బభ్రువాహనుడు: కూర్పుల మధ్య తేడాలు

పేజీ సృష్టించాను
(తేడా లేదు)

20:26, 31 మే 2008 నాటి కూర్పు

బభృవాహనుడు అర్జునుడు చిత్రాంగదలకు కలిగిన కుమారుడు.

అర్జునుడు అరణ్యవాసం చేయు సమయమున మణిపురపు రాకుమారి చిత్రాంగదను చూచి వలచాడు. చిత్రాంగద తండ్రికి ఆమె ఒక్కతే సంతానం. చిత్రాంగద తండ్రి చిత్రాంగదకు కలిగే సంతానము మణిపురములోనే ఉండి రాజ్యమును పరిపాలించవలెను అని పెట్టిన షరతుకు అంగీకరించి అర్జునుడు చిత్రాంగదను వివాహము చేసికొన్నాడు. బభృవాహనుడు తన తాత తదనంతరం మణిపురమును పాలించాడు.

కురుక్షేత్ర సంగ్రామం తరువాత యధిష్టురుడు చేసిన అశ్వమేధ యాగంలో భాగంగా అర్జునుడు మణిపురము వచ్చినప్పుడు బభృవాహనుడు అర్జునునితో యుద్దము చేసి తన బాణముతో అర్జునుని చంపాడు. తను చేసిన తప్పుకు బభృవాహనుడు తనను తాను చంపుకొన తలచాడు. కాని తన సవతి తల్లి అయిన నాగు రాకుమారి ఉలూపి ఇచ్చిన మణితో అర్జునుని తిరిగి బ్రతికించాడు. ఈ సంఘటన అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముని (ఒక వసు అవతారం) చంపుట వల్ల వసులు ఇచ్చిన శాపం మూలంగా జరిగింది.


చూడండి