గొట్టిపాడు (ప్రత్తిపాడు): కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న మార్పులు
ట్యాగు: 2017 source edit
పంక్తి 99:
=== ప్రత్తిపాడు మండలం ===
ప్రత్తిపాడు మండలంలోని [[ఎనమదల (ప్రత్తిపాడు)|యనమదల]], [[ఏదులపాలెం]], [[కొండెపాడు|కొండపాడు]], గొట్టిపాడు, [[కొండజాగర్లమూడి]], [[గనికపూడి|గణికెపూడి]], [[నడింపాలెం (ప్రత్తిపాడు)|నడింపాలెం]], [[ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా)|ప్రత్తిపాడు]], [[మల్లాయపాలెం(ప్రత్తిపాడు మండలం)|మల్లయ్యపాలెం]] గ్రామాలున్నాయి.
 
==గ్రామ భౌగోళికం==
===సమీప మండలాలు===
Line 113 ⟶ 114:
 
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
#జిల్లాలోనే ఈ పాఠశాలకు ప్రత్యేకత ఉంది. వైజ్ఞానిక, వ్యవసాయ, వ్యాపార, వృత్తి పరమైన విద్యను అందించాలనే సంకల్పంతో, 14 మంది పెద్దలు కలిసి ఒక సంఘంగా ఏర్పడి, 1965,ఫిబ్రవరి-14న పాఠశాల నిర్మాణనికి తీర్మానం చేసి ఆమోదం తెలియజేసినారు. అప్పట్లో గ్రామ శివారులో ఉన్న పోరంబోకు 4.93 ఎకరాల స్థలంలో. 1965,ఫిబ్రవరి-25న ప్రత్తిపాడు పంచాయతీ సమితి అధ్యక్ష్లు శ్రీ గుంటుపల్లి సూర్యనారాయణతో శంఖ్స్థాపన చేయించారు. గ్రామస్థులు స్వయంగ ఎద్దులబండ్లు కట్టుకుని, బోయపాలెం వెళ్ళి, రాళ్ళు, దిమ్మెలు తీసికొనివచ్చి, పాఠశాల భవన నిర్మాణానికి భాగస్వాములైనారు. ఈ పాఠశాలలో ఇప్పటి వరకు, గొట్టిపాడు, గనికపూడి, ఉన్నవ, తుమ్మలపాలెం గ్రామాలకు చెందిన 5407 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. 17 మంది ప్రధానోపాధ్యాయులుగా పనిచేసారు. ప్రస్తుతం శ్రీమతి అనూరాధ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మొదటి సంవత్సరం 25 మంది విద్యర్ధులు చదువుకోగ అందరూ ఉత్తీర్ణులైనారు. నాటి నుండి ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ పాఠశాల పూర్వవిద్యార్థులలో ఎక్కువ మంది ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్., వైద్య, విద్యా, వ్యాపార రంగాలలో, ఉన్నతస్థాయిలో ఉన్నారు. ఈ పాఠశాల స్వర్ణోత్సవాలు, 2016,జనవరి-13,14 తేదీలలో నిర్వహించెదరు. [14]&[15]
#ఈ పాఠశాలలో 1967-68 సంవత్సరంలో విద్యనభ్యసించిన మొదటి సంవత్సరం పూర్వ విద్యార్థులు, పాఠశాల స్చర్ణోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో, 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఒక ఆడిటోరియం నిర్మించుచున్నారు. [12]
#ఈ [[పాఠశాల]] పూర్వవిద్యార్థి అయిన శ్రీ అంచా అయ్యేశ్వరరావు, ప్రస్తుతం కేంద్రప్రభుత్వ సర్వీసులో సీనియర్ ఐ.యే.ఎస్.అధికారిగా పనిచేస్తున్నారు. [14]
===మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల===
ఆది ఆంధ్రా కాలనీ.
 
