హిందూ కళాశాల (బందరు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
'''హిందూ కళాశాల''' [[మచిలీపట్నం]]లోని ప్రముఖమైన, పురాతనమైన కళాశాల. ఇది [[1938]]లో ప్రారంభమైనది.
==చరిత్ర==
అమరావతి శేషయ్యశాస్త్రి మచిలీపట్నంలో కలెక్టరు కార్యాలయంలో శిరాస్తాదారుగా పనిచేసేవాడు. ఇతనిది తమిళనాడు రాష్ట్రంలోని [[కుంభకోణం]]. ఉద్యోగరీత్యా మచిలీపట్నంలో 15 సంవత్సరాలపాటు నివసించాడు. ఆ సమయంలో బందరులో క్రైస్తవ ప్రచారకులైన నోబుల్ దొర, షార్కీ దంపతులు, ఫాక్స్ అనే క్రైస్తవ మిషనరీ మొదలైన వారు హిందువులను మతాంతీకరణకు ప్రోత్సహించడం చూసి శేషయ్యశాస్త్రి కలతచెందాడు. క్రైస్తవులు పాఠశాలలను నెలకొల్పి హిందూ విద్యార్థులను చేర్చుకుని వారికి విద్య, ఉచితభోజనం కల్పించి వారిని తమ మతంవైపుకు ఆకర్షించే ప్రయత్నాన్ని గమనించి ఇతడు హిందూ మతస్థులకు ప్రత్యేకించి ఒక పాఠశాల స్థాపించి విద్యగరపడం వల్ల యువకులను, విద్యార్థీవిద్యార్థినులను హిందూ మతంలోనే కొనసాగేటట్లు చేయవచ్చని భావించాడు. ముంజలూరు పురుషోత్తం అనే యువకునితో కలిసి ఇతడు [[1856]], [[జనవరి 1]]న "హిందూ ఆంగ్లో వెర్నాక్యులర్ స్కూల్" పేరుతో ఒక పాఠశాలను ప్రారంభించి ఇంగ్లీషు, తెలుగు భాషలను బోధించసాగాడు. ఈ స్కూలుకు టేలర్ అనే ఆంగ్లేయుడు మొదటి ప్రధానోపాధ్యాయుడు. 1963లో ఈ పాఠశాల "హిందూ హైస్కూల్"గా రూపాంతరం చెంది మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా చేర్చబడింది. శేషయ్యశాస్త్రికి మచిలీపట్నం నుండి బదిలీ కావడంతో ఈ విద్యాలయ బాధ్యతను ముంగునూరి నరసింహం పంతులు స్వీకరించాడు.
 
==పూర్వ విద్యార్థులు==
* [[దివాకర్ల వేంకటావధాని]] - అవధాని, పరిశోధకుడు, విమర్శకుడు
"https://te.wikipedia.org/wiki/హిందూ_కళాశాల_(బందరు)" నుండి వెలికితీశారు