అరిగె రామస్వామి 1895 లో తెలంగాణ రాష్ట్రములోని సికింద్రాబాద్ లో పేద హరిజన కుటుంబములో జన్మించారు. చిన్న చదువుతోనే రైల్వే ఆడిట్ ఆఫీసు లో నాలుగవ శ్రేణి ఉద్యోగం (ఆఫీస్ బాయ్) గా ప్రారంభించి తరువాత పలురకాల ఉద్యోగములు చేసారు. సమాజములో ఉన్న అసమానత, పీడిత, నిమ్న జాతుల ఉద్ధరణకై, వారిలో చైత్యన్యం రావడానికి కృషి చేసిన సంఘ సంస్కర్త, దేశభక్తుడు. అప్పటి నిజాం ప్రభుత్వములో ప్రజలకు ఎటువంటి విషయములలోను స్వేచ్ఛ అనేది ఉండేది కాదు. హిందూ సమాజములో అంటరానివారిగా చూడటం, నిమ్నకులాలతో వెట్టిచాకిరి చేయించడం, ప్రభుత్వ ఉద్యోగుల నిరంకుశ ధోరణి, మూఢాచారాలతో ఉన్న ప్రజలను మేలుకొలిపిన నాయకులలో ఒకరు అరిగె రామస్వామి, రెండో వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ, మూడవ వారు బి.ఎస్ ఎస్. వెంకట్రావు. రామస్వామి కి చిన్న నాటిచిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ ,. 1912 భూమా నందభూమానంద మందపల్లి హనుమంత రాజా అనే యోగి ప్రభొవమునకు ప్రభావంతో, సంపూర్ణ శాఖాహారిగాశాకాహారిగా మారిపోయినాడు. గురువు ఆశిర్వాదములతోఆశీర్వాదములతో "సునీత బాల సమాజం" పేరుపై ఒక సంస్థను ఏర్పాటు చేసి, సికింద్రాబాద్, కుమ్మరి గూడా బస్తీలలో సంఘ సంస్కరణకు పూనుకొన్నాడు. హరిజన వర్గాల్లో వున్నా మల, మాదిగ, మల దాసరి వంటి ఉపతెగలు తొలగించి వారిలో సమైఖ్యసమైక్య భావం నుభావాన్ని పెంపొందించారు. తెలంగాణ లో గ్రంథాలయ ఉద్యమమునకు పాల్గొని, గ్రంథాలయములు నెలకొల్పటం, వాటితో నిరక్షరాస్యతా నిర్మూలనకు కృషి చేశారు.<ref>{{Cite web|url=https://drive.google.com/file/d/1FH3KyvrEqRFpUJp_qbpfM7WIhmlOFIjj/view|title=Aige Ramaswamy - 10 వ తరగతి పాఠ్య పుస్తకం|last=|first=|date=20-10- Oct 2020|website=NCERT తెలంగాణ రాష్ట్ర పుస్తకము|url-status=live|archive-url=|archive-date=|access-date=20-10- Oct 2020}}</ref>