వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విలీన ప్రయత్నం
పంక్తి 1:
{{మొలక}}
'''వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు''' [[గుంటూరు]] ప్రాంతమును పరిపాలించిన రాజు. ఈయన[[అమరావతి]] సంస్థాన పాలకుడు. జననం-[[17541761]], మరణం-[[1817ఏప్రిల్ 20]]న జగ్గన్న, అచ్చమ్మ దంపతులకు జన్మించాడు.
 
క్రీస్తుశకము 1413 నుండి తీరాంధ్రదేశములోని ఒక భాగమును పాలించిన వాసిరెడ్డి వంశమునకు చెందినవాడు వేంకటాద్రి నాయుడు. క్రిష్ణా మండలములోని చింతపల్లి వీరి రాజధాని. వాసిరెడ్డి వంశము వారు తొలుత స్వతంత్రులైనను పిమ్మట గొల్లకొండ నవాబులకు తదుపరి బ్రిటిషు వారికి సామంతులుగ వుండిరి. వేంకటాద్రి రాజధానిని క్రిష్ణానది ఆవల ఒడ్డుననున్న గుంటూరు మండలములోని అమరావతి/ధరణికోట కు మార్చినాడు. వేంకటాద్రి గొప్ప కవి పండితపోషకుడు. వెంకటాద్రి మంచి పరిపాలనాదక్షుడు. పిండారీ దండులను ఎదుర్కొని ఆ ప్రాంతములలో అడుగు పెట్టనివ్వని మొనగాడు. క్రిష్ణా డెల్టా ప్రాంతమందు పెక్కు దేవాలయములు కట్టించెను. వీటిలో అమరావతి, చేబ్రోలు, పొన్నూరు, మంగళగిరి ముఖ్యమైనవి.
 
వేంకటాద్రి పాలనలో చెంచులు దారిదోపిడులు చేయుచు సామాన్యప్రజలను బాధించుచుండిరి. మాంత్రి పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించెను. భోజనమైన పిమ్మట చెంచులను వరుసగా నిలబెట్టి అందరిని వధింపచేసెను. ఈ వధ జరిగిన ఊరి పేరు నరుకుళ్ళపాడు గా మారెను. పిమ్మట బహుపశ్చాత్తాపముచెంది శేషజీవితమును అమరేశ్వరునిపాదాలకడ గడిపినాడు. దేవాలయానికి పెక్కు హంగులు చేసి తొమ్మిదిమంది అర్చకులను నియమించి ఒక్కొక్కరికి 12 ఎకరాలు భూమి ఇచ్చడు. గుంటూరి మండలములోని పలు పల్లెలందు గుడులు కట్టించాడు.
 
ఆయన పాలనా కాలంలో [[చెంచులు]] గ్రామాలపైబడి దోచుకుంటూ ఉండేవారు. ఈ దోపిడీలను అరికట్టడానికి ఆయన 150 మంది చెంచు నాయకులను ఆహ్వానించి, వారిని మట్టుపెట్టించాడు. ఈ సంఘటన జరిగిన గ్రామం పేరు [[నరుకుళ్ళపాడు]] గా మారింది. దానితో ప్రజలకు దోపిడీల బెడద తగ్గినా, ఆయన అశాంతికిలోనై, పాప పరిహారార్ధం దేవాలయాల నిర్మాణం చెయ్యమన్న కొందరు పెద్దల సూచన మేరకు అనేక దేవాలయాలను కట్టించాడు. అమరావతి లోని అమరలింగేశ్వరస్వామి గుడిని పునరుద్ధరించాడు. 1807-09లో [[మంగళగిరి]] నరసింహ స్వామి దేవాలయానికి 11 అంతస్థుల గాలి గోపురాన్ని నిర్మింపజేసాడు. ఆయన తండ్రి జగ్గన్న పేరు మీదనే '''బేతవోలు''' అనే గ్రామం పేరును [[జగ్గయ్యపేట]] గా మార్చాడు. వేంకటాద్రి నాయుడు [[1817]], ఆగష్టు 17న మరణించాడు.
 
==వనరులు==
 
* శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు (''[http://www.openlibrary.org/details/rajavasireddyven022548mbp Sri Raja Vasireddy Venkadadri Nayudu]'' by K. Lakshminarayana 1963, Ponnuru.)
 
* http://www.vasireddy.us/history.asp
 
[[వర్గం:17541761 జననాలు]]
[[వర్గం:1817 మరణాలు]]
[[వర్గం:సంస్థానాధీశులు]]
[[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:జమీందారులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]