సదాశివ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో వర్గం మార్పు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
 
ఇతను కేవలం నామమాత్ర పరిపాలకుడు మాత్రమే, అధికారము మొత్తం [[పెదతిరుమలయ్యదేవమహారాయలు]] చేతిలో ఉండెడిది. కానీ తరువాత [[అళియ రామ రాయలు]] కూడా [[అధికారం]] కోసం పోటీ పడినాడు. ఈ కాలమున [[విజయనగరం]] అంతఃకలహములకు తీవ్రంగా లోనయ్యింది, పరిస్థితులు ఎంతవరకూ వచ్చినాయంటే, [[పెద తిరుమలయ్యదేవమహారాయలు]] [[రాజధాని]]<nowiki/>లోనికి ఆదిల్షాను సైన్యసమేతంగా ఆహ్వానించాడు. అంతకు ముందే పెద తిరుమలయ్య దేవమహారాయలు తన మేనల్లుడూ, రాజ్యానికి వారసుడూ, [[అచ్యుత రాయలు]] కుమారుడు అయిన చిన వేంకటపతి రాయలును హత్యాగావించి తనే సింహాసనం అధిస్టించాడు!
 
ఈ సుల్తాను రాజధానిలోనికి రావడంలో సిగ్గుపడి, భయపది, అవమానపడిన [[అళియ రామ రాయలు]] పెద తిరుమలయ్యను ఒప్పించి సుల్తానుకు [[ధనం]] అప్పగించి ఇంటికి పంపించాడు.
పంక్తి 9:
తరువాత [[అచ్యుత దేవ రాయలు]] సోదరుని కుమారుడగు '''సదా శివ రాయలు''' సింహాసనం అధిష్టించాడు, కానీ అధికారం మాత్రం [[అళియ రామ రాయలు]] చేతిలోనే ఉండేది. అనంతర కాలంలో సుల్తానుల కూటమితో విజయనగర సామ్రాజ్యం రాక్షస తంగడి యుద్ధంలో ఘోర పరాజయం పాలై అళియ రామరాయలు యుద్ధంలో మరణించారు. ఈ యుద్ధానంతరం సుల్తానుల సైన్యం మొత్తంగా రాజధానియైన విజయనగరం మూలమట్టంగా నాశనం చేసింది. దీనితో అళియ రామరాయల తమ్ముడైన తిరుమల దేవరాయలు సదాశివరాయలను, విజయనగర సామ్రాజ్య ఖజానాను తీసుకుని పెనుకొండకు పారిపోయారు.
 
పెనుకొండలో కూడా ఇతనిని [[సింహాసనం]]<nowiki/>పై ఉంచి తిరుమల దేవరాయలే పరిపాలించారు. చివరకు 1570లో సదాశివ రాయలను తిరుమల దేవరాయలు సంహరించి తాను అధికారం చేపట్టారని రాబర్ట్ న్యూయల్ భావించారు. కానీ సదాశివ రాయల శాసనాలు 1575 వరకూ కనిపిస్తూండడంతో ఇది వాస్తవం కాదని చరిత్రాకారులు అభిప్రాయపడుతున్నారు.<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=https://archive.org/details/in.ernet.dli.2015.371485|accessdate=1 December 2014}}</ref>
 
{{విజయ నగర రాజులు}}
"https://te.wikipedia.org/wiki/సదాశివ_రాయలు" నుండి వెలికితీశారు