు [[సవాయి మాధవరావు]] అను పసికందుకు పట్టముకట్టారు. అంతట రఘునాదరావు బ్రిటిష ఈస్టు ఇండియా కంపెనీ బొంబాయి గవర్నరును ఆశ్రయించి తనకు సైనికి సహాయంచేయమని, దానికి ప్రతిఫలముగా తను [[మహారాష్ట్ర]] రాజ్యములోని కొన్ని భూభాగములను ( [[సల్సెట్టీ]], [[బస్సీను]] ) ఇవ్వటమేకాక [[సూరత్]] లోను, [[బరూచ్]] లోను రాజస్వ హక్కు కూడా ఇచ్చేటట్లుగా సూరత్ లో 1775 మార్చిలో సంధిపత్రము వ్రాసి వప్పందం కుదుర్చుకున్నాడు. అదే సూరత్ సంధి. అ సంధి ప్రకారము లభించిన బ్రిటిష్ వారి సైన్యసహాయంతో సూరత్ నుండి పూనాపై దండయాత్రకు బయలుదేరగా దారిలో నానాఫడ్నవీసు పక్షమువారిచే పరాజయము పొందాడు. అంతేగాక కలకత్తాలోని బ్రిటిష గవర్నరు జనరల్ కౌన్సిల్ వారు ఆ సూరత్ సందిని రద్దు పరచుటకు పూనాకు రాయబారముపంపి నానాఫడ్నవీసుతో మార్చి1776 లో [[పురంధర్]] అను ప ట్టణంలో ఇంకో సంధి చేసుకున్నారు. ఆ సంధి ప్రకారం కూడా సూరత్ లోను బరూచ్ లోను రాజస్వహక్కు తమకుండేటటుల. కానీ నానాఫడ్నవీసు పురంధర్ సందికి వ్యతిరేకముగా తన రాజ్యములోని పడమర సముద్రపుతీరమున ప్రెంచివారికి నౌకాయానమునకు ఓడరేవునిచ్చాడు. దాంతో రఘునాధరావునే మహారాష్ట్ర రాజ్యసింహాసనాధిపతిచేయుటకు బొంబాయ కంపెనీ గవర్నరు సైన్యమును పూనాకు పంపి నానాఫడ్నవీసుతో యుధ్దమునకు దిగారు. కానీ దారిలోనే [[వడగాం]] అను పట్టణంలో నానా ఫడ్నవీసు సైన్యముతో ఓడిపోయి సంధిచేసుకున్నారు అదే వడగాం సంది 1779 లో జరిగి నసంది. అప్పుడు వారన్ హేస్టింగ్సు పెద్దపెట్టున సైన్యమును కర్నల్ థామస్ డబ్ల్యూ గద్దర్ సారథ్యములో యుద్ధమునకు పంపి పూనాను ముట్టడించి పరిస్థితిని పూర్తిగా బ్రిటిష్ వారి వశంచేసుకుంటానికి పంపించాడు. అంతట గద్దార్డు సైన్యము [[అహ్మదాబాదు]] ను, [[బస్సీను]]ను ఆక్రమించి పూనా ముట్టడిచేశారు. ఈ లోపల మరో వైపు [[మాళ్వా]]లో బ్రిటిష్ సైన్యాధికారి కమక్ ను [[మహారాష్ట్ర]]
==వారన్ హేస్టింగ్సుకార్యకాల సమీక్ష==
పంక్తి 53:
===1773 లో విలియం కోటకు గవర్నరు అయన తరువాతనుంచి===
ప్రజలక్షేమం, రాష్ట్రాభివృధ్దికి బాధ్యతలు వహించకుండా పరిపాలనాధికారం వహించి, బ్రిటిష్ వారి ఖజానాలకు ధనం చేర్చటం ముఖ్య ఉద్దేశంతో వారన్ హేస్టింగ్సుగవర్నరుగాను, గవర్నరు జనరల్ గా చేసిన కార్యాచరణలన్నీ కేవలం బ్రిటిష్ కంపెనీ, బ్రిటన్ దేశంకోసం చేసినవే. వారన్ హేస్టింగ్సు చేసిన రాజకీయ సంస్కరణల వల్ల వంగరాష్ట్రములోని పంచాయితీ విధానం నశించిపోయింది. సిస్తు వసూలుకు తాను పెట్టిన దివానుల పద్ధతితో భూమిదున్ను రైతుల ఆర్థిక పరిస్థితి దయానీయకమైనది. వంగ రాష్ట్రములో వారన్ హేస్టింగ్సు చేసిన రాజకీయాల వల్ల వంగరాష్ట్ర నవాబే కాక మొగల్ చక్రవర్తిని కూడా ఆర్థిక దుస్థితికా పాలుచేశాడు. అయోధ్యనవాబును చేతుల్లో నుంచుకుని కాశీ పరిపాలించుచున్న రాజు చైత్ సింగును తవ వశం చేసుకునుట వారిద్దరి మద్దతుతో అయోద్య రాణుల వ్యగ్తిగత సంపత్తి దాదాపు 12 లక్షల నవరసులులు దాక వసూలుచేశే వరకు చేసిన రాజకీయకార్యాచరణ చాల విచారమైనవి. తనపై అవినీతి, లంచగొండితనమును ఆరోపణచేసిన నందకుమారుడనునతని పై ప్రత్యారోపణలు మోపి ఉరితీయించటం చరిత్రలోకెక్కిన అక్రమబద్ధమైన కార్యాాచరణ. వారన్ హేస్టింగ్సు చేసిన అటువంటి ఆర్థిక, రాజకీయ అక్రమ కార్యాచరణలను ఇంగ్లండు కామన్సు సభ్యుడైన బర్కు దొర (Edmund Burk) సభలో చేసిన మహోపన్యాసమునందు వర్ణంచబడినవి. రోహిల్ఖండు యుద్ధము, ఔధ్ నవాబు షూజా ఉద్దౌలాకు సహాయముచేయటంలో అంతర్గత రాజ్యతంత్రము బ్రిటిష్ వారి రింగ్ ఫెన్సు (Ring Fence) సూత్ర ప్రయోగం. ఆ రోహిల్ఖండు యుద్ధంతో ఔధ్ నవాబు, షూజాఉద్దౌలా బ్రిటిష్ వారి చెప్పుచేతులలోకి వచ్చేటట్లు చేసుకున్న రాజ్యతంత్రము వారన్ హేస్టింగ్సు దొర ఘనత. బ్రిటిష్ వారికి మరాఠీలతో సరాసరి యుధ్దముచేయ వలసిన ప్రమాదములనివారించు రక్షణకవచములాంటి (buffer region) మద్యలోనొక రాజ్యంమునుంచటం ఒక రాజ్య తంత్రము. భూటాన్ రాజును ఓడించినతరువాత ఇక తదుపరి రాజ్యతంత్రము [[భూటాన్]] [[టిబెట్టు]]
==మూలాలు==
|