== చరిత్ర ==
నిజాం ప్రభుత్వం 1869లో తొలిసారి మున్సిపాలిటీ వ్యవస్థను తీసుకొచ్చింది. హైదరాబాద్, ఛాదర్ఘాట్ను రెండు మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు.అప్పట్లో హైదరాబాద్లో నాలుగు, ఛాదర్ఘాట్లో ఐదు డివిజన్లు ఉండేవి.1886లో ఛాదర్ఘాట్ మున్సిపాలిటీ కార్పొరేషన్గా మార్పు చేశారు.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్ మున్సిపాలిటీలో 3.5లక్షల జనాభా మాత్రమే ఉండేవారు.1921లో హైదరాబాద్ 84చదరపు కిలోమీటర్లు విస్తరించింది. జనాభా కూడా అధిక శాతం పెరిగింది.ఈ నేపథ్యంలో 1933లో ఛాదర్ఘాట్ కార్పొరేషన్ను హైదరాబాద్ మున్సిపాలిటీలో కలిపి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్’ ఏర్పాటు చేశారు. 1934లో తొలిసారి ఈ కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహించారు.1937లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్ని కలిపి జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ ఏర్పాటు చేసి,1942లో హైదరాబాద్ మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదాను రద్దు చేశారు. ఆ తర్వాత 1945లో సికింద్రాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటైంది. అయితే 1950లో సికింద్రాబాద్కు కార్పొరేషన్ హోదా కల్పించడంతోపాటు జూబ్లీహిల్స్ మున్సిపాలిటీని హైదరాబాద్ మున్సిపాలిటీలో కలిపి తిరిగి కార్పొరేషన్ హోదా కల్పించారు.1955లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపాలిటీలను కలిపేసి ‘మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(ఎంసీహెచ్)’గా మార్చారు. ▼
[[1869]]లో హైదరాబాద్ మున్సిపల్ బోర్డు, ఛాదర్ ఘాట్ మున్సిపల్ బోర్డు ఏర్పాటుతో [[హైదరాబాద్]] నగరంలో మున్సిపల్ పరిపాలన ప్రారంభమైంది. [[హైదరాబాద్]] నగరాన్ని నాలుగు భాగాలుగా, ఛాదర్ ఘాట్ శివారును ఐదు భాగాలుగా విభజించారు. [[హైదరాబాద్]] నగరం, శివార్లు మొత్తం నగర పోలీస్ కమిషనర్, బల్దియా కొత్వాల్ ఆధీనంలో ఉంటాయి.<ref name="ghmc.gov.in">[http://www.ghmc.gov.in/]</ref>
▲నిజాం ప్రభుత్వం 1869లో తొలిసారి మున్సిపాలిటీ వ్యవస్థను తీసుకొచ్చింది. హైదరాబాద్, ఛాదర్ఘాట్ను రెండు మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు.అప్పట్లో హైదరాబాద్లో నాలుగు, ఛాదర్ఘాట్లో ఐదు డివిజన్లు ఉండేవి.1886లో ఛాదర్ఘాట్ మున్సిపాలిటీ కార్పొరేషన్గా మార్పు చేశారు.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్ మున్సిపాలిటీలో 3.5లక్షల జనాభా మాత్రమే ఉండేవారు.1921లో హైదరాబాద్ 84చదరపు కిలోమీటర్లు విస్తరించింది. జనాభా కూడా అధిక శాతం పెరిగింది.ఈ నేపథ్యంలో 1933లో ఛాదర్ఘాట్ కార్పొరేషన్ను హైదరాబాద్ మున్సిపాలిటీలో కలిపి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్’ ఏర్పాటు చేశారు. 1934లో తొలిసారి ఈ కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహించారు.1937లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్ని కలిపి జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ ఏర్పాటు చేసి,1942లో హైదరాబాద్ మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదాను రద్దు చేశారు. ఆ తర్వాత 1945లో సికింద్రాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటైంది. అయితే 1950లో సికింద్రాబాద్కు కార్పొరేషన్ హోదా కల్పించడంతోపాటు జూబ్లీహిల్స్ మున్సిపాలిటీని హైదరాబాద్ మున్సిపాలిటీలో కలిపి తిరిగి కార్పొరేషన్ హోదా కల్పించారు.1955లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపాలిటీలను కలిపేసి ‘మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(ఎంసీహెచ్)’గా మార్చారు.
జీహెచ్ఎంసీగా..
హైదరాబాద్ చుట్టుపక్కల.. రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో ఉన్న 12 మున్సిపాలిటీలు(ఎల్బీనగర్, గడ్డి అన్నారం, ఉప్పల్, మల్కాజ్గిరి, కాప్రా, అల్వాల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, రామచంద్రాపురం, పటాన్చెరు), 8 పంచాయతీలు (శంషాబాద్, సాతమరాయ్, జల్లాపల్లి, మామిడిపల్లి, మంఖల్, అల్మాస్గూడ, శారదానగర్, రావిలాల) కలుపుకొని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ కాస్త గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)గా రూపాంతరం చెందింది. 2005లోనే గ్రేటర్హైదరాబాద్ కోసం అప్పటి ప్రభుత్వం జీవో ఇవ్వగా.. కొన్ని న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. వాటిని ఎదుర్కొని 2007 ఏప్రిల్ 16న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవిర్భవించింది. 175చ.కి.మీ విస్తీర్ణంలో 45లక్షల జనాభా ఉన్న ఎంసీహెచ్.. గ్రేటర్హైదరాబాద్గా మారడంతో విస్తీర్ణం 650చ.కి.మీకు పెరిగింది. జనాభా 2007నాటికి 67లక్షలు ఉండగా.. ప్రస్తుతం కోటి దాటింది.
జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులు ఉన్నాయి. మేయర్లుగా 2002-07లో తీగల కృష్ణారెడ్డి, 2009-12లో బండ కార్తీకరెడ్డి, 2012-16లో మహ్మద్ మాజిద్ హుస్సేన్ ఉన్నారు. 2014లో తెలంగాణ వచ్చింది. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) ఘన విజయం సాధించడంతో ఆ పార్టీకి చెందిన చర్లపల్లి కార్పొరేటర్ బొంతు రామ్మోహన్ మేయర్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కార్పొరేషన్ పాలక మండలి మరో మూడు నెలల్లో ముగియనుండగా.. తాజాగా ఎన్నికల నగారా మోగింది. తెరాస, భాజపా, ఎంఐఎం పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండనుంది. మరి జీహెచ్ఎంసీలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.
== ఎగ్జిక్యూటివ్ ==
|