చిల్లర దేవుళ్ళు (నవల): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 24:
== నవల నేపథ్యం ==
[[తెలంగాణా సాయుధ పోరాటం]] నాటి స్థితిగతులు, ఆ కాలంలోని దారుణమైన [[బానిసత్వం|బానిస]] పద్ధతులను సవివరంగా దాశరథి రంగాచార్యులు రచించిన నవలల్లో చిల్లర దేవుళ్లు మొదటి నవల. ఈ నవలల మాలికను రచయిత ప్రారంభించడానికి చారిత్రిక నేపథ్యం ఉంది. <br />
వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల మనిషి, గంగు వంటి [[నవలా సాహిత్యము|నవల]]<nowiki/>ల ద్వారా నాటి జీవన చిత్రణ చేయాలనే ప్రయత్నం ప్రారంభించారు. ఆ నవలల ప్రణాళిక పూర్తి కాకుండానే ఆళ్వారు స్వామి మరణించారు. సాయుధపోరాట యోధులుగా, సాహిత్యవేత్తలుగా ఆళ్వారుస్వామికీ, రంగాచార్యులకూ సాన్నిహిత్యం ఉండేది. పోరాటానికి పూర్వం, పోరాట కాలం, పోరాటం అనంతరం అనే విభజనతో [[నవలా సాహిత్యము|నవల]]<nowiki/>లు రాసి పోరాటాన్ని నవలలుగా రాసి అక్షరీకరించాలనీ, అది పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న సాహిత్యవేత్తలపై ఉన్న సామాజిక బాధ్యత అనే అభిప్రాయాలను వారిద్దరూ పంచుకున్నవారే కావడంతో ఆళ్వారుస్వామి మరణానంతరం ఆ బాధ్యతను రంగాచార్యులు స్వీకరించారు. ఆ నవలా పరంపరలో తొలి నవలగా 1942వరకూ ఉన్న స్థితిగతులు "చిల్లర దేవుళ్లు"లో కనిపిస్తాయి.<br />
నాణానికి మరోవైపు చూస్తే తెలంగాణ పోరాటం ముగిసిన దశాబ్దికి కొందరు నిజాం రాజును మహనీయునిగా, ఆ నిజాం రాజ్యస్థితిగతులను ఆదర్శరాజ్యానికి నమూనాగా పలు రాజకీయ కారణాల నేపథ్యంలో కీర్తించారనీ, ఆరోగ్యాన్ని నాశనం చేసుకుని, ప్రాణాన్ని లెక్కచేయక నిజాంను ఎదిరించిన తమకు ఆనాటి దుర్భర స్థితిగతుల్ని ఇలా అభివర్ణిస్తూంటే ఆవేశం వచ్చేదని రంగాచార్య ఒక సందర్భంలో పేర్కొన్నారు. నిజాం రాజ్యంలో బానిసల్లా జీవించిన ప్రజల స్థితిగతులను, మానప్రాణాలను దొరలు కబళించిన తీరును ఆ నేపథ్యంలో ప్రపంచమే ఆశ్చర్యపోయేలా సాగిన తెలంగాణా సాయుధపోరాటం, పోరాటానంతర స్థితిగతులు వంటివి భావితరాలకై అక్షరరూపంగా భద్రపరచదలిచిన ఆళ్వారుస్వామి ప్రణాళికను స్వీకరించినట్టు రచయిత తెలిపారు..<ref>డా.దాశరథి రంగాచార్యులు ఆత్మకథ "జీవన యానం"</ref>
 
పంక్తి 32:
పాణికి పోనుపోనూ ఊళ్ళో దొరది ఎదురులేని శాసనమని తెలుస్తుంది. చిన్న చిన్న తప్పులు చేసినా, తన అధికారాన్ని ఏమాత్రం తక్కువచేసినా దొర ఎలాంటి కఠినశిక్షలు విధిస్తాడో తెలుస్తూంటుంది. దొరకీ కరణానికి వైరం ఉన్నా జనాన్ని అణచివేయాల్సి వస్తే మాత్రం ఏకమైపోవడం కూడా చూస్తాడు. గడీలో ఆడబాపగా పనిచేస్తున్న వనజది వేశ్య కన్నా దారుణమైన జీవితం. ఐతే ఆమె సారంగపాణిని ప్రేమిస్తుంది. దొర కూతురు మంజరి, మరోవైపు కరణం కూతురు తాయారు కూడా అతనిపై మనసుపడతారు. తాయారు మరో అడుగు ముందుకువేసి తనను పెళ్ళిచేసుకుంటే తండ్రి కరణీకం ఇప్పిస్తాననీ, లేదంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందనీ హెచ్చరిస్తుంది.
 
మరో వైపు భూతగాదాల్లో [[లంబాడీలు|లంబాడీ]]<nowiki/>లను కరణం మోసం చేయగా ఆదుకోవాల్సిన పోలీసులు కరణానికి మద్దతుగా ప్రజలపైనే కాల్పులు జరుపుతారు. ఓ లంబాడీ స్త్రీపై అత్యాచారం చేయబోగా [[ఆత్మగౌరవం]]<nowiki/>తో ఆ ప్రయత్నం నుంచి కాపాడుకునేందుకు [[రక్షకభటుడు|పోలీసు]] అధికారిని చంపుతుంది. ఆ వెంటనే తానూ ఆత్మహత్య చేసుకుంటుంది. [[నిజాం]] మనుషులు కూలీలను బలవంతంగా ముస్లిం మతంలోకి మారిస్తే, ఆ తర్వాత అటు హిందువులూ కాలేక, ఇటు [[ముస్లిములు|ముస్లిము]]<nowiki/>లుగానూ మనలేక పడే బాధలూ చిత్రీకరించింది. దొర బండి రోడ్డుపై వెళ్తూన్న సమయంలో బండికి ముందు మనిషి తప్పుకోమని అరుస్తూ పరుగులు పెట్టడం వంటివి చూపించారు. ఆ పనిచేసే మనిషి వెట్టిచాకిరీతో తిండి లేక ఎంత కునారిల్లిపోతాడో కూడా చిత్రించారు. నిజాం పాలనలో దెబ్బ తింటున్న తెలుగు భాషా సంస్కృతుల సముద్ధరణకు కంకణం కట్టిన [[మాడపాటి హనుమంతరావు]] కృషిని పాణి తెలుసుకోవడమూ నవలలో ఉంటుంది.
ఈ నేపథ్యంలో కథ ఎలా మలుపులు తిరిగి చివరకు ఏమైందనేది మిగిలిన ఇతివృత్తం.