హైదరాబాదు మహానగరపాలక సంస్థ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు |
||
పంక్తి 33:
నిజాం ప్రభుత్వం 1869లో తొలిసారి మున్సిపాలిటీ వ్యవస్థను తీసుకొచ్చింది. హైదరాబాద్, ఛాదర్ఘాట్ను రెండు మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు.అప్పట్లో హైదరాబాద్లో నాలుగు, ఛాదర్ఘాట్లో ఐదు డివిజన్లు ఉండేవి.1886లో ఛాదర్ఘాట్ మున్సిపాలిటీ కార్పొరేషన్గా మార్పు చేశారు.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్ మున్సిపాలిటీలో 3.5లక్షల జనాభా మాత్రమే ఉండేవారు.1921లో హైదరాబాద్ 84చదరపు కిలోమీటర్లు విస్తరించింది. జనాభా కూడా అధిక శాతం పెరిగింది.ఈ నేపథ్యంలో 1933లో ఛాదర్ఘాట్ కార్పొరేషన్ను హైదరాబాద్ మున్సిపాలిటీలో కలిపి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్’ ఏర్పాటు చేశారు. 1934లో తొలిసారి ఈ కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహించారు.1937లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్ని కలిపి జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ ఏర్పాటు చేసి,1942లో హైదరాబాద్ మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదాను రద్దు చేశారు. ఆ తర్వాత 1945లో సికింద్రాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటైంది. అయితే 1950లో సికింద్రాబాద్కు కార్పొరేషన్ హోదా కల్పించడంతోపాటు జూబ్లీహిల్స్ మున్సిపాలిటీని హైదరాబాద్ మున్సిపాలిటీలో కలిపి తిరిగి కార్పొరేషన్ హోదా కల్పించారు.1955లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపాలిటీలను కలిపేసి ‘మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(ఎంసీహెచ్)’గా మార్చారు.
జీహెచ్ఎంసీగా..
|