మారేపల్లి రామచంద్ర శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 37:
 
==బాల్యం==
వీరు [[కృష్ణా జిల్లా]], కనకపల్లి అగ్రహారం లో [[నవంబరు 3]], [[1874]] లో జన్మించారు. కనక దుర్గమ్మ, శ్రీరాములు వీరి తల్లిదండ్రులు. శాస్త్రి గారు పుట్టింది [[కృష్ణా జిల్లా]] అయినా విశాఖపట్టణాన్నే తన స్వంత ఊరు చెసుకున్నారు. [[ప్రాథమిక విద్య]] కనకపల్ల గ్రామంలోనూ, కళాశాల విద్య [[కాకినాడ]] , విశాఖ<nowiki/>లోనూవిశాఖలోనూ సాగింది. 1893 లో విశాఖ హిందూ కళాశాలలో ఎఫ్,ఎ క్లాసులో చేరడనికి శాస్త్రిగారు తొలుత విశాఖలో అడుగు పెట్టారు. [[విద్యార్థి]]గా, విశాఖ వచ్చిన రామచంద్ర శాస్త్రిగారు బహుముఖ సేవల ద్వారా ప్రజల హృదయాలకు సన్నిహితుడై తన మనుగడను విశాఖకు అంకితమిచ్చాడు.
 
19 వ శాతాబ్ది ఆఖరు దశకంలో "జాతీయ ఉద్యమం" విద్యావంతులలో నెమ్మది నెమ్మది గా దేశభక్తిని ప్రబోధించ సాగింది. 1893 లో కాంగ్రెస్ నివేదిక చదవడంతో శాస్త్రిగారిలో "నా దేశం - నా భాష" అనే అభిమానం వచ్చింది. వీరు చదువు చాలించిఅ తరువాత కొద్దిమాసాలు మునసబు కోర్టులో పనిచేశారు. విశాఖ మిషన్ [[పాఠశాల]]లో కొన్నేళ్ళు తెలుగు పండితులుగా పనిచేశారు. "దేశ సేవకు భాషా సేవకు తగినవారిని తయారుచేస్తేనే ఉద్యమాలు ఫలవంతం కాగలవని" కవిగారు తొలి నుంచి భావించారు.