గయుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) కొత్త పేజీ: '''గయుడు''' ఒక గంధర్వుడు మరియు మణిపురమునకు రాజు. ఒకనాడు శివుని పూ... |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''గయుడు''' ఒక గంధర్వుడు మరియు మణిపురమునకు రాజు.
ఒకనాడు శివుని పూజించి తిరుగు ప్రయాణంలో ఆకాశ మార్గాన పోవుచుండగా క్రిందికి [[ఉమ్మి]] వేసెను. అది అర్ఘ్యమిస్తున్న [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]] దోసిట పడినది. సూర్యభగవానుని ఆరాధిస్తున్న తనపై ఉమిసిన వానిని చంపుదునని శపథము చేసెను. ఆ పలుకులు ఆకాశవాణి వలన గయుడు విని బ్రహ్మ, పరమశివులను శరణువేడగా వారు తిరస్కరించిరి. గయుడు తనకు మరణం తప్పదు అనుకొనుచున్న సమయంలో నారదుడు మార్గమున కలుసుకొని [[అర్జునుడు|అర్జునుని]] శరణు వేడమని చెప్పెను. గయుడు అర్జునుని వద్దకు వేగముగా పోయి శరణార్ధిని, కాపాడమని ప్రార్ధించెను. అర్జునుడు అతనికి అభయమిచ్చెను. విషయము తెలిసిన తరువాత కృష్ణుని పగవాఅనిని తాను రక్షింపవలసి వచ్చినందులకు చాలా విచారించెను. కృష్ణుడు గయుని తనకు అప్పగించమని వర్తమానము పంపెను. శరణు వేడిన వానిని విడువనని అర్జునుడు జవాబు చెప్పెను. ఇరువైపుల వారు సంధి చేయుటకు ప్రయత్నించినా కూడా అది కుదరలేదు. చివరకు గయుని వలన కృష్ణార్జునులకు యుద్ధము వచ్చెను. వీరిరువురు ఘోరముగా పోరాడుచుండిరి. తుదకు దేవతలు వచ్చి వారి యుద్ధమును మాన్పించిరి. గయుడు కృష్ణుని పాదములపై పడి శరణు వేడగా అతడు మన్నించెను.
==ఇవి కూడా చూడండి==
|