దగ్గుబాటి రామానాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (4), typos fixed: సెప్టెంబర్ 9, 2010 → 2010 సెప్టెంబర్ 9, 15 ఫిబ్రవరి 2015 → 2015 ఫిబ్రవరి 15, సెప్టెంబర్
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 38:
}}
 
'''డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు''' ([[జూన్ 6]], [[1936]] - [[ఫిబ్రవరి 18]], [[2015]]) తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత, భారత [[భారత పార్లమెంటు|పార్లమెంటు]] మాజీ సభ్యుడు. ఇతను [[1936]]వ సంవత్సరం [[జూన్ 6]]వ తేదీన [[ప్రకాశం]] జిల్లా [[కారంచేడు]]లో జన్మించాడు. ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను నిర్మించి, [[ప్రపంచము|ప్రపంచ]] రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. మూవీ మోఘల్ గా ఈయన్ని అభివర్ణిస్తారు. అంతటితో ఆగకుండా నేటికీ నిర్మాతగా ఆయన కొనసాగుతూ వర్ధమాన నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచాడాయన. అంతేగాక తన సంపాదనలో ప్రధానభాగం సినిమా రంగానికే వెచ్చిస్తూ, [[స్టూడియో]], ల్యాబ్‌, రికార్డింగ్‌ సదుపాయాలు, డిస్ట్రిబ్యూషన్‌, ఎగ్జిబిషన్‌, పోస్టర్స్ ప్రింటింగ్‌, గ్రాఫిక్‌ యూనిట్‌తో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సదుపాయాలను సమకూర్చడంతో పాటు పార్లమెంట్‌ సభ్యునిగానూ రాణించాడు. ఇతను 1999లో [[బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం|బాపట్ల నియోజకవర్గం]] నుండి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థిగా [[లోక్‌సభ]]కు ఎన్నికైనాడు. 2004లో అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయాడు. 2010 సెప్టెంబరు 9న [[భారత ప్రభుత్వం]] నాయుడికి [[దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం|దాదాసాహెబ్ ఫాల్కే]] పురస్కారము ప్రకటించింది. 2015 ఫిబ్రవరి 18న [[హైదరాబాదు]]<nowiki/>లో కాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించాడు<ref name= "Rama Naidu dies of cancer" />.
==వ్యక్తిగత జీవితం==
దగ్గుబాటి రామానాయుడు, [[1936]]వ సంవత్సరం [[జూన్ 6]]వ తేదీన [[ప్రకాశం]] జిల్లా [[కారంచేడు]]లో ఒక [[రైతు]] [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించాడు. తండ్రి వెంకటేశ్వర్లు. రామానాయుడుకి ఒక అక్క, చెల్లెలు. మూడేళ్ళ వయసులోనే తల్లి చనిపోయింది. పినతల్లి వద్ద గారాబంగా పెరిగాడు. [[ఒంగోలు]]లోని డాక్టరు బి.బి.ఎల్.సూర్యనారాయణ అనే బంధువు ఇంట్లో వుంటూ ఎస్సేసేల్సి దాకా విద్యాబ్యాసం చేశాడు. సూర్యనారాయణను చూశాక తానూ కూడా డాక్టరు కావాలని కలలుకనేవాడు. బడి లేనప్పుడు కాంపౌండరు అవతారం ఎత్తేవాడు. [[విజయవాడ]]<nowiki/>లో లయోలా కాలేజి ఏర్పాటు కోసం రెండు లక్షల చందాలు వసులుచేసినందుకు కృతజ్ఞ్యతగా క్రైస్తవ మిషనరీలు [[మద్రాసు]]లోని ఆంధ్రా లయోలా కాలేజిలో సీటు కొరకు సాయం చేసారు. ఎప్పుడూ కాలేజిలో జరిగే [[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] కార్యక్రమాల్లో, కబడ్డీ [[మైదానం]]లోనే కనిపించేవాడు. మొదటి సంవత్సరం పరీక్షలు తప్పడంతో, తండ్రి తీసుకువచ్చి [[చీరాల]] కళాశాలలో చేర్పించాడు. ఇక్కడ కాలేజి రాజకీయాలు తోడయాయి. రెండో సంవత్సరం పరీక్షలు కూడా తప్పాడు. రామానాయుడుకు [[మామ]] [[కూతురు]] రాజేశ్వరితో పెళ్ళి జరిగింది. పెళ్ళయిపోగానే ఆస్తి పంచివ్వమని తండ్రిని అడిగాడు కానీ తండ్రిమాట కాదనలేక మొదటి కొడుకు సురేష్ పుట్టేదాకా ఆస్తి విభజన వాయిదాపడింది. ఆతర్వాత, వందెకరాల పొలంతో సొంత సేద్యం మొదలుపెట్టాడు. వీరికి [[దగ్గుబాటి సురేష్‌బాబు|సురేష్]], [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు మీద [[సురేష్ ప్రొడక్షన్స్]] స్థాపించారు.
