ఓగిరాల రామచంద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
గుణసుందరి కథ చిత్రం విజయం సాధించడానికి ముఖ్య కారణాలలో ఓగిరాల సంగీతం ఒకటి. [[పి.లీల]], [[టి.జి.కమలాదేవి]], [[కస్తూరి శివరావు]], [[శాంతకుమారి]], [[కె.మాలతి|మాలతి]], [[ఘంటసాల]] తదితరులతో ఓగిరాల పాడించిన పాటలు విశేష జనాదరణ పొందాయి. ఈ చిత్రంలో పాటలన్నీ [[పింగళి నాగేంద్రరావు]] రాశారు. ఓగిరాల [[పి.లీల]] చేత పాడించినవన్నీ భక్తి పాటలే, వాటిలో ''శ్రీ తులసి ప్రియ తులసి'' పాట చాలా కాలం అందరి ఇళ్ళల్లో వినిపించేది, ఆ పాట పాడుతూ ప్రతీ స్త్రీ తులసి మాతను ఆరాధించేది. [[శాంతకుమారి]], [[మాలతి]] కలిసి పాడిన ''కలకలా ఆ కోకిలేమో'', ''చల్లని దొరవేలె చందమామ'' పాటలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. [[ఘంటసాల]] ఈ చిత్రంలో ''అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా'' అనే నేపథ్యగీతం పాడారు. అలాగే కస్తూరి శివరావు, [[టి.జి.కమలాదేవి]], వి.శివరాం పాడిన పాటలు కూడా పేరు పొందాయి.
 
పెద్ద మనుషుల చిత్రంలో [[రేలంగి]]కి [[ఘంటసాల]] పాడిన ''నందామయా గురుడ నందామయా'', ''శివశివ మూర్తివి గణనాథా'' బాగా జనాదరణ పొందాయి. ఆ రెండూ పాటలను [[కొసరాజు రాఘవయ్య చౌదరి|కొసరాజు]] రాశారు. పి.లీల ఈ చిత్రంలో మూడు పాటలు పాడింది, ఆమె పాడిన ''నీ మీద ప్రాణాలు నిలిపింది రాధ'' పాట హిందీ చిత్రం ''అల్‌బేలా''లోని పాటకు అనుకరణగా సంగీతం అందించారు, లీలనే పాడిన ''అంతభారమైతినా అంధురాలనే దేవ'' పాట మనస్స్సుకు హత్తుకునే విధంగా సంగీతం అందించారు. ఈ చిత్రం జాతీయ బహుమతి పొందిన మొట్టమొదటి తెలుగు చిత్రం. ఈ విధంగా జాతీయ బహుమతి పొందిన మొదటి తెలుగు చిత్రానికి సంగీతమందించిన వ్యక్తిగా ఓగిరాల కీర్తి పొందారు.
 
==మరణం==