పాల్కురికి సోమనాథుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''పాల్కురికి సోమనాధుడు''' (1160 - 1240), [[శివకవి యుగం|శివకవి యుగానికి]] చెందిన తెలుగు కవి. ఈ యుగానికి చెందిన "శివకవి త్రయం" అనబడే ముగ్గురు ముఖ్య కవులలో ఇతనొకడు. తక్కిన ఇద్దరు [[మల్లికార్జున పండితారాధ్యుడు]], [[నన్నెచోడుడు]].
 
పాల్కురికి సోమనాధుడు తెలుyగుతెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితుడు. [[వీరశైవం]] వ్యాప్తికి కృషి చేశాడు. వీరశైవ సంప్రదాయంలో సోమనాధుడు శివుని [[ప్రమధ గణాలు|ప్రమధ గణాలలో]] "భృంగి" అవతారం. అప్పటి ఇతర శివకవులు తమ రచనలలో బ్రాహ్మణులను గౌరవంగా ప్రస్తావించేవారు కాని పాల్కురికి సోమనాధుడు వారి ఆచార వ్యవహారాలను నిశితంగా నిరసించాడు.
 
సోమనాథుడు [[వరంగల్లు]] సమీపంలోని [[పాలకుర్తి|పాల్కురికి]] గ్రామంలో శ్రియాదేవి, విష్ణురామదేవుడు అనే '''వీరశైవ దంపతులకు''' జన్మించాడు. జన్మతహా వీరశైవుడైన సోమనాథుడు గురువు [[కట్టకూరి పోతిదేవర]] వద్ద వీరశైవ/శైవాగమ ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు.