'''మర్మయోగి''' (''Marmayogi'') 1964లో వెలువడిన ఒక [[తెలుగు సినిమా]].
[[వైతాళికులు]] సంకలన కర్త్తకర్త '[[ముద్దుకృష్ణ]]' ఈ చిత్రానికి రచన చేశాడు. ఆసక్తి కరమైన ప్రారంభం, మధ్య మధ్య ఫ్లాష్ బాక్లతో కొనసాగుతూ వైవిధ్య భరితమైన [[జానపద చిత్రం]]గా రూపుదిద్దుకుంది. చిత్రంలో మొదటి [[మూడు]] పాటలూ ప్రతి నాయిక (వాంపు), మోసపోయే రాజు, ప్రతినాయిక సహచరునిమీద చిత్రింపబడ్డాయి.(బహుళ ప్రజాదరణ పొందిన ''నవ్వులనదిలోనవ్వుల నదిలో పువ్వుల పువ్వులపడవాపడవా'' పాటతో సహా). చిత్రం లోకథ ఎక్కువభాగం ప్రతినాయిక, [[గుమ్మడి]]ల చుట్టూనే తిరుగుతుంది. రామారావు సినిమాలో ఎక్కువభాగం [[శివాజీ]] (ఛత్రపతి)ని పోలిన మారువేషంలో కనిపించటం ఈ చిత్ర ప్రత్యేకత. కృష్ణకుమారి చిత్రం తొలిభాగంలో ఒక సన్నివేశంలొ కన్పించి మళ్ళీ రెండవసగంలోనే కనిపిస్తుంది. చిత్రంలో రామారావు హీరో గా ఉన్నా చిత్రం పేరు గుమ్మడి పాత్ర పరంగా వుంది. మాయలూ మంత్రాలూ లేకుండా బలమైన కథ తో నడిచే ఉత్తమ జానపద చిత్రంగా మర్మయోగిని పేర్కొనవచ్చు.