పరవస్తు వెంకట రంగాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

+వర్గం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పరవస్తు వెంకట రంగాచార్యులు''' సంస్కృతాంధ్ర పండితుడు, ప్రముఖ తత్వవేత్త మరియు చెప్పుకోదగిన తెలుగు కవి. తర్కము మరియు వ్యాకరణాలలో నిష్ణాతుడు.
రంగాచార్యులు [[విశాఖపట్నం]] లో జన్మించాడు. ఎనిమిదేళ్ల వయసులోనే సంస్కృతములో కుంభకర్ణ విజయము అనే కావ్యమును రచించాడు. ఉర్లం, విజయనగరం మరియు మైసూరు మహారాజులు ఈయనను గౌరవించి సత్కరించారు. అన్నింటికంటే మించి ఈయన శతావధానములో నిష్ణాతుడై ''మహా మహోపాధ్యాయ'' అన్న బిరుదు పొందినాడు. ఈయన తెలుగు సాహిత్యములో శ్రేష్ట గ్రంధాలుగా ఎన్నదగిన ''కమలిని కలహంసము'', ''వేద రహస్యము'' మరియు ''మంజుల నైషదము'' లను రచించాడు.
 
తెలుగు వాజ్ఞ్మయము వ్యాపనకు ఈయన సలిపిన కృషి అత్యంత ప్రశంసనీయము. రంగాచార్యులు [[భారతదేశము]]లో క్రైస్తవ మత భోధనలను వ్యతిరేకించాడు. హిందూ తత్వము మరియు సంస్కృతులకు గట్టి మద్దతునిచ్చాడు. ఈయన చివరి రోజులు [[తుని]]లో గడిపాడు.
 
పూర్వము తెలుగులో పదకోశములు పద్య రూపములోనే ఉండేవి. తరువాత అకారాదిక్రమములో నిఘంటువులు వ్రాసే ప్రయత్నము జరిగినది. [[రాబర్ట్ కాల్డ్వెల్]] గారు, [[చార్లెస్ ఫిలిప్ బ్రౌన్]] గారు ఈ విషయములో ప్రధమముగా కృషి చేసిన మహనీయులు.