క్షేత్రయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: కూచిపూడికూచిపూడి
పంక్తి 16:
==దేశాటనం, సన్మానాలు, గుర్తింపు==
[[దస్త్రం:Kshetrayya.jpg|thumbnail|క్షేత్రయ్య చిత్రపటం]]
ఆంధ్ర దేశంలోని [[తిరుపతి]], [[కడప]], [[శ్రీశైల క్షేత్రం|శ్రీశైలం]] మున్నగు క్షేత్రాలలో నెలకొన్న దేవతలపైనే కాక, [[కంచి]], [[శ్రీరంగం]], [[మధుర]], [[తిరువళ్ళూరు]]లలో వెలసిన స్వామి వార్లపై కూడా క్షేత్రయ్య పదాలు రచించారు. కాని, అన్నిటిని మువ్వ గోపాలునికి [[అంకితం]] గావించి ఆ స్వామితో ఆయా దేవతలకు అభేదం కల్పించారు. ఈ దేశాటనం కారణంగానే అతనికి క్షేత్రయ్య అనే నామం స్థిరమైనదనిపిస్తున్నది.
 
ముందుగా [[గుంటూరు]] జిల్లా [[బెల్లంకొండ]]లో చలువు చక్కరపురీశుని దర్శించాడు (చలువ చక్కెరపురి నిలయుడని మదిలో వలవేసి నిను వలపించలేద?) . అనంతరం భద్రాచలం లోని సీతారామచంద్రస్వామిని, పిదప [[శ్రీశైల క్షేత్రం|శ్రీశైలం]] మల్లికార్జునుని, ఆపై హంపి హేమాద్రి నిలయుని దర్శించాడు. క్షేత్రయ్య దర్శించిన ఇతర క్షేత్రాలు - పాలగిరి చెన్నకేశవుడు, ఇనగలూరు ఇనపురి స్వామి, (దేవుని) కడప వెంకటేశ్వర స్వామిని దర్శించాడు. తిరుపతి చేరి వెంకటేశ్వర స్వామి, ఇతర దేవతామూర్తులపై అనేక పదాలు రచించాడు.
 
పిదప దక్షిణాభిముఖంగా సాగి (దక్షిణ ఆర్కాటు జిల్లా) కోవిల్లూరు మువ్వగోపాల స్వామిని దర్శించాడు. తిరువళ్ళూరు వీర రాఘవస్వామి, వేద నారాయణపురం వేదపురీశుడు, [[సత్యవేడు]] సత్యపురవాసుదేవుడు, కరిగిరి స్వామి దేవుళ్ళ దర్శనం చేసుకొన్నాడు. మార్గంలో పండితుల, పాలకుల సత్కారాలందుకొన్నాడు. క్షేత్రయ్యను ఎందరో ప్రభువులు సన్మానించారు. వారిలో మధురనేలిన [[తిరుమల నాయకుడు]], [[గోల్కొండ]] నవాబు, [[తంజావూరు]] [[రఘునాధ నాయకుడు]], చెంజి కృష్ణప్ప నాయుడు (తుపాకుల రాయుడు) ప్రముఖులు. రఘునాధ నాయకునిపై క్షేత్రయ్య వేయి పదాలు చెప్పాడు.
"https://te.wikipedia.org/wiki/క్షేత్రయ్య" నుండి వెలికితీశారు