విజయరామ శతకము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
 
పంక్తి 1:
[[గోగులపాటి కూర్మనాధ కవి]] [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర]] సంస్థాన ప్రభువైన విజయరామరాజు యొక్క ఆశ్రితుడు. భగవద్భక్తుడు. మానవులకు అంకితంగా ఏ కావ్యాన్నీ వ్రాయలేదు. అసూయాపరులైన విద్వాంసులు కొందరు విజయరామరాజుతో "ప్రభులపైన కూర్మనాథకవికి గౌరవం లేదు. అందువల్లే మీకు అంకితంగా ఏ గ్రంథమూ వ్రాయలేదు" అని చాడీలు చెప్పి కవి పైన విజయరామరాజుకు అసంతృప్తి కలిగించారు. ఆయన కూర్మనాథ కవిని పిలిపించి "మా పేరు వచ్చే విధంగా ఒక శతకాన్ని వ్రాయవలసింది"గా ఆదేశించాడు. కవి చిక్కులో పడ్డాడు. [[ప్రభువు]]<nowiki/>కు అసంతృప్తీ, కోపమూ కలగకుండా తన నియమము చెడకుండా ఉండే రీతిలో, విజయనగరం దగ్గరలో ఉన్న [[రామతీర్థం (నెల్లిమర్ల)|రామతీర్థం]] క్షేత్రంలో వెలసివున్న [[శ్రీరాముడు|శ్రీరాముని]] సంబోధిస్తూ "విజయరామా! రామతీర్థాశ్రయా!" అనే [[మకుటం]]<nowiki/>తో శతకము వ్రాశాడు. విజయరామరాజుకు రామతీర్థంలోని శ్రీరామునిపై భక్తి ఎక్కువ. ఆ దేవస్థానం కట్టించింది విజయనగర సంస్థానాధీశులే. ఆ శతకాన్ని విని విజయరామరాజు తన్ను సంబోధిస్తూ దాన్ని వ్రాసినట్లు భావించి తృప్తి పొందాడు. చాడీలు చెప్పిన పండితుల పాచిక పారలేదు.
 
{{శతకములు}}
"https://te.wikipedia.org/wiki/విజయరామ_శతకము" నుండి వెలికితీశారు