కథలు గాథలు (దిగవల్లి శివరావు): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి clean up, replaced: గ్రామము → గ్రామం (4), typos fixed: స్వేఛ్ఛ → స్వేచ్ఛ, గ్రంధము → గ్రంథము, బాష → భాష ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
చి updated the information |
||
పంక్తి 2:
== రచన నేపథ్యం ==
దిగవల్లి వేంకటశివరావు వృత్తిపరంగా [[న్యాయవాది]] అయినా చారిత్రికాంశాలు, వాటి పరిశోధనపై చాలా ఆసక్తి కలిగివుండేవారు. 96 సంవత్సరాల సుదీర్ఘ జీవితాన్ని 60 చారిత్రిక గ్రంథాల రచనలో ఫలవంతం చేసుకున్నారు. ఆయన తాను చారిత్రిక పరిశోధన చేస్తున్న కొద్దీ లభించిన వివిధ విచిత్రమైన, సామాన్యంగా ఎవరికీ తెలియని విశేషాలను, వింతలను ఈ గ్రంథంగా రచించారు. 1942 నుండి ఒక దశాబ్దంపాటు భారతిలోను, ఆంధ్రపత్రిక ఆదివారం సంచికలలోనూ రాసినవి ఒక పుస్తకంగా 1944లో ముందు ప్రచురితమైంది. 1945లో రెండవభాగం ప్రచురించారు. 1947 కల్లా నాలుగు భాగాలు ప్రచురింపబడ్డాయి. 1954 [[వెంకట్రామా అండు కో]] వారిచే ముద్రించబడిన రెండవ కూర్పు వెలువడింది. అటుతరువాత 2010 లో 1-4 భాగములు కలిపి ఒకే గ్రంథముగా [[విశాలాంధ్ర పబ్లింషింగ్ హౌస్]] [[హైదరాబాదు]] వారిచే ముద్రింపచేసి గ్రంథకర్త గారి ప్రథమ కుమారుడు కీ.శే దిగవల్లి వెంకటరత్నంగారు (1936-2010) ఈ పుస్తకము మూడవ కూర్పు వెలువడించారు. గ్రంథకర్త గారి ప్రతి ముద్రితగ్రంధములోను చివర వారి అముద్రితగ్రంధముల జాబితాను జతపరిచారు. వాటిలో కథలు-గాధలు 5,6 భాగములు 400 పుటలు అని ఉంది. అంతేకాక, 1947 లోనే వెలువడిన నాలుగవ భాగము మొదటి కూర్పు చివరి పుటలో 5,6 భాగములుగా రావలసిన 38 వ్యాసముల జాబితా 1947 లోనే గ్రంథకర్త ప్రచురించారు. మొదటి నాలుగు భాగములు చదినిన చదువరులు అముద్రితము గాయున్న5,6 భాగములు కూడా విలువైనదని ప్రచురించమని కోరటం జరిగింది. గ్రంథకర్తగారి మూడవ కుమారుడు డా. దిగవల్లి రామచంద్ర ఆయా వ్యాస ప్రతులకోసము అన్వేషణ చేయగా 1947 తదుపరి అనేక చారిత్రక వ్యాసములు అనేక పత్రికలలో ప్రచురించినవి గూడా 5,6 భాగములుగా ప్రచురించతలచినారని గ్రంథకర్త చేతివ్రాత ప్రతులను బట్టి, వారు తయారుచేసిన మూడునాలుగు జాబితాలను బట్టి 2014 లో తెలుసుకుని ప్రయత్నించగా 114 వ్యాసములు లభించినవి. వాటిని 5,6 భాగములుగా
== ఇతివృత్తం ==
|