మొట్టమొదటి సారిగా ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన అధికారికంగా [[1912]] మేలో [[నిడదవోలు]]లో జరిగిన గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా నాయకుల సదస్సులో వచ్చింది. అయితే ఎటువంటి తీర్మానాన్ని ఆమోదించకుండానే సభ ముగిసింది. ఆన్ని తెలుగు జిల్లాల ప్రతినిధులతో ఏర్పాటైన సమావేశంలో మాత్రమే తీర్మానం చెయ్యాలని నిర్ణయించి తీర్మానాన్ని వాయిదా వేసారు.
నిడదవోలు సభలో నిర్ణయించిన ప్రకారం [[1913]] [[మే 20]]న గుంటూరు జిల్లా [[బాపట్ల]]లో సమగ్ర '''ఆంధ్ర మహాసభ'''ను నిర్వహించారు. 800 మంది డెలిగేట్లు, 2000 మంది సందర్శకులూ ఈ సమావేశానికి హాజరయ్యారు. బి.ఎన్[[బయ్యా నరసింహేశ్వరశర్మ|బయ్యా నరసింహేశ్వర శర్మ]] అధ్యక్షత వహించాడు.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/Andhra-Mahasabhalu-on-May-26/articleshow/19761956.cms|title=Andhra Mahasabhalu on May 26 {{!}} Hyderabad News - Times of India|last=Apr 28|first=TNN /|last2=2013|date=|website=The Times of India|language=en|url-status=live|archive-url=https://web.archive.org/web/20210105034632/https://timesofindia.indiatimes.com/city/hyderabad/Andhra-Mahasabhalu-on-May-26/articleshow/19761956.cms|archive-date=2021-01-05|access-date=2021-01-05|last3=Ist|first3=04:20}}</ref> ప్రత్యేకాంధ్రపై విస్తృతంగా చర్చ జరిగింది.<ref>{{Cite news|url=https://www.thehindu.com/news/cities/Vijayawada/bapatla-hosted-first-andhra-conference-in-1913/article29858594.ece|title=Bapatla hosted first Andhra Conference in 1913|last=Reporter|first=Staff|date=2019-11-02|work=The Hindu|access-date=2021-01-05|archive-url=https://web.archive.org/web/20210105033707/https://www.thehindu.com/news/cities/Vijayawada/bapatla-hosted-first-andhra-conference-in-1913/article29858594.ece|archive-date=2021-01-05|language=en-IN|issn=0971-751X}}</ref> అయితే ప్రత్యేకాంధ్ర గురించి ప్రజల్లో అవగాహన కలిగించే ప్రచారం చేపట్టాలని ప్రతిపాదన రాగా, రాయలసీమ, గంజాము, విశాఖపట్నం లకు చెందిన ప్రతినిధులు ప్రత్యేకాంధ్రదాని ప్రతిపాదనకుపట్ల అంత సుముఖత చూపలేదు. గంటి వెంకటరామయ్య, [[న్యాపతి సుబ్బారావు పంతులు]], [[మోచర్ల రామచంద్రరావు]], [[గుత్తి కేశవపిళ్లె|గుత్తి కేశవ పిళ్ళె]]<nowiki/>లు ప్రతిపాదనను వ్యతిరేకించిన వారిలో ప్రముఖులు. ఈ ప్రచార అంశాన్ని ఒక స్థాయీ సంఘానికి అప్పగించాలని [[కొండా వెంకటప్పయ్య]] చేసిన సవరణతో అది ఆమోదం పొందింది.<ref name=":0">{{Cite web|url=https://www.scribd.com/document/450625337/andhra-movement-pdf|title=andhra movement.pdf|website=Scribd|language=en|access-date=2021-01-05}}</ref> తరువాతి రోజుల్లో పట్టాభి సీతారామయ్య ఈ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాడు. ఆంధ్రోద్యమానికి శ్రీకారం చుట్టారు.
ఆ తరువాత జరిగిన సభల్లో కూడా ప్రత్యేక రాష్ట్రం గురించిన చర్చలు జరిగాయి. రెండవ ఆంధ్ర మహాసభ [[1914]]లో విజయవాడలో జరిగింది. ఆ సభలో ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కావాలని అత్యధిక మద్దతుతో ఒక తీర్మానం చేసారు. <ref name=":0" />[[కాకినాడ]]లో జరిగిన నాలుగవ ఆంధ్ర మహాసభలో [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]], [[కొండా వెంకటప్పయ్య]] కలిసి భారత రాష్ట్రాల పునర్నిర్మాణం పేరిట ఒక కరపత్రాన్ని తయారుచేసారు. దీన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెసు వాదులకు పంచిపెట్టారు.
==కాంగ్రెసుకు చేరిన ఉద్యమం==
పంక్తి 18:
==చట్ట సభల్లో చర్చ==
[[1918]]లో ప్రత్యేకాంధ్రోద్యమం మరో మెట్టెక్కింది. [[ఫిబ్రవరి 6]] న మద్రాసు శాసనసభలోకౌన్సిల్లో భాష ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్ర స్థాపన గురించి బిబయ్యా ఎన్నరసింహేశ్వర శర్మ ఒక ప్రతిపాదన ప్రవేశపెట్టాడు. ఆ ప్రతిపాదన ఇది:
''The redistribution of provincial areas on a language basis wherever... and to the extent possible, especially where the people speaking a distinct language and sufficiently large in number desire such a change''