ఉండమ్మా బొట్టు పెడతా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 54:
 
==కథ==
ఆ ఊళ్లోని మోతుబరి ఆసామి దశరథరామయ్య (నాగయ్య). ఆయనకు నలుగురు కుమారులు. పెద్దవాడు శ్రీనివాస్ (నాగభూషణం). పేకాట వ్యసనపరుడు. అతని భార్య తులసి (షావుకారు జానకి). ఇంటి శుభ్రత, పనిపాటల కంటే పూజలకు ఎక్కువ సమయం కేటాయిస్తుంది. వారి కుమార్తె పద్మ (ప్రసన్నరాణి). రెండో కొడుకు వెంకటేశం (అర్జా జనార్ధనరావు). తాగుబోతు, తిరుగుబోతు. మేనమామ సాక్షి రంగారావు కూతురు శేషు (సూర్యకళ)ను పెళ్లి చేసుకుంటాడు. రోజూ భార్యతో గొడవ పడుతుంటాడు. వారికి ఇద్దరు సంతానం. మూడోవాడు చలం (రంగ), అతని భార్య సుమతి (మీనాకుమారి). ఎక్కువ చదివానన్న అహంతో భర్తను అవహేళన చేస్తుంటుంది. నాల్గవ కొడుకు కృష్ణ (కృష్ణ). మంచితనం, సత్ప్రవర్తన కలిగిన కుర్రాడు. తండ్రికి చేదోడువాదోడుగా ఉంటుంటాడు. ఆ ఊరి హరిదాసు (ధూళిపాళ) కుమార్తె లక్ష్మి (జమున). కూతురి పెళ్లికోసం వడ్డీ వ్యాపారి, హోటలు నడిపే పాపాయమ్మ (సూర్యాకాంతం) వద్ద డబ్బు కూడబెడుతుంటాడు దాసు. లక్ష్మిని మౌనంగా ఆరాధిస్తుంటాడు కృష్ణ. ఆమె కూడా అతని పట్ల వౌనంగా ఆరాధన ప్రదర్శిస్తుంటుంది. ఈ సమయంలో లక్ష్మికి పెళ్లి కుదురుతుంది. అయితే, దాసు దాచుకున్న డబ్బులు లేవని పాపాయమ్మ అబద్ధమాడటంతో లక్ష్మి పెళ్లి ఆగిపోతుంది. దశరథ రామయ్య పెద్ద మనసుతో అదే ముహూర్తానికి లక్ష్మి, కృష్ణకు పెళ్లి జరిపిస్తాడు. పేదింటినుంచి వచ్చిన లక్ష్మికి, అత్తవారింట తోడికోడళ్ల నుంచి అవమానాలు ఎదుర్కొంటుంది. వాటిని నిబ్బరంతో భరిస్తూనే, భర్తకు తోడుగా నిలుస్తుంది. పొలంలో బావి తవ్వించి భూమిని సస్యశ్యామలం చేస్తుంది. పురిటికి పుట్టింటికెళ్లి ఆడపిల్లను ప్రసవిస్తుంది. బిడ్డతో వచ్చిన ఆమెకు అత్తింట ఎన్నో ఇక్కట్లు ఎదురవుతాయి. బావగార్లను పోలీసులు అరెస్టు చేయటం, ఇంట్లో అనాచారాలు ఎదురవ్వడం లాంటివి. ఆ ఇంటి సిరి లక్ష్మీదేవి ఇల్లొదిలి వెళ్లిపోతానంటుంది. బొట్టు పెట్టించుకుని వెళ్లమని లక్ష్మీదేవిని కోరి, బిడ్డను ఊయలలో ఉంచి, తాను బావిలోకి దూకి తనువు చాలిస్తుంది లక్ష్మి. ఆమె వచ్చి బొట్టు పెట్టేవరకూ ఉండాలి కనుక లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే ఉండిపోవడం, తోడికోడలు ఆత్మత్యాగంతో తులసీ తదితరుల్లో మార్పురావడం, అన్నదమ్ములు ఐకమత్యంతో భూమిని పండించి జాతీయస్థాయిలో కృషి పండిట్ అవార్డు తండ్రి దశరథ రామయ్యకు వచ్చేలా చేయటం, అవార్డు బహూకరణ సందర్భంలో తమ గత జీవితం గూర్చి మంత్రికి వివరించిన దశరాథ రామయ్య, అవార్డును తన మనుమరాలు, లక్ష్మి కుమార్తె చిన్నలక్ష్మికి అందింపచేయటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది<ref>[{{Cite web |url=http://www.andhrabhoomi.net/content/flashback50-26 |title=ఉండమ్మా బొట్టు పెడతా - సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆంధ్రభూమి దినపత్రిక 22-09-2018] |website= |access-date=2018-11-02 |archive-url=https://web.archive.org/web/20181003231648/http://www.andhrabhoomi.net/content/flashback50-26 |archive-date=2018-10-03 |url-status=dead }}</ref>.
 
==పాటలు==