రాధికాభాయి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1 |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి వర్గం:1745 births ను తీసివేసారు; వర్గం:1745 జననాలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 15:
1778 లో కుంభమేల సమయంలో రాధికాబాయి తీర్థయాత్రగా నాసికు వచ్చింది. అధికార పదవిని వదిలి నైరాశ్యంగా నాసికులో నివసిస్తున్న గోపికబాయి పవిత్ర నగరమైన నాసికుకు చేరిన సర్దార్ల వాడల ముందు యాచించి జీవితం కొనసాగిస్తూ ఉండేది. గోపికాబాయి సేవకుల నుండి భిక్ష తీసుకోదు వారి కానీ తల్లులు, భార్యలు లేదా ఉన్నత స్థాయి సర్దార్ల కుమార్తెల నుండి మాత్రమే నైవేద్యాలను సేకరిస్తుందని వ్రాతపూర్వ ఆధారాలు పేర్కొన్నాయి; ఆమె భిక్షయాచించే సమయంలో తనతో పాటు ఉన్న ఆవుకు కట్టిన గంటను మోగిస్తుంది. హిందూ మాసం అయిన పుష్యమాసంలో 1778 లో గోపికబాయి తనకు తెలియకుండానే భిక్ష కోరుతూ సర్దారు గుప్తే ఇంటికి వెళ్ళింది. ఆమె ఆవు గంట మోగిస్తూ కొంతసేపు వేచి ఉంది. తన తండ్రి నివాసంలో ఉంటున్న రాధికాబాయి, నైవేద్యంతో బయటకు వచ్చి, గోపికాబాయి భిక్షాటన కోరడం చూసి ఆశ్చర్యానికి గురైంది. అప్పుడే గోపికాబాయి తలెత్తి భిక్ష ఇస్తున్నవారిని చూడగానే ఇద్దరు మహిళల కళ్ళు కలిశాయి. తన కుమారుడు విశ్వాసరావు మరణానికి కారణమని రాధికాబాయిని ఎప్పుడూ నిందించిన గోపికబాయి, కోపంతో విరుచుకుపడి, ఆమె చెడ్డ శకునమని రాధికాబాయి మీద కేకలు వేయడం ప్రారంభించింది. గోపికాబాయి అనారోగ్యానికి ప్రధాన కారణమై ఇలాంటి అవమానాలను భరించడానికి కారణమైన రాధికాభాయిని దేవుడు ఆమెను ఎందుకు సజీవంగా ఉంచాడని నిందించింది. గోపికబాయి మిగిలిన నెలలో ఉపవాసం ఉండి బలహీనమై అనారోగ్యంతో నిర్జలీకరణానికి గురై చివరికి మరణించింది. రాధికాబాయి గోపికాబాయికి చివరి కర్మలు చేసి నాసికు లోని గోదావరి నది ఒడ్డున డీప్మాలా (దీపగోపురాన్ని) ను నిర్మించింది. 1961 వరదల సమయంలో ఈ డీప్మాలా కొట్టుకుపోయింది. మిగిలిన పునాదిమీద ప్రస్తుతం ప్రజలు తమ బంధువుల చివరి కర్మలు చేసేటప్పుడు చమురు దీపాలను ఉంచుతున్నారు.
== వెలుపలి లింకులు ==
[[
[[Category:1798 deaths]]
[[Category:Deaths from influenza]]
|