వంశధార: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నదులు → వర్గం:ఆంధ్రప్రదేశ్ నదులు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 5:
==వంశధారానది గుఱించి చెప్పుకొనే ఒక కథ==
[[దస్త్రం:From the top of salihundam.jpg|thumb|వంశధార నది-2]]
[[శ్రీకాకుళం జిల్లా]]లో పారాఱునట్టి వంశధారానదియొక్క ఒక పాయకు కల కథనుఁబట్టి దక్షిణ సముద్ర తీరమున శ్వేతపురమనే పట్టణమును శ్వేతచక్రవర్తి ఏలుచుండేవాడు. ఆయనకు విష్ణుప్రియ అనే పేరుఁగల పెండ్లము ఉండేది. ఆమె [[మహా విష్ణువు|మహా విష్ణు]] భక్తురాలు. ఆమె ఒకనాటి [[ఏకాదశి]] వ్రత దీక్షలో ఉండగా ఆమె భర్త అయిన శ్వేతమహారాజు కామమోహితుడై ఆమె వద్దకు వచ్చెను. అప్పుడు విష్ణుప్రియ మగనికి ముద్దుఁగా బ్రతిమాలి పిలిఁచి, కూర్చుండబెట్టి, పూజా గదికి పోయి విష్ణువును కొలిఁచి, స్వామీ! అటు నా మొగుఁడును నేను కాదనలేను, ఇటు నీ వ్రతమును భంగపడనివ్వలేను. నువ్వే నన్ను కాఁపాడమని పరిపరి విధముల వేడుకొంది. స్వామీ! కూర్మరూపమున భూమిని దాలేదా? అట్లే నన్ను ఆదుకోమని ప్రార్థించింది. [[విష్ణువు|శ్రీమన్నారాయణుడు]] దర్శనమిచ్చి, అక్కడనే [[గంగా నది|గంగ]]<nowiki/>ను వెలఁయింపఁసేసెను. ఆ గంగ గొప్ప ఉఱఁవడి పఱఁవడిఁగా రాగా మహారాజు జడిఁసి పరుగిడి ఒక కొండ మీదకు చేరి తమ మంత్రిని విషయము అడుగగా, ఆతను రాజుకు విషయమంతా వివరించెను. అప్పుడు రాజు పశ్చాతాపంతో మరణమే తన పాపేమునకు ప్రాయశ్ఛిత్తమని తలచి, శ్రీమహా విష్ణువును ధ్యానించుచుండెను. అప్పుడు [[నారదుడు]] అటుగా వచ్చి, రాజును విషయమడుగగా, రాజు తన బాధను వివరించెను. అప్పుడు నారదుడు రాజుకు శ్రీకూర్మ మంత్రమును ఉపదేశించి దీక్షతో ధ్యానించమని చెప్పెను. ఈ గంగా ప్రవాహము వంశధార అను పేరుతో సాగరములో లీనమగునని, ఇది సాగరసంగమ ప్రదేశమని చెప్పెను.
 
==ఆంధ్రకు అదనపు నీరు==
"https://te.wikipedia.org/wiki/వంశధార" నుండి వెలికితీశారు