== వైద్య సౌకర్యం ==
 
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
గొట్టిపాడులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.
సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
దాతల సహకారంతో, 70 లక్షల రూపాయల వ్యయంతో, గొట్టిపాడు వాసులకు ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం ఏర్పడింది. ఈ భవనానికి కావలసిన 5 సెంట్ల స్థలాన్ని శ్రీ గుంటుపల్లి నాగేశ్వరరావు, వారి అత్తా మామలైన శ్రీ మండేపూడి వీరయ్య, రామతులశమ్మల ఙాపకార్ధం, విరాళంగా ఇచ్చారు. ప్రభుత్వ సహకారంతొ భవన నిర్మాణం పూర్తయి, ప్రారంభోత్సవం కోసం ఎదురుచూస్తున్నది. ఈ ఆసుపత్రికి కావలసిన 6 మంచాలు, పరుపులు, ఇ.సి.జి.యంత్ర పరికరాలు, ఫర్నిచర్ మొదలగునవి గూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ కేంద్రం ప్రారంభమయినచో చుట్టుప్రక్కల గ్రామాలయిన [[గనికపూడి]], [[కొప్పర్రు]], [[ఉన్నవ]], కారుచోల మొదలగు గ్రామాల ప్రజలకు గూడా వైద్యసౌకర్యం అందుబాటులోనికి వస్తుంది.
 
=== ప్రైవేటు వైద్య సౌకర్యం ===
Line 167 ⟶ 161:
[[ప్రత్తి]], [[మిరప]]
 
