బేతాళ కథలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
బేతాళ పంచవింశతి కథల మూలాలు అత్యంత ప్రాచీనమైనవి. క్రీ. పూ. 1 వ శతాబ్దానికి చెందిన ఈ కథలు తొలిసారిగా శాతవాహనుల యుగానికి చెందిన గుణాడ్యుని బృహత్కథలో ఒక భాగంగా చోటుచేసుకొన్నాయి. మొట్టమొదట పైశాచి భాష (ప్రాకృత భాషా భేదం) లో రాయబడిన ఈ కథలు తరువాతి కాలంలో [[సంస్కృతము|సంస్కృత]] భాషలోనికి అనువదించబడ్డాయి. అయితే పైశాచి భాషలోని బృహత్కథ మూలగ్రంధం అలభ్యం కావడంతో సంస్కృత భాషలో అనువదించబడిన కథలే మిగిలాయి.
 
పైశాచి భాషలో వున్న బృహత్కథను సంస్కృతంలోకి పద్యరూపంలో బుద్ధస్వామి, క్షేమేంద్రుడు, సోమదేవసూరిలు అనువదించారు. అయితే బుద్ధస్వామి (క్రీ.శ. 5 వ శతాబ్దం) ‘బృహత్కతా శ్లోక సంగ్రహం’లో ఈ బేతాళ కథలు లేవు. [[క్షేమేంద్రుడు]] (క్రీ.శ. 11 వ శతాబ్దం) ‘బృహత్కథామంజరి’, సోమదేవసూరి (క్రీ.శ. 11 వ శతాబ్దం) ‘కథాసరిత్సాగరం’ లలోనే ఈ బేతాళ కథలు చోటుచేసుకొన్నాయి.<ref name="M.Gopalareddy|2002">{{cite book |last1=Mudiganti |first1=Gopala Reddy |last2=Mudiganti |first2=Sujatha Reddy |title=Sanskrita Sahitya Charitra (Telugu) |publisher=Potti Sriramulu Telugu University |location=Hyderabad |page=707 |edition=2002 |accessdate=18 September 2020}}</ref> కాలక్రమేణా బేతాళ పంచవింశతి పేరుమీదుగా కథాగ్రంధ రూపంలో వెలువడినప్పటికీ బేతాళ పంచవింశతి సంస్కృత మూల గ్రంథం మాత్రం లభించలేదు. అప్పటివరకూ పద్య రూపంలోనే వున్న బేతాళ పంచవింశతి కథలను తొలిసారిగా శివదాసు (క్రీ.శ. 11-14 వ శతాబ్దం) చంపూ మార్గంలో (పద్య గద్య మయం) సంస్కృతంలో రాసాడు. తరువాత జంభలదత్తు (క్రీ.శ. 11-14 వ శతాబ్దం) ఈ కథలను గద్యరూపంలో రాసాడు.
 
==కథా నేపధ్యం==
"https://te.wikipedia.org/wiki/బేతాళ_కథలు" నుండి వెలికితీశారు