పెమ్మసాని రామలింగ నాయకుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 1:
విజయనగర సామ్రాజ్యకాలములో బహు పేరుప్రఖ్యాతులు పొందిన సేనాధిపతులు, సామంతరాజులు [[పెమ్మసాని నాయకులు]]. వీరు [[ఓరుగల్లు]] పతనము పిమ్మట [[విజయనగరము]]
గండికోట పాలకునిగా కీర్తిప్రతిష్టలు బడసిన తిమ్మా నాయుని మునిమనుమడు రామలింగ నాయుడు. తిమ్మానాయుని కొడుకు వీరతిమ్మానాయునికి చెన్నప్పయను కుమారుడున్నాడు. చెన్నప్పకు రామలింగ, పెద్దతిమ్మ అను ఇద్దరు కొడుకులున్నారు. వీరిలో రామలింగ నాయుడు మహాయోధునిగా [[బహుళ]] పేరుప్రఖ్యాతులు సంపాదించాడు. రామలింగ గండికోటను 1509 నుండి 1530 వరకు పాలించాడు. ఈతనివద్ద మహాయోధులగు 80000 సైనికులున్నారు. విజయనగరములో బస చేయడానికి 1430 కుంటల స్థలముంది. శ్రీక్రిష్ణదేవరాయలకు సామంతునిగా యుద్ధసమయములలో ముఖ్య సేనాధిపతిగా వ్యవహరించుచు గుల్బర్గా, గొల్లకొండ, అహమ్మదునగరు సేనలపై ఒకేమారి [[విజయము]] సాధించి ముగ్గురు తురుష్క వజీరులను సంహరించి క్రిష్ణదేవరాయనికి విశ్వాసపాత్రుడయ్యాడు. [[రాయచూరి యుద్ధము]]లో అవిక్రపరాక్రముడై విజ్రింభించి అహమ్మదు షా గుడారపు త్రాళ్ళు కోసి సుల్తానును పారద్రోలాడు. రామలింగని సాహసములను కవి రాయవచకము అను గ్రంథములో పలువిధాల కొనియాడాడు. రామలింగ [[అనంతపూరు]] మండలములో పలు దేవాలయములు కట్టించాడు. పోర్చుగీసు చరిత్రకారుడు న్యూనెజ్ రామలింగనాయుని కామనాయక్ అని ఉదహరించాడు.
|