రౌడీ రాముడు కొంటె కృష్ణుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సాంకేతిక సిబ్బంది: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి →‎కథ: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 13:
 
== కథ ==
ఈ చిత్రం భాజీ ప్రసాద్ (రావు గోపాల్ రావుగోపాలరావు) పై ప్రారంభమవుతుంది. అతడు గౌరవనీయమైన వ్యక్తిగా భావించే భయంకరమైన నేరగాడు. అతని అనుచరుడు గిరి (నూతన్ ప్రసాద్) ఒక జిత్తులమారి నక్క, దుర్మార్గుడు. ఎల్లప్పుడూ అతన్ని డబుల్ క్రాస్ చెయ్యడానికి ప్రయత్నిస్తూంటాడు.. వారిద్దరూ ఇద్దరు డబుల్ ఏజెంట్లు - కవల సోదరులు సత్యం & నారాయణ (సత్యనారాయణ) లను - నిర్వహిస్తూంటారు. రాము (ఎన్.టి.రామారావు) ధైర్యవంతుడు, డబ్బు కోసం ఎంత రిస్కైనా చేస్తాడు. ఒకసారి, అతను ఒక చిన్న దొంగ ముత్యం (శ్రీదేవి) తో పరిచయమై ఆమెతో ప్రేమలో పడతాడు. సమాంతరంగా, ఈ యువకుడు కృష్ణ (నందమూరి బాలకృష్ణ) ఒక బ్యాంకులో గుమస్తాగా పనిచేస్తూంటాడు. తన తల్లి (పుష్పలత) తో కలిసి ఉంటాడు. భాజీ ప్రసాద్ మేనకోడలు లక్ష్మి (రాజలక్ష్మి) ని ప్రేమిస్తాడు. తరువాత, రాము & కృష్ణ రెండుసార్లు చిత్రమైన పరిస్థితులలో కలుసుకుని మంచి స్నేహితులు అవుతారు. ఇంతలో, భాజీ ప్రసాద్‌కు హిమాలయాల వద్ద ఉన్న ఒక పురాతన నిధి గురించి తెలుస్తుంది. పురావస్తు శాస్త్రవేత్త హరగోపాల్ (చలపతి రావు) దాని మార్గ పటాన్ని తయారు చేసుకున్నాడు. గిరికి దాని సంగతి తెలిసి దాన్ని సంపాదించే పన్నాగం పన్నుతాడు. వారు హరగోపాల్‌ను కొట్టడానికి ముందు, అతను కృష్ణ పనిచేసే బ్యాంకు లాకర్‌లో మ్యాప్‌ను భద్రపరుస్తాడు. అదే సమయంలో, భాజీ ప్రసాద్ కృష్ణ, లక్ష్మిల ప్రేమ వ్యవహారం తెలుసుకుంటాడు. భాజీ ప్రసాద్ వాళ్ళ ప్రేమకూ లాకరులోని మ్యాపుకూ ముడిపెడతాడు. కృష్ణ అందుకు తిరస్కరించగా, భాజీ ప్రసాద్ అతడి తల్లిని నిర్బంధించగా, చేసేది లేక అతడు మ్యాప్‌ను దొంగిలిస్తాడు. అదే సమయంలో, గిరి కూడా దాడిని ప్లాన్ చేస్తాడు, అయితే, కృష్ణ తన స్నేహితుడు రంగా (లక్ష్మీకాంత్) వద్ద పటాన్ని దాచేస్తాడు. దాన్ని గుర్తించి, బ్లాక్‌గార్డ్‌లు రంగాను చంపుతారు కాని మ్యాప్‌ ఎక్కడుందో కనుక్కోలేకపోతారు.
 
కృష్ణపై నేరారోపణ జరిగి శిక్ష వేస్తారు. కానీ, భాజీ ప్రసాద్ అతన్ని తిరిగి తనవైపుకు తెచ్చుకోవాలనుకుంటాడు. ఆ పని అతను రాముకు అప్పజెబుతాడు. రాముకు ఏదో సందేహాస్పదంగా అనిపిస్తుంది గానీ, అతను కృష్ణను తప్పించి రహస్యంగా దాచిపెడతాడు. తరువాత, వారు సొంత సోదరులమనొ తెలుసుకుంటారు. చివరికి, వారు పటాన్ని సంపాదించుకుంటారు. కానీ, లక్ష్మిని బలవంతం చేయడం ద్వారా భాజీ ప్రసాద్ దానిని తిరిగి సంపాదిస్తాడు.