మదురా ద్వీపం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 28:
మూడవ అమంగ్కురాటు, ఆయన మామ పంగేరన్ పుగర్ మధ్య జరిగిన మొదటి జావానీస్ యుద్ధం తరువాత 1705 లో డచ్చి మదురా తూర్పు భాగంలో నియంత్రణ సాధించింది. ప్యూగర్ డచ్చి గుర్తింపు లభించడం పశ్చిమ మదుర ప్రభువు( కాక్రానింగ్రాట్)ని ప్రభావితమైంది. మద్య జావాలో మొదలైన యుద్ధంలో మదురీయులు జోక్యం చేసుకుంటారన్న ఆశతో పశ్చిమ మదుర ప్రభువు పుగర్ వాదనలకు మద్దతు ఇచ్చాడు. అమంగ్కురాటు ఖైదుచేయబడి చేయబడి సిలోనుకు పంపబడిన సమయంలో పుగర్ మొదటి పకుబువోనో అనే బిరుదును స్వీకరించి డచ్తో ఒక ఒప్పందం మీద సంతకం చేసిన ఫలితంగా డచ్చి తూర్పు మదురమీద సాధికారత సాధించింది.
1740 లో చైనా ఊచకోత తరువాత మద్య జావాలో 1740 తిరుగుబాటును అరికట్టడానికి కాక్రానింగ్రాట్సు డచ్చికి సహాయం చేయడానికి అంగీకరించారు. డచ్తో 1743 ఒప్పందంలో మొదటి పకుబువోనో డచ్చివారికి మధుర మూద పూర్తి సార్వభౌమత్వాన్ని ఇచ్చాడు. దీనిని నాలుగవ కాక్రానింగ్రాటు ఎదిరించి ఓడిపోయి బంజర్మాసిన్ ప్రాంతానికి పారిపోయి ఆంగ్లేయుల ఆశ్రయం పొందాడు. సుల్తాను మోసానికిగురై దోపిడి చేయబడి డచ్చి చేత బంధించబడి కేప్ ఆఫ్ గుడ్ హోప్కు బహిష్కరించబడ్డాడు.
తరువాత డచ్చి వారు తమ సొంత ప్రతినిధితో మదురప్రాంతాన్ని నాలుగు రాష్ట్రాలుగా విభజించి పరిపాలనా కొనసాగించారు. ప్రారంభంలో ఈ ద్వీపం వలస దళాల మకాంగా ఉపయోగించబడింది. 19వ శతాబ్దం రెండవ భాగంలో ద్వీపసమూహంలోని డచ్-నియంత్రిత భూభాగాలకు ఉప్పు ప్రధాన ఆదాయవనరుగా మారింది.
== మూలాలు ==
|