హిందూ సామ్రాజ్య దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

మొలక ఘటనలు వ్యాసం మూస తొలగించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
చరిత్ర ప్రకారం, హైందవ స్వరాజ్ స్థాపించడానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ యుక్తవయసులోనే [[ప్రమాణం]] చేశాడు.మొఘలులపై పోరాటంచేసాడు.అనేక కోటలను జయించాడు.అతనిని గురించిన కథలు ప్రతి భారతీయుడు మనస్సులో ఆడ్రినలిన్ గ్రంధిలా ప్రహహించే గర్వించదగిన ఉత్తేజాన్ని కలిగిస్తాయి.[[యమునా నది|యమున]], [[సింధూ నది|సింధు]], [[గంగా నది|గంగా]], [[గోదావరి]], [[నర్మదా నది|నర్మదా]], [[కృష్ణా నది|కృష్ణ]], [[కావేరి నది|కావేరితో]] సహా ఏడు నదుల పవిత్ర జలాలతో పట్టాభిషేకం చేశారు.రాయ్‌ఘడ్‌‌లో ఆ రోజుల్లోనే దాదాపు యాభై వేల మంది పాల్గొన్న గొప్ప కార్యక్రమం ఇది. శివాజీకి షకకర్త (ఒక శకం స్థాపకుడు), ఛత్రపతి (పరమావ సార్వభౌమాధికారి) అనే పేర్లు పెట్టారు.అతను హిందూ విశ్వాసం రక్షకుడు, అంటే హైందవ ధర్మోధారక్ అనే బిరుదును పొందాడు.<ref name=":0" />
 
అతను తన జీవిత కాలంలో, [[మొఘల్ సామ్రాజ్యం]], [[గోల్కొండ]] సుల్తానేట్, [[బీజాపూర్|బీజాపూర్ సుల్తానేట్]], అలాగే [[ఐరోపా సమాఖ్య|యూరోపియన్]] వలస శక్తులతో పొత్తులు,శత్రుత్వాలలో విజయం పొందాడు.అతని సైనిక దళాలు [[మరాఠీ భాష|మరాఠా]] గోళాన్ని విస్తరించి, కోటలను అన్నిటినీ వారి స్వాధీనం చేసుకున్నాయి.మరాఠా నావికాదళాన్ని ఏర్పాటు చేశాడు.చక్కటి నిర్మాణాత్మక పరిపాలనా సంస్థలతో సమర్థ, ప్రగతిశీల పౌర పాలనను సాగించాడు.అతను ప్రాచీన హిందూ రాజకీయ సంప్రదాయాలను, న్యాయస్థాన సమావేశాలను పునరుద్ధరించాడు. కోర్టు నిర్వహణలలో [[పార్సీ భాష|పెర్షియన్]] భాష కాకుండా మరాఠీ, [[సంస్కృతము|సంస్కృతం]] వాడకాన్ని ప్రోత్సహించాడు.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కు ఈ దినోత్సవం రోజు చాలా ముఖ్యమైంది, సంస్థాగత స్థాయిలో వారు అధికారికంగా జరుపుకునే ఆరు పండుగలలో ఇది ఒకటి.ఇతర ఐదు పండుగలు [[దసరా|విజయదశిమి]], [[మకర సంక్రాంతి]], [[ఉగాది]], [[గురుపౌర్ణమి|గురుపూర్ణిమ]], రక్షాబంధన్ మహోత్సవ్.<ref name=":0" />
 
== మూలాలు ==