ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు: కూర్పుల మధ్య తేడాలు

→‎పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం: భాషా సవరణలు, ఫోటోల అమరిక మార్పు
+మూలాలు
పంక్తి 1:
ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం [[బ్రిటిషు]] పరిపాలనా కాలంలో, ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ బ్రిటిషు పాలనలో [[మద్రాసు ప్రెసిడెన్సీలోప్రెసిడెన్సీ]]<nowiki/>లో భాగంగా ఉండేది. తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నిటినీ ప్రెసిడెన్సీ నుండి విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని కోరుతూ తెలుగువారు ఉద్యమించారు. [[పొట్టి శ్రీరాములు]] ఆమరణ దీక్షతో ఉచ్ఛస్థాయికి చేరిన ఈ ఉద్యమం ఆయన మరణం తర్వాతనే సఫలీకృతమైంది. 1953 అక్టోబరు 1 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.[[దస్త్రం:PoTTiSrIraamulu.jpg|right|thumb|రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన [[పొట్టి శ్రీరాములు]]]]
==నేపథ్యం==
 
మద్రాసు ప్రెసిడెన్సీలో [[శ్రీకాకుళం]], [[విశాఖపట్నం]], [[తూర్పు గోదావరి]], [[పశ్చిమ గోదావరి]], [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు]], [[నెల్లూరు]], [[చిత్తూరు]], [[అనంతపురం]], [[కడప]], [[కర్నూలు]] జిల్లాలుండేవి (విజయనగరం, ప్రకాశం జిల్లాలు ఆ తరువాత ఏర్పడ్డాయి). ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది. జనాభాలోను, విస్తీర్ణంలోను ఆంధ్ర ప్రాంతమే హెచ్చుగా ఉన్నప్పటికీ, పరిపాలనలోను, ఆర్థిక వ్యవస్థలోనూ తమిళుల ఆధిపత్యం సాగేది. సహజంగానే, ఆంధ్రులలో అభద్రతా భావం కలిగింది. తమకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే, రాజకీయంగాను, ఆర్థికంగానూ గుర్తింపు లభిస్తుందని వారు ఆశించారు. తెలుగు మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం – '''విశాలాంధ్ర''' - కావాలనే కోరిక తలెత్తి క్రమంగా బలపడసాగింది.
 
==అంకురార్పణ==
పంక్తి 8:
మొట్టమొదటి సారిగా ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన అధికారికంగా [[1912]] మేలో [[నిడదవోలు]]లో జరిగిన గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా నాయకుల సదస్సులో వచ్చింది. అయితే ఎటువంటి తీర్మానాన్ని ఆమోదించకుండానే సభ ముగిసింది. ఆన్ని తెలుగు జిల్లాల ప్రతినిధులతో ఏర్పాటైన సమావేశంలో మాత్రమే తీర్మానం చెయ్యాలని నిర్ణయించి తీర్మానాన్ని వాయిదా వేసారు.
 
నిడదవోలు సభలో నిర్ణయించిన ప్రకారం [[1913]] [[మే 20]]న గుంటూరు జిల్లా [[బాపట్ల]]లో సమగ్ర '''ఆంధ్ర మహాసభ'''ను నిర్వహించారు. 800 మంది డెలిగేట్లు, 2000 మంది సందర్శకులూ ఈ సమావేశానికి హాజరయ్యారు. బి.ఎన్ శర్మ అధ్యక్షత వహించాడు.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/Andhra-Mahasabhalu-on-May-26/articleshow/19761956.cms|title=Andhra Mahasabhalu on May 26 {{!}} Hyderabad News - Times of India|last=Apr 28|first=TNN /|last2=2013|date=|website=The Times of India|language=en|url-status=live|archive-url=https://web.archive.org/web/20210105034632/https://timesofindia.indiatimes.com/city/hyderabad/Andhra-Mahasabhalu-on-May-26/articleshow/19761956.cms|archive-date=2021-01-05|access-date=2021-01-05|last3=Ist|first3=04:20}}</ref> ప్రత్యేకాంధ్రపై విస్తృతంగా చర్చ జరిగింది.<ref>{{Cite news|url=https://www.thehindu.com/news/cities/Vijayawada/bapatla-hosted-first-andhra-conference-in-1913/article29858594.ece|title=Bapatla hosted first Andhra Conference in 1913|last=Reporter|first=Staff|date=2019-11-02|work=The Hindu|access-date=2021-01-05|archive-url=https://web.archive.org/web/20210105033707/https://www.thehindu.com/news/cities/Vijayawada/bapatla-hosted-first-andhra-conference-in-1913/article29858594.ece|archive-date=2021-01-05|language=en-IN|issn=0971-751X}}</ref> అయితే రాయలసీమ, గంజాము, విశాఖపట్నం లకు చెందిన ప్రతినిధులు ప్రత్యేకాంధ్ర ప్రతిపాదనకు అంత సుముఖత చూపలేదు. తరువాతి రోజుల్లో పట్టాభి సీతారామయ్య ఈ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాడు. ఆంధ్రోద్యమానికి శ్రీకారం చుట్టారు.
 
