బభ్రువాహనుడు: కూర్పుల మధ్య తేడాలు

సరి చేసాను
సరి చేసాను
పంక్తి 3:
[[అర్జునుడు]] అరణ్యవాసం చేయు సమయమున మణిపురపు రాకుమారి [[చిత్రాంగద]]ను చూచి వలచాడు. [[చిత్రాంగద]] తండ్రి అయిన [[చిత్రవాహనుడు|చిత్రవాహనునికి]] ఆమె ఒక్కతే సంతానం. [[చిత్రవాహనుడు]] [[చిత్రాంగద]]కు కలిగే సంతానము మణిపురములోనే ఉండి రాజ్యమును పరిపాలించవలెను అని పెట్టిన షరతుకు అంగీకరించి [[అర్జునుడు]] [[చిత్రాంగద]]ను వివాహము చేసికొన్నాడు. బభృవాహనుడు తన తాత తదనంతరం మణిపురమును పాలించాడు.
 
[[కురుక్షేత్ర సంగ్రామం]] తరువాత [[యధిష్టురుడు]] చేసిన అశ్వమేధ యాగంలో భాగంగా [[అర్జునుడు]] మణిపురము వచ్చినప్పుడు బభృవాహనుడు [[అర్జునునికి]] ఎదురేగి పాదాభివందనము చేసినాడు. [[అర్జునుడు|అర్జునునికి]] తన కుమారుడు వీరుని వలే ఎదిరించకుండా లొంగిపోవుట నచ్చక "వీరపుత్రులు యుద్ధమునకు వెనుకాడరు" అని పల్కాడు. బభృవాహనుడు తన తండ్రి మాటలకు కుంగిపోయి తన రాజధానికి చేరాడు. ఆ విషయము తెలిలుసుకొన్న [[అర్జునుడు|అర్జునుని]] భార్య అయిన [[కౌరవ్యుడు]] కుమార్తె [[ఉలూచి]] బభృవాహనుడు వద్దకు వచ్చి యుద్ధము చేసి తండ్రిని సంతోషపెట్టమని చెప్పింది. అంతట సకల సైన్యముతో బభృవాహనుడు [[అర్జునుడు|అర్జునుని]]పై దండెత్తాడు. ఆ యుద్ధములో [[అర్జునుడు|అర్జునుని]] బాణమునకు బభృవాహనుడు మూర్చపోయినాడు. కాని బభృవాహనుడు మూర్చపోక ముందు ప్రయోగించిన బాణము [[అర్జునుడు|అర్జునుని]] రొమ్ములో గ్రుచ్చుకుని ప్రాణం [[అర్జునుడు|అర్జునుని]] తీసింది. ఈ విషమువిషయము తెలిసి [[చిత్రాంగద]] మరియు [[ఉలూచి]] రణరంగమునకు వచ్చారు. అంతలో బభృవాహనుడు మూర్చనుంచి తేరుకుని లేచి తండ్రి మరణించాడని తెలుసుకుని హతాశుడై [[ఉలూచి]]ని దుర్భాషలాడి, ప్రాయోపవేశము చేసి ప్రాణాలు విడుచుటకు సిద్దమయ్యాడు. అప్పుడు [[ఉలూచి]] బభృవాహనునికి సంజీవనిమణిని ఇచ్చి [[అర్జునుడు|అర్జునుని]] గుండెలపై ఉంచమని చెప్పింది. [[అర్జునుడు]] తిరిగి బ్రతికాడు. [[ఉలూచి]] వారికి [[కురుక్షేత్ర సంగ్రామం]]లో [[అర్జునుడు]] [[భీష్ముడు|భీష్ముని]] (ఎనిమిదవ వసువు అవతారం) చంపుట వల్ల [[వసువులు]] ఇచ్చిన [[అర్జునునికి_వసువుల_శాపం|శాపం]] గురించి వివరించింది.
 
[[వర్గం:మహాభారతం]]
"https://te.wikipedia.org/wiki/బభ్రువాహనుడు" నుండి వెలికితీశారు