గూడవల్లి రామబ్రహ్మం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==జీవిత విశేషాలు==
[[1902]] వ సం.లో [[కృష్ణా జిల్లా]], [[ఉంగుటూరు, కృష్ణా|ఉంగుటూరు]] మండలములోని [[నందమూరు (ఉంగుటూరు మండలం)|నందమూరు]] గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు గూడవల్లి వెంకయ్య - బాపమ్మ లకు కలిగిన ఆరుగురు పిల్లలలో రామబ్రహ్మం చిన్నకొడుకు. తొలి తెలుగు [[జ్ఞాన పీఠ్]] అవార్డు గ్రహీత, కవి సామ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] కూడా ఈ గ్రామంలోనే జన్మిచాడు. రామబ్రహ్మం చదువు [[ఇందుపల్లి]], [[గుడివాడ]], [[బందరు]] లలో సాగింది. ఆయనకు 18 ఏళ్ళ వయసులో శారదాంబ తో వివాహం జరిగింది. తర్వాత ఆయన చదువు మానేసి తన మామగారింట్లో విదేశీ వస్త్రాలను దహనం చేసి [[సహాయనిరాకరణోద్యమం]]లో పాల్గొన్నాడు.
 
[[1924]] లో ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో ఒక స్టేషనరీ షాపు ప్రారంభించాడు. అయితే ఆ షాపు వ్యాపారానికి బదులుగా రచయితలు, కళాకారుల సమావేశాలకు, చర్చలకు ఒక మంచి కేంద్రంగా తయారయింది. దాంతో వ్యాపారం తగ్గిపోయి [[1930]] లో మూసివేయవలసి వచ్చింది. ఆయన [[1931]] లో [[అఖిలాంధ్ర రైతు మహాసభ]] ను ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడి హోదాలో నిర్వహించాడు. [[1934]] లో [[ఆంధ్ర నాటక పరిషత్]] కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆయన ''కమ్మ కుల చరిత్ర'' అనే పుస్తకం వ్రాశాడు. ఆ పుస్తకం వ్రాయడం కోసం కమ్మ కులం గురించి అవసరమైన సమాచారం సేకరించడానికి [[కడప]]కు వెళ్ళాడు. అక్కడ ఆయన [[గండికోట]] పట్ల ఆకర్షితుడై ఆ కోట గురించి పరిశోధన చేసి '[[గండికోట పతనం]]' అనే నాటకం వ్రాశాడు. ఈ నాటకం అనేక నగరాల్లో ప్రదర్శించబడి మంచి ప్రజాదరణ పొందింది.