బేతాళ కథలు: కూర్పుల మధ్య తేడాలు

చి మూలాలు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 6:
బేతాళ పంచవింశతి కథల మూలాలు అత్యంత ప్రాచీనమైనవి. క్రీ. పూ. 1 వ శతాబ్దానికి చెందిన ఈ కథలు తొలిసారిగా శాతవాహనుల యుగానికి చెందిన గుణాడ్యుని బృహత్కథలో ఒక భాగంగా చోటుచేసుకొన్నాయి. మొట్టమొదట పైశాచి భాష (ప్రాకృత భాషా భేదం) లో రాయబడిన ఈ కథలు తరువాతి కాలంలో [[సంస్కృతము|సంస్కృత]] భాషలోనికి అనువదించబడ్డాయి. అయితే పైశాచి భాషలోని బృహత్కథ మూలగ్రంధం అలభ్యం కావడంతో సంస్కృత భాషలో అనువదించబడిన కథలే మిగిలాయి.
 
పైశాచి భాషలో వున్న బృహత్కథను సంస్కృతంలోకి పద్యరూపంలో బుద్ధస్వామి, క్షేమేంద్రుడు, సోమదేవసూరిలు అనువదించారు. అయితే బుద్ధస్వామి (క్రీ.శ. 5 వ శతాబ్దం) ‘బృహత్కతా శ్లోక సంగ్రహం’లో ఈ బేతాళ కథలు లేవు. [[క్షేమేంద్రుడు]] (క్రీ.శ. 11 వ శతాబ్దం) ‘బృహత్కథామంజరి’, సోమదేవసూరి (క్రీ.శ. 11 వ శతాబ్దం) ‘కథాసరిత్సాగరం’ లలోనే ఈ బేతాళ కథలు చోటుచేసుకొన్నాయి.<ref name="M.Gopalareddy|2002">{{cite book |last1=Mudiganti |first1=Gopala Reddy |last2=Mudiganti |first2=Sujatha Reddy |title=Sanskrita Sahitya Charitra (Telugu) |publisher=Potti Sriramulu Telugu University |location=Hyderabad |page=707715 |edition=2002 |accessdate=18 September 2020}}</ref> కాలక్రమేణా బేతాళ పంచవింశతి పేరుమీదుగా కథాగ్రంధ రూపంలో వెలువడినప్పటికీ బేతాళ పంచవింశతి సంస్కృత మూల గ్రంథం మాత్రం లభించలేదు. అప్పటివరకూ పద్య రూపంలోనే వున్న బేతాళ పంచవింశతి కథలను తొలిసారిగా శివదాసు (క్రీ.శ. 11-14 వ శతాబ్దం) చంపూ మార్గంలో (పద్య గద్య మయం) సంస్కృతంలో రాసాడు. తరువాత జంభలదత్తు (క్రీ.శ. 11-14 వ శతాబ్దం) ఈ కథలను గద్యరూపంలో రాసాడు.
 
==కథా నేపధ్యం==
పంక్తి 78:
చిత్ర విచిత్రమైన ఘటనలతో, సాహసాద్భుతాలతో పాఠకులలో కుతూహలాన్ని రేకెత్తించే ఈ కథలలో శృంగార, అధ్బుత రసాలు పోషించబడ్డాయి. బేతాళ పంచవింశతి కథలు కథా కథన సంవిధానంలో ప్రత్యేకతను కలిగివున్నాయి. కథలో కథను చేర్చడం, కథను పాత్రల ముఖంగా చెప్పించడమే కాక ప్రతీ కథను ఒక చిక్కుప్రశ్నతో ముడిపెట్టడం,<ref name="M.Gopalareddy|2002"/> ఆ చిక్కుముడిని విడదీయడానికి ఎంతో వివేచన, తర్కశక్తి అవసరం కావడం మొదలైనవి ఈ కథల విశిష్టత అని చెప్పవచ్చు.
 
ఈ కథలపై బౌద్ధ, శైవ, జైన మతాల ప్రభావం అందులోను తాంత్రిక ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.<ref name="M.Gopalareddy|2002"/> 16 వ భేతాళ కథ (జీమూతవాహనుని త్యాగం) బౌద్ధ జాతక కథను స్పురింపచేస్తుంది. పేర్లు నిర్ణయించబడని ఈ ప్రపంచ ప్రసిద్ధ కథలలో నీతి, త్యాగ, తర్క, ధర్మ, కామ సంబందమైన అంశాలు చక్కగా చిత్రించబడ్డాయి. వీటిలో కొన్ని కథలు నీతి బోదకమైనవి. ఉదాహరణకు 'నలుగురు సోదరులు – సింహం' కథ. అలాగే 'జీమూతవాహనుని త్యాగం', 'వీరవరుని సాహస కృత్యాలు' వంటి కథలలో త్యాగ సంబందమైన అంశాలు చిత్రించబడ్డాయి. 'అతి సుకుమారులైన ముగ్గురు భార్యలు', 'సోమప్రభ – ముగ్గురు ప్రేమికులు' వంటి కథలు తార్కిక అంశాలతో ముడిపడినవి. అదేవిధంగా ధర్మ సంబందమైన అంశాల చిత్రణలు కూడా ఈ బేతాళ కథలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఉదాహరణకు 'హరిస్వామి- అతని దురదృష్టం', 'ముగ్గురు బ్రాహ్మణ యువకులు', 'దొంగ కుమారుడు'. కామ సంబందమైన అంశాలు 'ముగ్గురు ప్రేమ మూఢులు' వంటి కథలలో ఎక్కువగా వర్ణించబడ్డాయి.
 
==కథల ప్రాచుర్యం==
"https://te.wikipedia.org/wiki/బేతాళ_కథలు" నుండి వెలికితీశారు