అచ్యుత దేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 43:
ఈయన పరిపాలనా కాలములో [[హంపి]]లోని తిరువేంగళనాధుని ఆలయము నిర్మించినాడు. ఈ ఆలయం అక్కడ కొలువై ఉన్న దేవుని పేరుమీదుగా కంటే ''అచ్యుతరాయ ఆలయము'' అన్న పేరుతోనే ప్రసిద్ధి చెందింది.
ఇప్పుడు [[కపిల తీర్ధము]]గా ప్రసిద్ధమైన [[
కృష్ణదేవరాయల లాగానే అచ్యుతరాయలు కూడా సాహిత్య పోషకుడు. ప్రతి సంవత్సరం ఒక గ్రంథం రాయించి తిరుపతి వెంకటేశ్వరునికి సమర్పించేవాడు<ref name=arudra237>ఆరుద్ర, పేజీ.237-238</ref>. అచ్యుతరాయలు స్వయంగా ''తాళమహోదధి'' అనే గ్రంథం సంస్కృతంలో రాశాడు. ఈయన ఆస్థానములో కన్నడ కవి [[చాటు విఠలనాధుడు]], ప్రముఖ సంగీతకారుడు [[పురందరదాసు]] మరియు సంస్కృత విద్వాంసుడు [[రెండవ రాజనాథ డిండిమభట్టు]] ఉండేవారు. డిండిమభట్టు ''అచ్యుతరాయాభ్యుదయము''తో పాటు సంస్కృతములో భాగవత చంపు వ్రాసి అచ్యుతరాయలకు అంకితమిచ్చాడు. ఈయన ఆస్థానములోని తెలుగు కవులలో [[రాధామాధవ కవి]] ముఖ్యుడు. ఈయన రచించిన ''తారకబ్రహ్మరాజీయము''ను అచ్యుతరాయల మంత్రి [[నంజ తిమ్మన]]కు అంకితం చేశాడు. కృష్ణరాయల సభ భువనవిజయములాగే, అచ్యుతరాయల సభను ''వెంకట విలాస మండపము'' అని పిలిచేవారు.
|