ఉత్తర కుమారుడు: కూర్పుల మధ్య తేడాలు

చి సరి చేసాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
[[పాండవులు]] తమ అజ్ఞాతవాసం [[విరాటుడు|విరాటుని]] కొలువులో చేసారు. ఒకసారి [[పాండవులు|పాండవుల]] అజ్ఞాతవాసం భంగము చేయుటకు [[ధుర్యోధనుడు|ధుర్యోధనాది]] [[కౌరవులు]] విరాట రాజ్యముపై ఇరువైపులా దండెత్తారు. అందరు వీరులు ఒకవైపు దండెత్తిన కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనుటకు వెళ్లారు. రెండవ వైపు నుంచి వస్తున్న కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనుటకు వీరులు ఎవరూ లేని సమయమున ఉత్తరుడు తాను ఒక్కడినే ఎదుర్కొనగలనని ప్రగల్భాలు పలికి [[అర్జునుడు|అర్జునుని]] రధసారధిగా కౌరవ సేనపై దండెత్తెను. ఆ యుద్ధములో భయపడుతున్న ఉత్తరుని రధసారధ్యం చేయమని చెప్పి [[అర్జునుడు]] కౌరవ సైన్యాన్ని ఓడించాడు. ఈ యుద్ధమందు [[అర్జునుడు]] ప్రయోగించిన [[సమ్మోహనాస్త్రం]] వల్ల [[ధుర్యోధనుడు]], [[కర్ణుడు]], [[భీష్ముడు]] మొదలగువారు ఉన్న మొత్తం కౌరవ సేన కొంతసేపు స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు ఉత్తరుడు కౌరవ వీరుల తలపాగాలు కత్తిరించి తెచ్చి [[ఉత్తర]]కు ఇచ్చాడు.
 
ఇతని కూతురు [[ఇరావతి]]ని [[పరీక్షిత్తు]] నకు వివాహము చేసెను.
 
[[కురుక్షేత్ర సంగ్రామం]]లో ఉత్తరుడు [[పాండవులు|పాండవుల]] పక్షాన యుద్ధం చేసి మొదటి రోజే [[శల్యుడు|శల్యుని]] చేతిలో మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_కుమారుడు" నుండి వెలికితీశారు