==గ్రామ పంచాయతీ==
#ఈ గ్రామ పంచాయతీకి 1955 లో తొలిసారి ఎన్నికలు జరిగినప్పుడు, గ్రామస్థులు చేతులెత్తటం ద్వారా అప్పటికి గ్రామంలో మూడు వందల ఎకరాల పంటపొలాలతో గ్రామంలో దానశీలిగా ఉన్న శ్రీ గుంటుపల్లి సూర్యనారాయణను సర్పంచిగా ఎన్నుకున్నారు. 1964లో ఆయన ప్రత్తిపాడు సమితి అధ్యక్షులుగా ఎన్నికవగా, సర్పంచి పదవికి రాజీనామా చేశారు. 1964 లో ఆయన తరువాత ఆయన తమ్ముడు శ్రీ గుంటుపల్లి వెంకటాప్పారావును సర్పంచిగా ఎన్నుకున్నారు. గుంటుపల్లి సూర్యనారాయణ 1962 నుండి 1967 వరకూ, 5 సం. పెదకాకాని శ్రీ భ్రమరాంబాసమేత మల్లేశ్వరస్వామి దేవస్థానానికి అధ్యక్సులుగా వ్యవహరించారు. 1969 నుండి 1972 దాకా అప్పారావు సర్పంచిగా చేశారు. అప్పారావు 1981 లో ప్రత్తిపాడు సమితి అధ్యక్షునిగా, 1993లో గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మనుగా నియమితులయ్యారు. 1981 లో అప్పారావు సోదరుడు జానకిరామయ్య, గొట్టిపాడు సర్పంచిగా, 1987 లో మండలాధ్యక్షుడిగా విజయం సాధించారు. 1989 లో జానకిరామయ్య సోదరుడు నాగేశ్వరరావును గ్రామ సర్పంచిగా ఎన్నుకున్నారు. 1996లో పిల్లి లాజరు, 2001 లో జొన్నలగడ్డ దయారత్నం, 2006 లో గుంటుపల్లి వెంకటసుబ్బమ్మ ఈ గ్రామానికి సర్పంచులుగా ఎన్నికైనారు. గుంటుపల్లి సూర్యనారాయణ కుటుంబసభ్యులు పేదలకు సహాయసహకారాలు అందించడం ద్వారా పేరు పొందారు. వీరికి ఉన్న 300 ఎకరాల పొలంలో 275 ఎకరాలు దానధర్మాలకూ, గ్రామంలో అభివృద్ధి పనులకూ, ఖర్చు చేశారు. వీరి పాలనలో మంచినీటి పథకం, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, పశువైద్యశాల, 5 ప్రాథమిక పాఠశాలలూ, పంచాయతీ భవనం నిర్మించారు. ఇంకా మంచినీటి చెరువులో పూడికతీత, బోయపాలెం, అబ్బినేనిగుంటపాలెం, ప్రత్తిపాడు రహదారులు, విద్యుద్దీకరణ, ప్రత్తిపాడులో సమితి కార్యాలయభవన నిర్మాణం చేశారు. [3]
#గొట్టిపాడు పంచాయతీ 1955 లో ఏర్పడినప్పటి నుండి 51 సంవత్సరాలపాటు సర్పంచి పదవిని పురుషులే ఏలారు. తొలిసారి 2006 ఆగస్టులో జరిగిన పంచాయతీ ఎన్నికలలో మహిళలకు రిజర్వు అవగా, గ్రామానికి చెందిన గుంటుపల్లి వెంకటసుబ్బమ్మ సర్పంచి పదవికి పోటీచేసి గెలుపొందారు. వీరు రోజూ గ్రామంలో పర్యటించి, సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పంచాయతీ సమావేశంలో సూచనలు చేసేవారు. మండల కార్యాలయాలలో జరిగే సమావేశాలకు హాజరై పట్టుబట్టి నిధులు విడుదల చేయించేవారు. గ్రామంలోని 3,600 జనాభాలో ఎక్కువ మంది పేదలు. వీరు ఈ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయించటానికి రు.30 లక్షల విలువైన తన స్వంత స్థలం, 30 సెంట్లను వితరణ చేశారు. స్వంత నిధులతో శుద్ధజలకేంద్రం, గ్రామం అంతటికీ సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. కళ్యణ మంటప నిర్మాణానికి భారీ విరాళం అందజేసి గ్రామస్తులకు అండగా నిలిచారు. స్థానిక పాఠశాలలో ఉత్తమ విద్యార్థులకు నగదుబహుమతులు అందజేశారు. రక్షిత నీటి పథకం కోసం రు.30 లక్షలతో బాపన్నకుంట నుండి మంచినీటి పైపులైను ఏర్పాటు చేయించారు. గ్రామంలో సిమెంట్ రహదారులూ, రెండు సామాజిక సమావేశ మందిరాలనూ నిర్మించారు. [4]
#2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ గుంటుపల్లి బాబూరావు, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [7]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
===శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి దేవాలయం===
#ఈ [[దేవాలయం]]లో, ప్రతి సంవత్సరం, [[శ్రీరామనవమి]] సందర్భంగా, శ్రీ సీతారాముల కళ్యాణం, వైభవంగా నిర్వహించెదరు. [10]
 
===శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి దేవాలయం===
ఈ దేవాలయంలో [[వైకుంఠఏకాదశి]] సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ దేవాలయంలో [[మహాశివరాత్రి]] సందర్భంగా, స్వామివారికి, పంచామృత ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేయుదురు. [8]&[9]
 
===శ్రీ విఘ్నేశ్వరస్వామివారి ఆలయం===
#స్థానిక శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయం ఎదురుగా, మంచినీటి చెరువు కట్ట వద్ద ఉన్న ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు గ్రామస్తులంతా కలిసి 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టినారు. [13]
#నూతనంగా పునర్నిర్మించిన ఈ ఆలయంలో, పునఃప్రతిష్ఠా మహోత్సవాలు 2016,ఫిబ్రవరి-26వ తేదీ శుక్రవారంనాడు ప్రారంభమైనవి. ఉదయం విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, సాయంత్రం [[అగ్ని]] ప్రతిష్ఠ, శాంతికుంభస్థాపన, శాంతిహోమం నిర్వహించారు. 27వ తేదీ శనివారం విశేషపూజలు నిర్వహించి 28వ తేదీ ఆదివారం ఉదయం 7-29 కి శ్రీ విఘ్నేశ్వరస్వామివారి విగ్రహప్రతిష్ఠా మహోత్సవం [[వైభవం]]గా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తూలకు భారీగా అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [16]
 
