రాక్షస గూళ్లు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎డాల్మెన్ సమాధి ప్రాంతాలు: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 3:
[[File:Dolmen fr Godavari district, Andhra Pradesh, India (KVHAAs Månadsblad 1880 s09 fig7).jpg|thumb|తూర్పు గోదావరి జిల్లాలోని ఒక రాక్షస గుడి]]
 
కొత్త రాతియుగంలో మనిషి గుంపులు గుంపులుగా సంచారం జీవనం సాగించేవాడట.. ఆ ఆదిమ తెగలు తమలో ఎవరైన చనిపోతే తమకు పునర్జన్మ ఉంటుందని భావించి చనిపోయిన శవాన్ని పెద్ద మట్టి కుంట తయారు చేసి అందులో పెట్టి ఆకులు, నారలతో చుట్టి దాన్ని భూమిలో పాతి పెట్టేవారు. ఆ తరువాత ఆ శవాన్ని ఏదీ పీక్క తినకుండా పెద్ద పెద్ద రాళ్లను చుట్టూ పెట్టేవారట. వీటిని [[పురావస్తు శాస్త్రం|పురావస్తు]] శాస్త్రవేత్తలు '''పాండవ గుళ్లు ''' లేదా '''రాక్షస గూళ్ళు ''' గా వ్యవహరిస్తారు. [[రాక్షస గూళ్లు]] బయల్పడటం, ఆయా ప్రాంతంలో [[పురాతనము|పురాతన]] మానవ ఆవాసానికి ఆనవాళ్ళు. చనిపోయినవారిని సమాధి చేసి పెద్దపెద్ద ప్రాకారాలు నిర్మించేవారు. ఆ సమాధుల్ని రాక్షస గుళ్లు అంటారు. ఈ భారీ అంత్యక్రియకు సంబంధించిన కట్టడాలు [[శ్రీకాకుళం]], [[విజయనగరం]], ఉభయ గోదావరి జిల్లాల్లో తక్కువగా, మిగిలిన చోట్ల ఎక్కువగా ఉండేవి. [[రాయలసీమ]]<nowiki/>లో వీటిని నేటికీ [[పాండవ గుళ్లు]] అంటారు. కర్నూలు జిల్లా [[శంఖవరం]]<nowiki/>లో [[పొట్టేలు|గొర్రె]] ఆకారంలో, [[నల్గొండ జిల్లా]] [[ఏలేశ్వరం]]<nowiki/>లో [[ఏనుగు]] ఆకారంలో విశేష నిర్మాణాలు బయల్పడినవి. పెద్ద పెద్ద బండరాళ్ళతో నిర్మించిన ఈ సమాధులు క్రీ.పూ.2000 నుండి క్రీ.పూ.500 సంవత్సరాల మధ్య కాలం నాటివిగా చరిత్రకారులు పేర్కొన్నారు.<ref>ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి, మొదటి భాగం, రచయిత: బి. ఎన్. శాస్త్రి, మూసీ పబ్లికేషన్స్, హైదరాబాద్,1990 పుట - 39</ref>.. ఈ సమాధులలో మృతుల అస్థికలు గాని, మృతదేహాన్ని గాని ఉంచి వారికి సంబంధించిన వస్తువులను కూడా పూడ్చడం నాడు ఆచారంగా ఉండేది. పురాతత్వ శాస్త్రవేత్తలు వీటిని పరిశీలించి ఈ సమాధులలో [[బంగారు]] ఆభరణాలు, [[వేణువు]]<nowiki/>లు, ఇతర వస్తు సముదాయాలను బయల్పరిచారు. మృతి చెందిన వారితో పాటు వారి వస్తువులను కూడా సమాధులలో ఉంచితే అతని ఆత్మకు [[శాంతి]] కలుగుతుందని నాటి ప్రజల విశ్వాసం. సమాధుల చెంత స్మృతి చిహ్నాలుగా శిలాస్తంభాలు ఉంచేవారు. [[ఇక్ష్వాకులు|ఇక్ష్వాకు]] వంశీయుల నాటి ఛాయా స్తంభాలు [[నాగార్జున కొండ]] వద్ద తవ్వకాలలో బయల్పరిచారు.
 
ఈ సమాధుల్లోనూ రకాలు ఉన్నాయి. అవి 1. డాల్మెన్‌లు, 2. సిస్త్‌లు ఈ రెండు రకాల సమాధులు తెలుగు నేల మీద వేల సంఖ్యలో ఉన్నట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ రెండు రకాల సమాధులకు పై కప్పు బండలకు రంధ్రములు ఏర్పరిచి ఉన్నాయి. ఈ రంధ్రాల ద్వారా ప్రేతాత్మ సమాధి నుండి బయటికి వచ్చి సంచరించి, తిరిగి సమాధులలోకి పోతుందని ఆనాటి ప్రజల విశ్వాసం.
"https://te.wikipedia.org/wiki/రాక్షస_గూళ్లు" నుండి వెలికితీశారు