వైష్ణవ దేవి ఆలయం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతదేశం ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
ఈ ఆలయం ఉత్తర భారత్ లోని [[జమ్మూ కాశ్మీరు|జమ్ము- కాశ్మీర్]] రాష్ట్రంలో జమ్మూకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణిలో ఉంది. జమ్ము నుండి 50 కిలో మీటర్ల దూరంలో వున్న కాట్రా ప్రాంతానికి హెలి కాప్టర్లలో వెళ్లవచ్చు. ఇతర వాహనాలు వుంటాయి. అక్కడి నుండి కాలి నడకన, గుర్రాలమీద, పల్లకిల్లో ఎలాగైనా వెళ్లవచ్చు. ఇక్కడికి ఆలయం సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ దారి చాల కష్టతరమైంది. తిరుపతి కొండ ఎక్కేవారు గోవిందా గోవింద అని అరుస్తున్నట్లే ఇక్కడ కూడ కొండ ఎక్కేవారు జై మాతాజూ అంటూ అరుస్తుంటారు. ఇంకా చాల దూరం వుందనగానే అమ్మవారి ఆలయం కనిపిస్తూనే వుంటుంది. ఈ ఆలయం వున్న ప్రాంతాన్ని భవన్ అని అంటారు. భక్తులను గ్రూపులుగా విభజించి వారికి ఒక నెంబరిస్తారు. దాని ప్రకారం భక్తులను ఆలయంలోనికి అనుమతిస్తారు. ఆలయం లోపలికి సెల్ ఫోన్లు, కెమెరాలు, అలాగే తోలుతో చేసిన ఏ వస్తువును అనుమతించరు. కనుక వాటిని కలిగి వున్నవారు వాటిని అక్కడే లాకర్లలో భద్ర పరుచు కోవచ్చు.<ref>{{Cite web |url=https://www.maavaishnodevi.org/accomodations.aspx |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2017-06-08 |archive-url=https://web.archive.org/web/20160324172138/https://www.maavaishnodevi.org/accomodations.aspx |archive-date=2016-03-24 |url-status=dead }}</ref> వైష్ణో దేవి మూడు రూపాల్లో దర్శనమిస్తుంది. అవి మహాకాళి, మహా లక్ష్మి, సరస్వతి. ఆలయానికి వెళ్లే దారిలో ఇతర పురాతనమైన చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి.<ref>{{Cite web |url=https://www.maavaishnodevi.org/index.aspx |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2017-06-08 |archive-url=https://web.archive.org/web/20161031113033/https://www.maavaishnodevi.org/index.aspx |archive-date=2016-10-31 |url-status=dead }}</ref>
 
ఈ అమ్మ వారి ఆలయం ఉత్తర భారతాన [[జమ్మూ జిల్లా|జమ్మూ జిల్లాలోని]], కాట్రాలో[[కట్రా (జమ్మూ కాశ్మీరు)|కట్రా పట్టణంలో]] ఉంది. ఈ ఆలయ వార్షికాదాయం ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. పర్వ దినాలలో ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య లక్షలలో వుండగా కానుకలుగా ఆలయానికి 15 కోట్ల రూపాయలు వచ్చాయి.<ref>http://timesofindia.indiatimes.com/business/india-business/Money-spinning-mandirs/articleshow/5108844.cms</ref>
==స్థల పురాణం==
[[Image:Vaishno.jpg|thumb|300x300px|వైష్ణోదేవి భవన్.]] జమ్మూలోని పర్వత సానువులలో ఉన్న అమ్మవారి ఆరాధన ఎప్పుడు మొదలైందనేది ఇదమిత్థంగా చెప్పలేం. కానీ పిండీలు అని పిలవబడే మూర్తులు మూడు కొన్ని లక్షల సంవత్సరాలుగా అక్కడ ఉన్నాయని భూగోళ శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. త్రికూట పర్వతంగా ఋగ్వేదంలో చెప్పబడిన పర్వతసమూహం ఇదేనని కొందరి వాదన. ఋగ్వేదంలో ఇక్కడ శక్తి ఆరాధన జరుగుచుండేదని చెప్పబడింది. 
"https://te.wikipedia.org/wiki/వైష్ణవ_దేవి_ఆలయం" నుండి వెలికితీశారు