#ఈ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా, 2017,ఫిబ్రవరి 26వతేదీ ఆదివారంనాడు, స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు ఈ గ్రామం నుండియేగాక, చుట్టుప్రక్కల గ్రామాలయిన [[గనికపూడి]], ప్రతిపాడు గ్రామాలనుండి గూడా అధికసంఖ్యలో విచ్చేసారు. ఈ సందర్భంగా [[భక్తులు|భక్తుల]]కు అన్నసమారాధన నిర్వహించారు. [17]
 
===శ్రీ లక్ష్మీతిరుపతమ్మ అమ్మవారి ఆలయం===
స్థానిక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఎదురుగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి [[సంవత్సరము|సంవత్సరం]] మాఘశుద్ధపౌర్ణమికి అమ్మవారి కళ్యాణం [[వైభవం]]గా నిర్వహించెదరు. [15]
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు
 
==గ్రామ ప్రముఖులు==
===శ్రీ గుంటుపల్లి వెంకటేశ్వరరావు===
ప్రముఖ సోషలిస్టు నేత, భారత్ సేవక్ సమాజ్ మాజీ రాష్ట్ర అధ్యక్ష్లులు. వీరు 2020,నవంబరు-29న అనారోగ్యంతో, గుంటూరులోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాలధర్మం చెందినారు. [1]
 
==గ్రామ విశేషాలు==
వ్యవసాయం:- ఈ గ్రామ రైతు శ్రీ కాటా సాంబశివరావు, ఆధునిక వ్యవసాయానికి పెట్టింది పేరు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించి, తోటిరైతులను ఆశ్చర్యపరచేచారు. ఆయన సేవలకు మెచ్చి కేంద్రప్రభుత్వం 2011లో బాబూ జగజ్జీవనరాం పురస్కారం ప్రకటించింది. నాటి వ్యవసాయమంత్రి శ్రీ శరద్ పవార్ చేతులమీదుగా రు.50,00 నగదు, ప్రశంసాపత్రం అందుకున్నారు. 2006లో డిల్లీ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున అఖిలభారత ఉత్తమరైతు పురస్కారాన్నీ, 2013లో [[హైదరాబాదు]]లో [[తమిళనాడు]] గవర్నరు శ్రీ కొణిజేటి రోశయ్య గారి చేతులమీదుగా "రైతుబంధు" పురస్కారాన్నీ స్వీకరించారు. అంతరపంటల సాగులో చూపిన ప్రతిభకు 1997లో అప్పటి [[ముఖ్యమంత్రి]] శ్రీ [[నారా చంద్రబాబునాయుడు]], గుంటూరు లోని [[లాం]] ఫాంలో ఉత్తమ రైతు పురస్కారం అందించి అభినందించారు. వీరు స్వగ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేశారు. 80 ఏళ్ళ వయసులోనూ ఆయన పొలాలకు వెళ్ళి, తోటి రైతులకు తక్కువ ఖర్చుతో అధిక దిగిబడులు సాధించేలాగా, వినూత్న సలహాలు ఇస్తుంటారు. ఆయన సూచనలను పాటించిన పలువురు రైతులు, తమ భూములలో సిరులు పండించారు. (5)
 
ఈ గ్రామానికి చెందిన గుంటుపల్లి బాబూరావు అను ప్రకృతి ప్రేమికుడు, 3 దశాబ్దాలుగా వివిధ రకాల మొక్కలు పెంచుతూ, తన ఇంటి ప్రాంగణాన్ని నందనవనంగా మార్చడమే గాకుండా, జీవకోటికి అవసరమైన [[ప్రాణవాయువు]]ను అందించడానికి తనవంతు కృషి చేస్తున్నారు. [7]
 
==గణాంకాలు==
Line 208 ⟶ 193:
:
==మూలాలు==
<references />
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు గుంటూరు జిల్లా;2020,నవంబరు-30,3వపేజీ.
{{ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు}}