తూము లక్ష్మీనరసింహదాసు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: భద్రాద్రి శ్రీరాముని తన ఇష్టదైవంగా జీవితాంతం సే...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
భద్రాద్రి [[శ్రీరాముడు|శ్రీరాముని]] తన ఇష్టదైవంగా జీవితాంతం సేవించి తరించిన భక్త శిఖామణి '''తూము లక్ష్మీనరసింహదాసు'''. భద్రాచల [[రామదాసు]] కర్మలేశం అనుభవించడానికి ఇలా మరలా జన్మించారని కొందరి భావన. తూము వారిది గుంటూరు మండలం. వీరి తండ్రి అప్పయ్య మరియు తాత వెంకటకృష్ణయ్య గార్లు శిష్టాచారపరులుగా ప్రసిద్ధులు.
 
 
ఇతడు [[1790]]లో అప్పయ్య, వెంకమాంబ దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు. ఇతనికి ఇరవై సంవత్సరాల వయసులో తండ్రి పరమపదించడంతో కుటుంబ భారం దాసుగారిపై పడినది. అందుకోసం [[పొన్నూరు]]లో పేష్కారుగా పనిచేశారు. వంశానుగతంగా దాసుకు లభించిన వరం రామభక్తి. తన ఇంటిలోనే రామ మందిరం నిర్మించి, అడ్డుగా ఉన్న ఉద్యోగాన్ని వదులుకున్నారు.
 
 
దాసుగారు భారతదేశం అంతా సంచరించి తాము దర్శించిన దేవతలను పద్య కుసుమాలతో పూజించారు. కాలినడకన వీరు కాశీయాత్ర, పూరీ, కుంభకోణం, తిరువయ్యూరు దర్శించారు. మహాభక్తుడైన త్యాగరాజు వీరిని ఎదుర్కొని కీర్తనలు గానం చేస్తూ స్వాగతం చెప్పారు. తరువాత కాంచీపురం, తిరుపతి, అయోధ్య, హరిద్వారం కూడా దర్శించారు. అక్కడ నుండి భద్రగిరి చేరిన దాసుగారు శ్రీరామునికి జరుగవలసిన పూజాదికాలు కుంటుపడాడం బాధ కలిగించాయి. రామచంద్రుడు ఒకనాటి రాత్రి కలలో కన్పించి హైదరాబాదులో మంత్రిగా ఉన్న చందూలాల్ అనే తన భక్తుని