అగ్నికులక్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
'''అగ్నికులక్షత్రియులు''' అనునది ఒకానొకప్పుడు దేశవ్యాప్తంగా ప్రబలియున్న గొప్ప పాలకవంశము. ఇది ఏవో కొన్నిరాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన కులము కాదు. అగ్నికులక్షత్రియులు ప్రధానంగా [[వ్యవసాయము]], నౌకానిర్మాణము, [[శిల్పకళ]], [[దేవాలయం|దేవాలయ]] [[పూజారి|అర్చక]]<nowiki/>త్వములను వృత్తులుగా కలిగియుండేవారు. [[పల్లవులు]] ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి చేసిన నౌకానిర్మాణము, నౌకాయానము, నౌకావ్యాపారము 50సం||ల క్రిందటివరకు అగ్నికులక్షత్రియుల ఆధ్వర్యంలోనే నడిచింది. పల్లవులు అభివృద్ధి పరచిన దేవాలయవ్యవస్థ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అగ్నికులక్షత్రియుల ఆధ్వర్యంలోనే నడుస్తున్నది. అగ్ని పదమునకు [[సంస్కృతము|సంస్కృత]] పదము 'వహ్ని'. 'వహ్ని'కి వికృతి 'వన్ని'.
===పుట్టుపూర్వోత్తరాలు===
ఉత్తర భారతదేశంలో మౌర్య, శుంగ వంశములు అంతరించుట వల్ల, అప్పటికే [[కావేరి]], [[గంగా నది|గంగా]] నదుల మధ్య, తూర్పు పశ్చిమ సముద్రముల మధ్య విస్తరించియున్న ఆంధ్రమహాసామ్రాజ్యాన్ని [[శాతవాహనులు|శాతవాహన]] వంశజులైన రాజపుత్రులు అల్పరాజ్యములను స్థాపించుట వలన సరైన నాయకత్వము లేకపోవుట వల్ల, పరదేశీయుల దాడినుండి దేశమును రక్షించగల చక్రవర్తిత్వం కొరకు అప్పటి పీఠాధిపతులు [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]]<nowiki/>రాజవంశములనుండి వీరులగు నలుగురును ఏరి వారియందు బ్రహ్మతేజస్సును, క్షాత్రతేజస్సును నిలుచునట్లు సంకల్పించి వారిచేత హోమాదులను చేయించి, దేశమును నాలుగు భాగములుగాచేసి ఆ నలుగురిని అధినాయకులుగా చేశారు. ఆ నలుగురు తమ నాయకత్వమును అంగీకరించిన సామంతరాజులతో కలిసి విదేశీయుల దాడులనుండి దేశమును కాపాడారు. ఈ నాలుగువంశముల వారు అగ్నికులక్షత్రియులు అని పిలువబడ్డారు. అగ్ని దేవతలలో బ్రాహ్మణుడు. బ్రాహ్మణవర్ణమందు పుట్టి క్షాత్రమవలంబించిన వాడు "అగ్నికులక్షత్రియుడు”. వీరి [[నాయకత్వము]]<nowiki/>ను అంగీకరించిన వారిలో [[శాతవాహనులు|శాతవాహను]]<nowiki/>ల సామంతులైన [[పల్లవులు]]<nowiki/>ఉన్నారు.
===అపోహ===
భారతదేశంలో కులాల విభజనకు, కులవృత్తులను స్థిరపరచడానికి మూలగ్రంథమైన మనుస్మృతి 10అ.48శ్లోకంలో "మత్స్యఘాతో నిషాదానాం.... చేపలుపట్టే వృత్తి నిషాదులది” అని ఉంది. అగ్నికులక్షత్రియులు (పల్లవులు) నిషాదులని చరిత్రలో ఎక్కడా లేదు. [[సముద్రం]]<nowiki/>లో [[చేపలు]]<nowiki/>పట్టి అమ్ముకోవడం వీరి ప్రధానవృత్తి అని, అగ్నికులక్షత్రియులు అన్నా పల్లీలు, [[జాలరి]], [[బెస్త]], [[గంగవారు]], [[గంగపుత్ర]], [[గూండ్ల]], [[పల్లికాపు]], పల్లెరెడ్డి, [[నెయ్యల]], [[పట్టపు]] అన్నా ఒకటేనని చెప్పటానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. కనీసము పై కులాలు అగ్నికులక్షత్రియ కులానికి ఉపకులాలు కూడా కావు.<br>
అగ్నికులక్షత్రియ (పల్లవ) కులాన్ని సమాజం ఎందుకు చిన్నచూపు చూస్తుందో, ఎందుకు హేళన చేస్తుందో, ఎందుకు అణచివేస్తుందో విజ్ఞులు, మేధావులు, నిజాయితీగల చారిత్రక పరిశోధకులు నిగ్గుతేల్చవలసిఉంది.అగ్నికుల క్షత్రియులు బ్రాహ్మణ సనాతన ధర్మాలున్న సుక్షత్రియులు యజ్నోపవిత్రం ఆలయ అర్చకత్వం, రాజ్యపాలన వీరి నైజం అంతేకాని ఈ మధ్యలో వచ్చిన సాధారణ జాలరులతో వీరిని చేర్చి అవమానపరచటమే అవుతుంది .సాక్షాత్తు శ్రీరామచంద్రుని గోత్రమున్న ఏకైక [[క్షత్రియుడు]] అగ్నికులక్షత్రియుడు మాత్రమే ...కాలానుగుణంగా మారిన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాచరికాన్ని కుడా తస్కరించి వీరిని వీరి కులచరిత్రను కుడా కొన్ని కులాల వారు ఉపయోగించుకొవటం శోచనీయం