అబుల్ హసన్ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→పరమత సహనం: అక్కన్న మాదన్నకు లింకు ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit |
→గోల్కొండ పతనం: అక్షర దోషాల సవరణ ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 12:
==గోల్కొండ పతనం==
[[File:Mir Jumla.jpg|thumb|కర్ణాటకమును
తానీషా కంటే ముందు చక్రవర్తిగా ఉన్న తానీషా మామ, [[అబ్దుల్లా కుతుబ్ షా]]ను దక్కన్లో [[మొఘల్ సామ్రాజ్యము|మొఘల్]] సేనానిగా ఉన్న [[ఔరంగజేబు]] ఓడించి [[మొఘల్ సామ్రాజ్యము|మొఘల్]] చక్రవర్తి [[షాజహాను]] యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించి కప్పం కట్టే విధంగా ఒప్పందం కుదిర్చాడు. మొగలుల దండయాత్రల నుండి గోల్కొండను రక్షించడానికి మహారాష్ట్ర నాయకుడైన [[శివాజీ]]తో అబుల్ హసన్ సంధి కుదుర్చుకున్నాడు. 1680లో శివాజీ మరణం తరువాత 1685లో ఔరంగజేబు తన కుమారుడైన షా ఆలం నాయకత్వంలో గోల్కొండ పైకి దండయాత్ర చేశాడు. మొదట గోల్కొండకే విజయం లభించినా, చివరకు కొందరు సేనానుల నమ్మకద్రోహం వలన గోల్కొండ సైన్యాలు ఓడిపోయాయి. పర్యవసానంగా అబుల్ హసన్ మొగలులతో సంధి చేసుకున్నాడు. సంధి షరతుల ప్రకారం అబుల్ హసన్ బకాయిల క్రింద కోటి హొన్నులు చెల్లించాలి. సంవత్సరానికి రెండు లక్షల హొన్నులు కప్పం చెల్లించాలి. మల్ఖేడు ప్రాంతాన్ని మొగలాయిలకు అప్పగించాలి. అక్కన్న, మాదన్నలను ఉద్యోగాల నుండి తొలగించాలి.
మొగలు సైన్యం నిష్క్రమించిన తరువాత అక్కన్న, మాదన్నలను తొలగించడానికి అబుల్ హసన్ జాప్యం చేశాడు. ఔరంగజేబు కోపానికి కారణం వీరేనని భావించిన కొందరు ముస్లిం
[[1683]] ప్రాంతంలో అబుల్ హసన్ మొఘల్ చక్రవర్తులకు కట్టవలసిన పన్నులను సకాలములో చెల్లించలేదు. దీని పర్యవసానంగా గోల్కొండపై మొఘలుల ఆధిపత్యాన్ని పటిష్ఠపరచేందుకు బీజాపూర్ ఆక్రమణ పూర్తయిన తరువాత ఔరంగజేబు స్వయంగా గోల్కొండపై [[1687]] [[ఫిబ్రవరి 7]]న దండయాత్ర చేశాడు. తానీషా గోల్కొండ కోటపై ఔరంగజేబు దాడిని ఎనిమిది నెలలపాటు నిలువరించాడు. కానీ [[1687]] [[అక్టోబర్ 3]]వ తేదీన ఔరంగజేబు లంచం ఇచ్చి కోటలు తలుపులు తెరిపించి, గోల్కొండ కోటను వశపరచుకున్నాడు. తానీషాను బందీగా తీసుకొని వెళ్ళి [[దౌలతాబాదు]] కోటలో 13 సంవత్సరాలు (అనగా క్రీ.శ. 1700) మరణించేవరకు బంధించి ఉంచారు.
తానీషా ఓటమితో గోల్కొండ కుతుబ్ షాహీ వంశము అంతమొంది దక్కన్లో మొఘలుల ఆధ్వర్యములో [[నిజాం]] పాలన క్రీ.శ. [[1701]] నుండి ప్రారంభమయ్యింది.
==మూలాలు==
{{మూలాల జాబితా}}
|