ఆ తరువాత జరిగిన సభల్లో కూడా ప్రత్యేక రాష్ట్రం గురించిన చర్చలు జరిగాయి. రెండవ ఆంధ్ర మహాసభ [[1914]]లో విజయవాడలో జరిగింది. ఆ సభలో ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కావాలని అత్యధిక మద్దతుతో ఒక తీర్మానం చేసారు. [[కాకినాడ]]లో జరిగిన నాలుగవ ఆంధ్ర మహాసభలో [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]], [[కొండా వెంకటప్పయ్య]] కలిసి భారత రాష్ట్రాల పునర్నిర్మాణం పేరిట ఒక కరపత్రాన్ని తయారుచేసారు. దీన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెసు వాదులకు పంచిపెట్టారు.
పంక్తి 57:
ఈ సమయంలో [[1952]] [[అక్టోబర్ 19]]న [[పొట్టి శ్రీరాములు]] అనే గాంధేయవాది, మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేకాంధ్ర సాధనకై మద్రాసులో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించాడు. అఖిల భారత గాంధీ స్మారక నిధి ఆంధ్ర శాఖకు కార్యదర్శిగా ఉన్న శ్రీరాములు, తన పదవికి 16 వ తేదీన రాజీనామా చేసి దీక్షకు ఉపక్రమించాడు.మద్రాసు లోని బులుసు సాంబమూర్తి ఇంటిలో ఆయన దీక్షను మొదలుపెట్టాడు. ఈ దీక్ష ఆంధ్ర అంతటా కలకలం రేపినా, కాంగ్రెసు నాయకులు, కేంద్రప్రభుత్వంలో మాత్రం చలనం రాలేదు. 1952 [[డిసెంబర్ 15 ]]న 58 రోజుల అకుంఠిత దీక్ష తరువాత పొట్టి శ్రీరాములు '''అమరజీవి''' అయ్యాడు.<ref>{{Cite web|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=26499|title=ఆంధ్రరాష్ట్ర సాధనకు శ్రీరాములు గారి ప్రాణార్పణ|last=|first=|date=|website=ఆంధ్రపత్రిక (www.pressacademyarchives.ap.nic.in)|url-status=live|archive-url=https://web.archive.org/web/20210105030333/http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=26499|archive-date=2021-01-05|access-date=2021-01-05}}</ref> ఆయన మృతి ఆంధ్రుల్లో క్రోధాగ్ని రగిలించి, హింసాత్మక ఆందోళనకు దారితీసింది.<ref>{{Cite web|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=26500|title=మొదటి పేజీలో పలు వార్తలు|last=|first=|date=|website=ఆంధ్రపత్రిక (www.pressacademyarchives.ap.nic.in)|url-status=live|archive-url=https://web.archive.org/web/20210105031111/http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=26500|archive-date=2021-01-05|access-date=2021-01-05}}</ref><ref>{{Cite web|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=58727|title=ఆంధ్రలో తిరిగి శాంతి నెలకొన్నట్లు మొదటి పేజీలో వార్త|last=|first=|date=|website=ఆంధ్రప్రభ (www.pressacademyarchives.ap.nic.in)|url-status=live|archive-url=https://web.archive.org/web/20210105031252/http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=58727|archive-date=2021-01-05|access-date=2021-01-05}}</ref> ప్రజల్లో అనూహ్యంగా వచ్చిన ఈ స్పందనను గమనించిన నెహ్రూ, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా లోక్‌సభలో 1952 [[డిసెంబర్ 19]]న ప్రకటించాడు.<ref>{{Cite web|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=58728|title=ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి నిర్ణయం|last=|first=|date=|website=ఆంధ్రప్రభ (www.pressacademyarchives.ap.nic.in)|url-status=live|archive-url=https://web.archive.org/web/20210105031550/http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=58728|archive-date=2021-01-05|access-date=2021-01-05}}</ref> 11 జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని 3 తాలూకాలు ఇందులో భాగంగా ఉంటాయి.
 
శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు, బళ్ళారి జిల్లాలోని రాయదుర్గం, ఆదోని, ఆలూరు తాలుకాలను కలుపుకుని [[1953]] [[అక్టోబర్ 1]]న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది (విజయనగరం, ప్రకాశం జిల్లాలు ఆ తరువాత ఏర్పడ్డాయి). బళ్ళారి జిల్లాలోని బళ్ళారి తాలూకాను ఎల్‌.ఎస్‌ మిశ్రా సంఘం నివేదిక ననుసరించి మైసూరు రాష్ట్రంలో కలిపేసారు.
 
[[1937]] నాటి శ్రీబాగ్‌ ఒడంబడిక ననుసరించి కొత్త రాష్ట్రానికి కర్నూలు ముఖ్యపట్టణం అయింది. టంగుటూరి ప్రకాశం [[ముఖ్యమంత్రి]] అయ్యాడు. సి.ఎం.త్రివేది [[గవర్నరు]] అయ్యాడు. నెహ్రూ చేతుల మీదుగా జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్రుల చిరకాల స్వప్నం ఫలించింది.