 
==సినిమా జీవితం==
[[కారంచేడు]]<nowiki/>లో '[[నమ్మిన బంటు]]' షూటింగ్ లో ఎడ్లపందెం దృశ్యం చిత్రీకరణ జరిగేటప్పుడు, రామానాయుడు ఓ సీన్లో నటించాడు, హుషారుగా అటు ఇటు తిరుగుతుండగా సినిమావాళ్ళ దృష్టిని ఆకర్షించాడు. తిరిగి వెళ్తునప్పుడు 'మీరు సినిమాల్లోకి ఎందుకు కాకూడదు?' అని [[అక్కినేని నాగేశ్వరరావు|అక్కినేని]] అడికితే, వూరు, [[వ్యవసాయం]] తప్పించి మరో ఆలోచన లేదని బధులు ఇచ్చాడు. ఇష్టం లేకున్నా రైసుమిల్లు వ్యాపారం మొదలు పెట్టాడు, ఓ రోజు హఠాత్తుగా సేల్స్-టాక్సవాళ్ళు వచ్చి, బిల్లులు రాయడములేదంటు రెండు లక్షల రూపాయలు [[జరిమానా]] విధించారు. దీనితో ఆ వ్యాపారం మిద విరక్తి వచ్చేసింది, మిల్లు ముసివేషి, వూరు విడచి [[చెన్నై|చెన్నపట్నం]] చేరుకున్నాడు. [[మహాబలిపురం]] రోడ్డులో పొలం కొన్నాడు, కాలక్షేపానికి రోజు తోడల్లుడితో కలిసి ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ కు వెళ్ళేవాడు. అక్కడే సినిమావాళ్ళతో పరిచయాలు అయ్యాయి. 'అనురాగం' చిత్ర నిర్మాతలు భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నామని కబురుపెట్టారు. రామానాయుడు తన తండ్రిని ఒప్పించి, దురలవాట్ల జోలికి వెళ్లనని మాటిచ్చాడు.జి.రామినీడు దర్శకత్వంలో 'అనురాగం' అనే చిత్రాన్ని నిర్మించి తొలి విజయాన్ని అందుకున్నారు. తన పెద్ద కుమారుడు సురేష్‌బాబు పేరున [[సురేష్ ప్రొడక్షన్స్]] ప్రారంభించి 1964లో ఎన్టీఆర్ కథానాయకుడిగా 'రాముడు-భీముడు' చిత్రాన్ని నిర్మించి అఖండ విజయాన్ని అందుకున్నారు. [[అక్కినేని నాగేశ్వరరావు]], [[ఆదుర్తి సుబ్బారావు]], [[ఎస్.వి. రంగారావు|ఎస్వీ రంగారావు]], [[గుమ్మడి వెంకటేశ్వరరావు]]<nowiki/>లతో ఎక్కువ సమయాన్ని గడిపేవారు. ఈ పరిచయాలతోనే ఆయనకు 'నమ్మిన బంటు' చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.
ఆ తర్వాత పలు వ్యాపారాలు చేసిన ఆయన మళ్లీ జి.రామినీడు దర్శకత్వంలో 'అనురాగం' అనే చిత్రాన్ని నిర్మించి తొలి విజయాన్ని అందుకున్నారు. తన పెద్ద కుమారుడు సురేష్‌బాబు పేరున సురేష్ ప్రొడక్షన్స్ ప్రారంభించి 1964లో ఎన్టీఆర్ కథానాయకుడిగా 'రాముడు-భీముడు' చిత్రాన్ని నిర్మించి అఖండ విజయాన్ని అందుకున్నారు. సినీ నిర్మాణ రంగంలో అడుగు ముందుకే వేశారు. అయితే ఆ తర్వాత విపరీతంగా నష్టాల పాలైన ఆయన 1971లో ప్రేమ్‌నగర్ చిత్రాన్ని నిర్మించారు.'ప్రేమనగర్' విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. 21 మంది కొత్త దర్శకుల్ని, ఆరుగురు హీరోలను పరిచయం చేశారు